Manipur Violence: మణిపూర్లో హింసకు కాంగ్రెస్సే కారణం: సీఎం బీరేన్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Violence: సుమారు మూడున్నర నెలలకు పైగా మణిపూర్లో హింస కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మణిపూర్లో హింసను నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నిచర్యలు తీసుకున్నప్పటికీ నియంత్రణ కావడం లేదు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన అనంతరం మణిపూర్లో ప్రస్తుతం మణిపూర్లో జరుగుతున్న హింసకు కాంగ్రెస్సే కారణం మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మండిపడ్డారు. రాష్ట్రంలో హింసను సృష్టించింది కాంగ్రెస్సేనని ఆరోపించారు. మనుషుల జీవితాలతో రాజకీయాలు చేయొద్దని బీరేన్ సింగ్ సూచించారు. లడఖ్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మణిపూర్ హింసపై మాట్లాడటాన్ని సీఎం తప్పుపట్టారు. లడఖ్లో ఉంటే లడఖ్ గురించే మాట్లాడాలి కానీ మణిపూర్ గురించి కాదని హితవుపలికారు. లడఖ్ వెళ్తే అక్కడి సమస్యల గురిచే మాట్లాడాలి.. ప్రస్తుతం మణిపూర్లో జరుగుతున్న వాటన్నింటికీ కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు ఎప్పటికప్పుడు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా సలహాలు తీసుకుంటున్నామని సీఎం బీరేన్ సింగ్ తెలిపారు.
Read Also: Telangana: డాక్టర్ లేకపోవడంతో బాలింతకు కాన్పు చేసిన నర్సు..అయ్యో పాపం ఎంత పనైంది..
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
పార్లమెంటులో ప్రధాని మోడీ, అమిత్ షాల ప్రకటనల తర్వాత మణిపూర్లో శాంతి నెలకొందని.. మణిపూర్ విడిచి వెళ్లిన వారు తిరిగి చేరుకుంటున్నారని.. ప్రజల పునరావాసం మరియు స్థిరనివాసం కోసం చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం తెలిపారు. ఎన్. బీరేన్ సింగ్ గురువారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై వివరించారు. మణిపూర్లో సాధారణ స్థితిని తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కూడా ఆయన అమిత్ షాకు తెలియజేశారు. మణిపూర్లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రితో భేటీ సందర్భంగా సీఎంతో పాటు మణిపూర్కు చెందిన కొందరు మంత్రులు కూడా ఉన్నారు. “మేము హోంమంత్రి సలహా తీసుకోవడానికి ఇక్కడకు వచ్చాము” అని షాను కలవడానికి ముందు సింగ్ చెప్పారు. ఆగస్టు 29 న మణిపూర్ శాసనసభ యొక్క ఒక రోజు సమావేశానికి ముందు షా మరియు సింగ్ మధ్య సమావేశం జరిగింది.
రాష్ట్రంలో పరిస్థితులు మెల్లగా మెరుగవుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!