Congress: “ఆ ఎంపీ బిజినెస్లో మాకు సంబంధం లేదు”.. ఐటీ రైడ్స్కి దూరంగా కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఆయన నివాసాల్లో ఐటీ దాడులు జరిగాయి. ఏకంగా రూ. 300 కోట్లకు పైగా లెక్కల్లో చూపని నగదు పట్టుబడిండి. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో బుధవారం నుంచి ఐటీ అధికారులు సాహు టార్గెట్గా సోదాలు నిర్వహిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఏకంగా కోట్లకు కోట్ల నగదు బయటపడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న ధీరజ్ సాహు ఈ కేసులో ప్రధానంగా ఉన్నారు.
ధీరజ్ సాహు కాంగ్రెస్ ఎంపీ కావడంతో బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ అవినీతికి కేరాఫ్ అంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ ట్వీట్ చేస్తూ.. రాహుల్ గాంధీతో ధీరజ్ సాహూ ఉన్న వీడియోను షేర్ చేశారు. భారత్ జోడో యాత్రలో వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోను ఉద్దేశిస్తూ.. ‘‘దొంగల యాత్ర’’ అంటూ విమర్శించారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
Read Also: Anti-Semitism: యూదులు దెబ్బ అదుర్స్.. యూఎస్ టాప్ వర్సిటీ ప్రెసిడెంట్ రాజీనామా..
అయితే ఈ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ.. ఎంపీ ఆస్తుల నుంచి ఆదాయపన్ను అధికారులు ఎలా భారీ మొత్తంలో నగదు కనుగొన్నారో ఆయన మాత్రమే చెప్పగలరని అన్నారు. ఆదాయపు పన్ను శాఖ దాదాపు రూ. 300 కోట్ల లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్న ఎంపీ ధీరజ్ సాహు వ్యాపారాలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు చెప్పారు.
ఈ వ్యవహారంపై బీజేపీ నేత, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ శనివారం కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఎంపీలకు అవినీతిలో ప్రమేయం ఉండటం ఇది తొలిసారి కాదని అన్నారు. స్కామ్ ఉన్న చోట కాంగ్రెస్ నాయకుడు ఉంటానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నోట్ల లెక్కింపులో మనుషులే కాదు, యంత్రాలు కూడా విసిగిపోయాయని, అవినీతిపరుడైన కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రూ. 200 అవినీతి బయటపడింది..ఎవరివి..? గాంధీ కుటుంబంలోని ఏటీఎం ఇదేనా..? అంటూ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!