BJP: ‘‘ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం రిజర్వేషన్’’.. ‘‘కాంగ్రెస్ ఒక ముస్లింలీగ్’’
- కాంట్రాక్టుల్లో 4 శాతం ముస్లిం రిజర్వేషన్..
- కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం..
- కాంగ్రెస్ ముస్లింలీగ్ అంటూ అమిత్ మాల్వియా విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం రిజర్వేషన్లు ప్రకటించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ ఒక నిర్దిష్ట మత సమాజానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని మండిపడింది. కాంగ్రెస్ని ‘‘ఆధునిక ముస్లింలీగ్’’గా అభివర్ణించింది. కొన్ని రాజకీయ పార్టీలు బుజ్జగింపు రాజకీయాలు మాత్రమే చేస్తాయని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు.
కర్ణాటక క్యాబినెట్ కర్ణాటక పారదర్శకత ప్రజా సేకరణ(KTPP) చట్టానికి సవరణను ఆమోదించింది. ఇది ముస్లిం కాంట్రాక్టర్లకు టెండర్లలో 4 శాతం రిజర్వేషన్లను కల్పించనుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన విధాన సభలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో కేటీపీపీ చట్టాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ సవరణ చేయాలని నిర్ణయించారని అధికారిక వర్గాలు తెలిపాయి. మార్చి 7న కర్ణాటక ప్రభుత్వ బడ్జెట్ సమర్పిస్తూ, సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వ పనుల కాంట్రాక్టుల్లో 4 శాతం ఇప్పుడు ముస్లింలకు కేటగిరి -2బి అనే కేటగిరీ కింద రిజర్వ్ చేస్తామని చెప్పారు.
Also Read
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
- BRICS: బ్రిక్స్లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
- Su-57E Stealth Fighter: భారత్కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్కు చెక్..
Read Also: VC Sajjanar : బెట్టింగ్ యాప్లపై యుద్ధం.. సామాజిక మార్పు కోసం సజ్జనార్ పిలుపు
ఈ రిజర్వేషన్లపై బీజేపీ నేత అమిత్ మాల్వియా ధ్వజమెత్తారు. కర్ణాటక కాంగ్రెస్ ఒక వర్గానికి అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాలు ‘‘రాజ్యాంగ విరుద్ధం’’ అని అన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన పూర్తి దృష్టిని కేవలం రెండు విషయాలపైనే కేంద్రీకరిస్తుందని ఆరోపించారు. ఒకటి అవినీతి, రెండోది బుజ్జగింపు రాజకీయాలు అని మాల్వియా ఎక్స్లో విమర్శించారు. మతం ఆధారంగా ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి, ప్రయోజనాలను అందించడానికి భారత రాజ్యంగం మద్దతు ఇవ్వదని మాల్వియా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మతానికి అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకించారు. కాంగ్రెస్ అంటేనే న్యూ ముస్లిం లీగ్ అని విమర్శించారు.
తాజావార్తలు
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!