Bharat Jodo Yatra: కీలక మైలురాయిని చేరుకోనున్న భారత్ జోడో యాత్ర.. నేటితో 1000 కిలోమీటర్లు పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra To Complete 1000 Km Tomorrow: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కీలక మైలురాయిని చేరుకుంది. శనివారం జరిగే రాహుల్ గాంధీ 1000 కిలోమీటర్లను పూర్తి చేసుకుంటుంది. భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారిలో ప్రారంభం అయింది. ప్రస్తుతం తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర పూర్తై ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రానికి చేరుకుంది. శనివారం కర్ణాటకలో బళ్లారి జిల్లాకు చేరుకోవడంతో పాదయాత్ర 1000 కిలోమీటర్లను పూర్తి చేసుకుంటుంది. బళ్లారిలో లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో భారీ బహిరంగ సభ జరగనుంది.
భారత్ జోడో యాత్రలో భాగంగా తమిళనాడులో సుమారుగా లక్ష మంది పాదయాత్రలో పాల్గొనగా.. కేరళ చేరే సరికి ఆ సంఖ్య 1.25 లక్షలు, కర్ణాటకలో 1.5 లక్షల మంది చేరగా.. ఆంధ్రప్రదేశ్ లోకి చేరే సరికి సుమారుగా 2 లక్షల మంది యాత్రలో పాల్గొంటారని అంచానా వేస్తోంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పాదయాత్రలో అన్ని వర్గాలను కలుస్తున్నారు రాహుల్ గాంధీ.
Also Read
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
- Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న పాదయాత్ర త్వరలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోకి ప్రవేశించనుంది. బీజేపీ చేస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలను కలిపే విధంగా భారత్ జోడో యాత్రను చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగం, ద్రవ్యోల్బనం, పెరుగుతున్న ధరలపై బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు రాహుల్ గాంధీ. మొత్తం 5 నెలల పాటు 3570 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా పాదయాత్ర కొనసాగనుంది. కన్యాకుమారిలో ప్రారంభం అయిన పాదయాత్ర కాశ్మీర్ లో ముగియనుంది.
వరసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ 2024లో అధికారంలోకి రావాాలని ప్రయత్నిస్తోంది. బలమైన బీజేపీని ఢీకొట్టేందుకు భారత్ జోడో యాత్ర సహాయపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీ టార్గెట్ గా భారత్ జోడో యాత్రలో విమర్శలు గుప్పిస్తున్నారు రాహుల్ గాంధీ. గత వారం పాదయాత్రలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు ప్రియాంకాగాంధీ పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!