Rahul Gandhi: రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రయాణికుల నినాదాలు.. కాంగ్రెస్ కార్యకర్తలతో ఘర్షణ..
- రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రయాణికుల నిరసన..
- సంభాల్కి వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణుల్ని అడ్డుకున్న పోలీసులు..
- భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికుల అసహనం..
- కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రయాణికుల మధ్య ఘర్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ఉత్తర్ ప్రదేశ్లో సంభాల్ పట్టణంలోని షాహీ జామా మసీదు సర్వే వివాదం హింసాత్మకంగా మారింది. సర్వేకు వచ్చిన అధికారులు, పోలీసులపై వేల మంది గుంపు రాళ్లదాడికి పాల్పడింది. ఇది మొత్తం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. 30 మంది వరకు పోలీసులకు గాయాలయ్యాయి. ఇదిలా ఉంటే, ఈ హింసాత్మక ఘటనలో బాధితుల్ని కలిసేందుకు ఈ రోజు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ, ఇతర కాంగ్రెస్ ఎంపీలు సంభాల్ పర్యటనకు వెళ్లారు.
Read Also: PSLV-C59 Launch Postponed: చివరి నిమిషంలో PSLV-C59 రాకెట్ ప్రయోగం వాయిదా.. కారణం ఇదే..!
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
పర్యటన నేపథ్యంలో ఢిల్లీ-యూపీ సరిహద్దుల్లోనే రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య కారణంగా అక్కడికి వెళ్లేందుక అనుమతించలేదు. ఈ నేపథ్యంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే, గంటల తరబడి ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న ప్రయాణికులు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ గాంధీని, ఇతర కాంగ్రెస్ నేతల్ని అడ్డుకునేందుకు ఘాజీపూర్ బార్డర్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో అసహనానికి గురైన ప్రయాణికులు ‘‘రాహుల్ గాంధీ ముర్దాబాద్’’ అంటూ నినాదాలు చేశారు. అయితే, అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఈ నినాదాలతో ఆగ్రహం చెందారు. దీంతో ప్రయాణికులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
సంభాల్ నగరంలో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటు చేసున్నాయి. మొఘల్స్ కాలం నాటి షామీ జామా మసీదు పురాతన హరిహర ఆలయమని హిందూ పక్షం స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు సర్వేకి ఆదేశించింది, ఈ నేపథ్యంలో నవంబర్ 24న సర్వేకి వెళ్లిన అధికారులపై దాడి జరిగింది. ఈ హింసాత్మక ఘటనలపై 7 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ ఘటనలో సమాజ్వాదీ పార్టీకి చెందిన ఎంపీ జియాఉర్ రెహ్మాన్ బార్క్, స్థానిక ఎమ్మెల్యే కుమారుడి హస్తం ఉన్నట్లు అభియోగాలు నమోదయ్యాయి.
#WATCH | Commuters raised slogans against Lok Sabha LoP Rahul Gandhi at Ghazipur border earlier today amid traffic slowdown due to barricading related to his visit to violence-hit Sambhal. A scuffle also broke out between Congress workers and commuters. pic.twitter.com/rinybt7wBx
— ANI (@ANI) December 4, 2024
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?