Manipur Violence: మణిపూర్లో హింసకు కాంగ్రెస్సే కారణం: సీఎం బీరేన్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Violence: సుమారు మూడున్నర నెలలకు పైగా మణిపూర్లో హింస కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మణిపూర్లో హింసను నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నిచర్యలు తీసుకున్నప్పటికీ నియంత్రణ కావడం లేదు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన అనంతరం మణిపూర్లో ప్రస్తుతం మణిపూర్లో జరుగుతున్న హింసకు కాంగ్రెస్సే కారణం మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మండిపడ్డారు. రాష్ట్రంలో హింసను సృష్టించింది కాంగ్రెస్సేనని ఆరోపించారు. మనుషుల జీవితాలతో రాజకీయాలు చేయొద్దని బీరేన్ సింగ్ సూచించారు. లడఖ్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మణిపూర్ హింసపై మాట్లాడటాన్ని సీఎం తప్పుపట్టారు. లడఖ్లో ఉంటే లడఖ్ గురించే మాట్లాడాలి కానీ మణిపూర్ గురించి కాదని హితవుపలికారు. లడఖ్ వెళ్తే అక్కడి సమస్యల గురిచే మాట్లాడాలి.. ప్రస్తుతం మణిపూర్లో జరుగుతున్న వాటన్నింటికీ కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు ఎప్పటికప్పుడు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా సలహాలు తీసుకుంటున్నామని సీఎం బీరేన్ సింగ్ తెలిపారు.
Read Also: Telangana: డాక్టర్ లేకపోవడంతో బాలింతకు కాన్పు చేసిన నర్సు..అయ్యో పాపం ఎంత పనైంది..
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
పార్లమెంటులో ప్రధాని మోడీ, అమిత్ షాల ప్రకటనల తర్వాత మణిపూర్లో శాంతి నెలకొందని.. మణిపూర్ విడిచి వెళ్లిన వారు తిరిగి చేరుకుంటున్నారని.. ప్రజల పునరావాసం మరియు స్థిరనివాసం కోసం చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం తెలిపారు. ఎన్. బీరేన్ సింగ్ గురువారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై వివరించారు. మణిపూర్లో సాధారణ స్థితిని తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కూడా ఆయన అమిత్ షాకు తెలియజేశారు. మణిపూర్లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రితో భేటీ సందర్భంగా సీఎంతో పాటు మణిపూర్కు చెందిన కొందరు మంత్రులు కూడా ఉన్నారు. “మేము హోంమంత్రి సలహా తీసుకోవడానికి ఇక్కడకు వచ్చాము” అని షాను కలవడానికి ముందు సింగ్ చెప్పారు. ఆగస్టు 29 న మణిపూర్ శాసనసభ యొక్క ఒక రోజు సమావేశానికి ముందు షా మరియు సింగ్ మధ్య సమావేశం జరిగింది.
రాష్ట్రంలో పరిస్థితులు మెల్లగా మెరుగవుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు.
తాజావార్తలు
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
-
Red Magic Tablet 5 Pro: రెడ్ మ్యాజిక్ టాబ్లెట్ 5 ప్రో వచ్చేస్తోంది.. 8300mAh బ్యాటరీ, 185Hz OLED డిస్ప్లే
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!