Freebies: రాజకీయ “ఉచితాల”పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు “నో”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court Rejects Urgent Hearing of Pleas Over Political Freebies: ఎన్నికల సమయంలో పలు రాజకీయ పార్టీలు వాగ్ధానం చేసే ఉచితాలపై అత్యవసర విచారణ జపరపాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఉచితాలపై అత్యవసరంగా విచారణ జరపాలని దాఖలైన పిటిషన్ ను ఈ రోజు తిరస్కరించింది. ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్, న్యాయమూర్తి హేమంత్ గుప్తాతో కూడిన దర్మాసనం ముందుకు ఈ కేసు వచ్చింది. న్యాయమాది అశ్విని ఉపాధ్యాయ్ గుజరాత్ ఎన్నికలు వస్తున్నాయని.. పార్టీలు బాధ్యతారాహిత్యమైన వాగ్ధానాలు చేస్తున్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సీజేఐ లలిత్ మాట్లాడుతూ.. దీనిపై అత్యవసర విచారణ అవసరం లేదని స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా చాలా రాజకీయ పార్టీలు ప్రజలకు ఉచిత హామీలు ఇస్తున్నాయని..ఇది దేశ ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపిస్తుందంటూ గతంలో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. దీనిపై అప్పటి సీజేఐ ఎన్వీ రమణ విస్తృత చర్చ అవసరమని త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయ పార్టీలు చేసే వాగ్ధానాలను అడ్డుకోలేమని వ్యాఖ్యానించింది. ఉచితాలు దేశఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయని రాజకీయా పార్టీలనింటి మధ్య ఏకాభిప్రాయం ఉంటే తప్పా.. ఈ కేసులో ఏమి జరగదని గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు.. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని గతంలో సీజేఐగా ఉన్న ఎన్వీ రమణ ఆదేశించారు.
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, డీఎంకే పార్టీలు ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్ వంటి వారు పార్టీలు ఇచ్చే హామీలు ఉచితాలు కావని, ప్రజా సంక్షేమ పథకాలని వ్యాఖ్యానించారు. ఉచిత నీరు, విద్యుత్, ఉచిత రవాణా వంటివి రాజకీయ ఉచితాలు కావని.. సమాజంలో అసమానతలను తగ్గించే సంక్షేమ పథకాలని ఆప్ తెలిపింది.
న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్ లో అహేతుకమైన ఉచితాలు పంపిణీ చేస్తామని వాగ్ధానాలు చేస్తున్న పార్టీల ఎన్నికల గుర్తులను స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరారు. రాజకీయ లబ్ధి కోసమే పార్టీలు ఏకపక్షంగా వాగ్ధానాలు చేస్తున్నాయని.. అహేతుకమైన ఉచితాలను ఇవ్వడం, ఓటర్లను ఆకర్షించడం లంచంతో సమానమని పిటిషన్ లో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతను ఉచితాలు దెబ్బతీస్తున్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!