BJP: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం రిజర్వేషన్లు ప్రకటించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ ఒక నిర్దిష్ట మత సమాజానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని మండిపడింది. కాంగ్రెస్ని ‘‘ఆధునిక ముస్లింలీగ్’’గా అభివర్ణించింది. కొన్ని రాజకీయ పార్టీలు బుజ్జగింపు రాజకీయాలు మాత్రమే చేస్తాయని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు.