Kerala: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అత్యాచార ఆరోపణలు.. అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే
Congress MLA physically assaulted a woman: కేరళలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అత్యాచార కేసు నమోదు అయింది. ఒక మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎల్డోస్ కున్నప్పిల్లి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళ ఆరోపిస్తోంది. అయితే ఈ కేసు నమోదు అయినప్పటి నుంచి సదురు ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లారు. పెరంబవూర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు సంబంధించిన రెండు సెల్ ఫోన్లు స్విచ్ఛాప్ లో ఉన్నాయని.. అతన్ని ఇప్పటి వరకు సంప్రదించలేదని శుక్రవారం పోలీసులు వెల్లడించారు.
కాగా.. తనను ఎమ్మెల్యే కిడ్నాప్ చేసి అసభ్యంగా ప్రవర్తించారని మహిళ ఫిర్యాదు చేయడంతో ఎల్డోస్ కున్నప్పిల్లిపై కేసు నమోదు అయింది. కాంగ్రెస్ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్ మాట్లాడుతూ.. గత రెండు రోజుల నుంచి అన్ని సోర్సెస్ ఉపయోగించి ఎమ్మెల్యేతో మాట్లాడేందుకు ప్రయత్నించామని కానీ కుదరలేదని ఆయన అన్నారు. ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్న తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం లేదని సతీశన్ అన్నారు.
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
Read Also: Freebies: రాజకీయ “ఉచితాల”పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు “నో”
ఈ అంశంపై కేరళ పీసీసీ స్పష్టమైన వైఖరితో ఉందని.. అధికార సీపీఎం, వారి నాయకులపై ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీని కాపాడుకునేలా చేసేదని.. కాంగ్రెస్ అలా చేయదని ఆయన అన్నారు. కేరళ పీసీసీ ఎమ్మెల్యే నుంచి వివరణ కోరిందని.. దాని కోసం చూస్తున్నామని సతీశన్ అన్నారు. ఒక మహిళ న్యాయం కోసం సమాజం ముందు నిల్చుందని దానిని విస్మరించలేమని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే బాధిత మహిళను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. సీఆర్పీసీ 164 కింద్ర మెజిస్ట్రేట్ కు మహిళ వాంగ్మూలం ఇస్తుందని క్రైం బ్రాంచ్ డీవైఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు. ఈ ఘటన అసెంబ్లీ వెలుపన జరిగింది కనుక.. స్పీకర్ కు చెప్పాల్సిన అవసరం లేదని పోలీస్ అధికారులు తెలిపారు.
పెరుంబవూర్ ఎమ్మెల్యే తనను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి ఫిర్యాదు మేరకు కేరళ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 14న జరిగిన ఈ ఘటనపై ఎమ్మెల్యేతో పాటు అతని సహాయకుడు, స్నేహితుడితో సహా ముగ్గురిపై కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ కేసును పరిష్కరించేందుకు సదరు మహిళకు ఎమ్మెల్యే రూ. 30 లక్షలు ఆఫర్ చేసినట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Punjab Kings Record: మోస్ట్ సక్సెస్ ఫుల్ రన్ ఛేజింగ్లు.. ఐపీఎల్లో టాప్ లేపిన పంజాబ్ కింగ్స్, ఫుల్ లిస్ట్ ఇదే!
-
NBK 111 : బాలయ్య సంచలన నిర్ణయం: రెమ్యునరేషన్ తగ్గించుకున్న నటసింహం.. కారణం అదేనా?
-
Prabhas – Salman Khan : మరోసారి ప్రభాస్ వర్సెస్ సల్మాన్ ఖాన్.. ఇద్దరి మధ్య గట్టి పోటీ
-
SA vs IND Women: భారత్ గెలిచిందోచ్.. ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మ.!
-
Punjab Kings History: అయ్య బాబోయ్ పంజాబ్ కింగ్స్.. ఇన్నిసార్లు 200+ లక్ష్యాలను ఛేజ్ చేసిందా?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!