Adani- Congress: అమెరికాలో అదానీపై కేసు.. జేపీసీకి కాంగ్రెస్ డిమాండ్
- గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు..
- జేపీసీ విచారణ చేయించాలని కాంగ్రెస్ డిమాండ్..
- మోడీ- అదానీ బంధంపై విచారణ చేయాలని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adani- Congress: గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడంతో కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయింది. ఆయన వ్యవహారాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దర్యాప్తునకు ఏర్పాటు చేయాలనే డిమాండ్ చేసింది. లంచం, మోసం చేశారనే అభియోగాలపై అదానీతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఈ ఆరోపణలతో స్టాక్ మార్కెట్ సైతం భారీగా పడిపోయాయి. మరోపక్క, రాజకీయంగానూ ఈ వ్యవహారం తీవ్ర వివాదానికి దారి తీసింది.
Read Also: Deputy CM Pawan Kalyan: విశాఖ కాలుష్య నివారణకు చర్యలు.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
Also Read
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
- PMO Official Gifts: మెలోడీ చాక్లెట్ వివాదం.. విదేశీ పర్యటనల్లో ప్రధాని ఇచ్చిన కానుకల వివరాలు వెల్లడించిన పీఎంఓ
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
ఇక, గౌతమ్ అదానీపై యూఎస్ లో కేసు ఫైల్ కావడంతో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా హమ్ అదానీ కె హై సిరీస్లో ఇప్పటి వరకు వందలాది ప్రశ్నలు సంధించాం.. కానీ, మోడీ- అదానీ బంధంపై వేసిన ప్రశ్నలకు ఇప్పటి వరకు ఆన్సర్ దొరకలేదని విమర్శించారు. మోదాని కుంభకోణంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేయాలని విపక్షాలు 2023 జనవరి నుంచి డిమాండ్ చేస్తున్నాయని జైరాం రమేష్ వెల్లడించారు.
Read Also: Indian Railways: నవంబర్ చివరికి 370 రైళ్లలో 1000 కొత్త జనరల్ కోచ్లు
గతంలో గౌతమ్ అదానీ కంపెనీ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోంది.. ఖాతాల్లో కుట్ర చేస్తోందని అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ ఓ నివేదిక ఇవ్వడంతో.. తీవ్ర దుమారానికి దారి తీసింది. అయితే, ఈ ఆరోపణలను అదానీ సంస్థ ఖండించింది.. కానీ, ఆ తర్వాత కూడా ఈ మొత్తం వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ డిమాండ్ చేశాయి.
The indictment of Gautam Adani and others by the Securities and Exchanges Commission (SEC) of the US vindicates the demand that the Indian National Congress has been making since Jan 2023 for a Joint Parliamentary Committee (JPC) investigation into the various Modani scams. The…
— Jairam Ramesh (@Jairam_Ramesh) November 21, 2024
తాజావార్తలు
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
-
YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
-
OPPO Find X9s: ఒప్పో ఫైండ్ X9s వచ్చేసింది.. 50MP కెమెరా, 7025mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!