Congress: “ఆ ఎంపీ బిజినెస్లో మాకు సంబంధం లేదు”.. ఐటీ రైడ్స్కి దూరంగా కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఆయన నివాసాల్లో ఐటీ దాడులు జరిగాయి. ఏకంగా రూ. 300 కోట్లకు పైగా లెక్కల్లో చూపని నగదు పట్టుబడిండి. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో బుధవారం నుంచి ఐటీ అధికారులు సాహు టార్గెట్గా సోదాలు నిర్వహిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఏకంగా కోట్లకు కోట్ల నగదు బయటపడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న ధీరజ్ సాహు ఈ కేసులో ప్రధానంగా ఉన్నారు.
ధీరజ్ సాహు కాంగ్రెస్ ఎంపీ కావడంతో బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ అవినీతికి కేరాఫ్ అంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ ట్వీట్ చేస్తూ.. రాహుల్ గాంధీతో ధీరజ్ సాహూ ఉన్న వీడియోను షేర్ చేశారు. భారత్ జోడో యాత్రలో వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోను ఉద్దేశిస్తూ.. ‘‘దొంగల యాత్ర’’ అంటూ విమర్శించారు.
Also Read
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
Read Also: Anti-Semitism: యూదులు దెబ్బ అదుర్స్.. యూఎస్ టాప్ వర్సిటీ ప్రెసిడెంట్ రాజీనామా..
అయితే ఈ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ.. ఎంపీ ఆస్తుల నుంచి ఆదాయపన్ను అధికారులు ఎలా భారీ మొత్తంలో నగదు కనుగొన్నారో ఆయన మాత్రమే చెప్పగలరని అన్నారు. ఆదాయపు పన్ను శాఖ దాదాపు రూ. 300 కోట్ల లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్న ఎంపీ ధీరజ్ సాహు వ్యాపారాలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు చెప్పారు.
ఈ వ్యవహారంపై బీజేపీ నేత, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ శనివారం కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఎంపీలకు అవినీతిలో ప్రమేయం ఉండటం ఇది తొలిసారి కాదని అన్నారు. స్కామ్ ఉన్న చోట కాంగ్రెస్ నాయకుడు ఉంటానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నోట్ల లెక్కింపులో మనుషులే కాదు, యంత్రాలు కూడా విసిగిపోయాయని, అవినీతిపరుడైన కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రూ. 200 అవినీతి బయటపడింది..ఎవరివి..? గాంధీ కుటుంబంలోని ఏటీఎం ఇదేనా..? అంటూ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..