Congress: అంబేద్కర్ను అవమానించిన అమిత్షా.. క్షమాపణలు చెప్పాలని రాజ్యసభలో కాంగ్రెస్ నోటీసు!
- రాజకీయ లబ్ధి కోసం బీఆర్ అంబేద్కర్ పేరును వాడుకుంటుంది: అమిత్ షా
- అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అని జపం చేయడం కాంగ్రెస్ కు ఫ్యాషన్ గా మారింది
- అంబేద్కర్ను అమిత్ షా అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్ను అవమానించినందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తైన ఈ సందర్భంగా పార్లమెంట్ లోని ఉభయ సభల్లో రెండు రోజుల పాటు భారత రాజ్యాంగంపై చర్చ కొనసాగింది.
Read Also: Vemulawada: దారుణ హత్య.. రహదారిపై వ్యక్తిని నరికి చంపిన దుండగులు
Also Read
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
కాగా, మంగళవారం నాడు జరిగిన చర్చ సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా కాంగ్రెస్పై తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ అంబేద్కర్ పేరును వాడుకుంటుందని అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అని జపం చేయడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిందని ఆయన అన్నారు. అంబేద్కర్ పేరుకు బదులుగా దేవుడి పేరు తలుచుకుంటేనైనా కొంచెం పుణ్యమైన వస్తుంది.. స్వర్గానికి వెళ్లొచ్చని హస్తం పార్టీపై విరుచుకు పడ్డారు.
Read Also: Warangal: బీహార్ యువకుడి దారుణ హత్య
అయితే, అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీతో పాటు ఏఐసీసీ అధినేత మల్లికార్జున్ ఖర్గేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుస్మృతిని విశ్వసించే వారు ఖచ్చితంగా అంబేద్కర్తో విభేదిస్తారు అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాహుల్ గాంధీ రాసుకొచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ను హోంమంత్రి షా అవమానించడంతో బీజేపీ- ఆర్ఎస్ఎస్ జాతీయ జెండాకు వ్యతిరేకమని పేర్కొన్నారు.
Read Also:
అలాగే, బీజేపీ- ఆర్ఎస్ఎస్ పూర్వీకులు సైతం అశోక్ చక్రాన్ని వ్యతిరేకించారని.. సంఘ్ పరివార్ ప్రజలు మనుస్మృతిని అమలు చేసేందుకు చూస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అంబేద్కర్ ఆ దేవుడి కంటే తక్కువేం కాదు.. ఆయన దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, పేదలకు అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. ఇక, అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర హోంమంత్రి తక్షణమే క్షమాపణలు చెప్పాలని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు నోటీసు ఇచ్చింది.
తాజావార్తలు
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
-
NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
-
Fridge Storage Tips : ఫ్రిజ్లో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. చాలామంది చేసే తప్పులు ఇవే!
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
-
Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!