Haryana: హర్యానాలో ఆప్-కాంగ్రెస్ పొత్తుపై సందిగ్ధత.. కారణమిదేనా?
- హర్యానాలో ఆప్.. కాంగ్రెస్ పొత్తుపై సందిగ్ధత
- 20 సీట్లు అడుగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ
- తగ్గించుకోవాలంటున్న కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలోనే హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించేస్తున్నారు. అయితే ఇండియా కూటమిలో మాత్రం సందిగ్ధత నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయితీ తెగకపోవడంతో అయోమయం నెలకొంది. దీంతో పొత్తు పొడుస్తుందా? లేదా? అన్నది మీమాంసం నెలకొంది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: చెరువుల ఆక్రమణలపై రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్
Also Read
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ ఆప్ 20 సీట్లు ఆశిస్తోంది. కానీ కాంగ్రెస్ మాత్రం అన్ని సీట్లు ఇచ్చేందుకు ససేమిరా అంటోంది. దీంతో పొత్తుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆప్కి 20 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేనట్లుగా కనిపిస్తోంది. మంగళవారం జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఆప్ పోటీ చేసే స్థానాల జాబితాను ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఈ జాబితా అందాక తదుపరి నిర్ణయం ఉండొచ్చని సమాచారం. ఇదిలా ఉంటే హర్యానాలో పొత్తుకు రాహుల్ గాంధీ సానుకూలంగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని ఆప్ నేతలు అంటున్నారు. అయితే 20 సీట్లు కాకుండా.. కొన్ని సీట్లు తగ్గించి ఇచ్చేలా ఆప్ నేతలతో కాంగ్రెస్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Bengaluru: రూ.17లక్షల ఖరీదైన పట్టుచీరలు లూటీ.. చివరికిలా దొరికిపోయారు!
అక్టోబర్ 5న హర్యానాలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి. తొలుత అక్టోబర్ 1నే ఓటింగ్కు షెడ్యూల్ విడుదలైంది. అయితే అక్కడ జరగనున్న ఫెస్టివల్ సందర్భంగా పోలింగ్ తేదీ మారింది. జమ్మూకాశ్మీర్లో మాత్రం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మాత్రం హర్యానాతో పాటు అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Balakrishna: తెలుగు రాష్ట్రాల వరదలు.. బాలయ్య కోటి విరాళం
తాజావార్తలు
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
-
RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
-
SRH Vs RCB: ఉప్పల్లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
ట్రెండింగ్
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!