BJP: ‘‘ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం రిజర్వేషన్’’.. ‘‘కాంగ్రెస్ ఒక ముస్లింలీగ్’’
- కాంట్రాక్టుల్లో 4 శాతం ముస్లిం రిజర్వేషన్..
- కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం..
- కాంగ్రెస్ ముస్లింలీగ్ అంటూ అమిత్ మాల్వియా విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం రిజర్వేషన్లు ప్రకటించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ ఒక నిర్దిష్ట మత సమాజానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని మండిపడింది. కాంగ్రెస్ని ‘‘ఆధునిక ముస్లింలీగ్’’గా అభివర్ణించింది. కొన్ని రాజకీయ పార్టీలు బుజ్జగింపు రాజకీయాలు మాత్రమే చేస్తాయని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు.
కర్ణాటక క్యాబినెట్ కర్ణాటక పారదర్శకత ప్రజా సేకరణ(KTPP) చట్టానికి సవరణను ఆమోదించింది. ఇది ముస్లిం కాంట్రాక్టర్లకు టెండర్లలో 4 శాతం రిజర్వేషన్లను కల్పించనుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన విధాన సభలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో కేటీపీపీ చట్టాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ సవరణ చేయాలని నిర్ణయించారని అధికారిక వర్గాలు తెలిపాయి. మార్చి 7న కర్ణాటక ప్రభుత్వ బడ్జెట్ సమర్పిస్తూ, సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వ పనుల కాంట్రాక్టుల్లో 4 శాతం ఇప్పుడు ముస్లింలకు కేటగిరి -2బి అనే కేటగిరీ కింద రిజర్వ్ చేస్తామని చెప్పారు.
Also Read
- CM Vijay: 20 ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం.. మద్యం షాపుల్లో పని చేసే ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు
- Gurugram: గురుగ్రామ్పై జలఖడ్గం.. 10 కి.మీ ట్రాఫిక్ జామ్.. ఎటుచూసినా నీళ్లే
- Bihar: ప్రశాంత్ కిషోర్కు పోటీగా బీజేపీ నుంచి అభిషేక్ కుమార్.. బంకీపూర్ బైపోల్స్లో టఫ్ ఫైట్
- Wayanad: వయనాడ్లో కొండచరియలు బీభత్సం.. నలుగురు మృతి.. వీడియో వైరల్
Read Also: VC Sajjanar : బెట్టింగ్ యాప్లపై యుద్ధం.. సామాజిక మార్పు కోసం సజ్జనార్ పిలుపు
ఈ రిజర్వేషన్లపై బీజేపీ నేత అమిత్ మాల్వియా ధ్వజమెత్తారు. కర్ణాటక కాంగ్రెస్ ఒక వర్గానికి అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాలు ‘‘రాజ్యాంగ విరుద్ధం’’ అని అన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన పూర్తి దృష్టిని కేవలం రెండు విషయాలపైనే కేంద్రీకరిస్తుందని ఆరోపించారు. ఒకటి అవినీతి, రెండోది బుజ్జగింపు రాజకీయాలు అని మాల్వియా ఎక్స్లో విమర్శించారు. మతం ఆధారంగా ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి, ప్రయోజనాలను అందించడానికి భారత రాజ్యంగం మద్దతు ఇవ్వదని మాల్వియా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మతానికి అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకించారు. కాంగ్రెస్ అంటేనే న్యూ ముస్లిం లీగ్ అని విమర్శించారు.
తాజావార్తలు
-
New Players: టీమిండియాలోకి ముగ్గురు కొత్త యువ ఆటగాళ్లు.. మొదటిసారి టీ20 జట్టులోకి..
-
Iron Rich Snacks: మన తాత ముత్తాతల ఆరోగ్యం.. ఈ ఒక్క స్నాక్తో మీ పిల్లలకు ఐరన్, కాల్షియం కొండంత బలం!
-
CM Vijay: 20 ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం.. మద్యం షాపుల్లో పని చేసే ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు
-
CM Revanth Reddy : కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే నా లక్ష్యం
-
Gurugram: గురుగ్రామ్పై జలఖడ్గం.. 10 కి.మీ ట్రాఫిక్ జామ్.. ఎటుచూసినా నీళ్లే
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!