Rahul Gandhi: రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రయాణికుల నినాదాలు.. కాంగ్రెస్ కార్యకర్తలతో ఘర్షణ..
- రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రయాణికుల నిరసన..
- సంభాల్కి వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణుల్ని అడ్డుకున్న పోలీసులు..
- భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికుల అసహనం..
- కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రయాణికుల మధ్య ఘర్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ఉత్తర్ ప్రదేశ్లో సంభాల్ పట్టణంలోని షాహీ జామా మసీదు సర్వే వివాదం హింసాత్మకంగా మారింది. సర్వేకు వచ్చిన అధికారులు, పోలీసులపై వేల మంది గుంపు రాళ్లదాడికి పాల్పడింది. ఇది మొత్తం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. 30 మంది వరకు పోలీసులకు గాయాలయ్యాయి. ఇదిలా ఉంటే, ఈ హింసాత్మక ఘటనలో బాధితుల్ని కలిసేందుకు ఈ రోజు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ, ఇతర కాంగ్రెస్ ఎంపీలు సంభాల్ పర్యటనకు వెళ్లారు.
Read Also: PSLV-C59 Launch Postponed: చివరి నిమిషంలో PSLV-C59 రాకెట్ ప్రయోగం వాయిదా.. కారణం ఇదే..!
Also Read
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
- MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
- Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
- BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
పర్యటన నేపథ్యంలో ఢిల్లీ-యూపీ సరిహద్దుల్లోనే రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య కారణంగా అక్కడికి వెళ్లేందుక అనుమతించలేదు. ఈ నేపథ్యంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే, గంటల తరబడి ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న ప్రయాణికులు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ గాంధీని, ఇతర కాంగ్రెస్ నేతల్ని అడ్డుకునేందుకు ఘాజీపూర్ బార్డర్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో అసహనానికి గురైన ప్రయాణికులు ‘‘రాహుల్ గాంధీ ముర్దాబాద్’’ అంటూ నినాదాలు చేశారు. అయితే, అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఈ నినాదాలతో ఆగ్రహం చెందారు. దీంతో ప్రయాణికులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
సంభాల్ నగరంలో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటు చేసున్నాయి. మొఘల్స్ కాలం నాటి షామీ జామా మసీదు పురాతన హరిహర ఆలయమని హిందూ పక్షం స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు సర్వేకి ఆదేశించింది, ఈ నేపథ్యంలో నవంబర్ 24న సర్వేకి వెళ్లిన అధికారులపై దాడి జరిగింది. ఈ హింసాత్మక ఘటనలపై 7 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ ఘటనలో సమాజ్వాదీ పార్టీకి చెందిన ఎంపీ జియాఉర్ రెహ్మాన్ బార్క్, స్థానిక ఎమ్మెల్యే కుమారుడి హస్తం ఉన్నట్లు అభియోగాలు నమోదయ్యాయి.
#WATCH | Commuters raised slogans against Lok Sabha LoP Rahul Gandhi at Ghazipur border earlier today amid traffic slowdown due to barricading related to his visit to violence-hit Sambhal. A scuffle also broke out between Congress workers and commuters. pic.twitter.com/rinybt7wBx
— ANI (@ANI) December 4, 2024
తాజావార్తలు
-
Raghavvi: రాఘవ లారెన్స్ కూతురు సంచలన నిర్ణయం.. హీరోయిన్గా కాకుండా ఆ రూట్లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ!
-
Ranveer Singh : రణ్వీర్ సింగ్ పై బ్యాన్ ఎత్తివేసిన FWICE
-
Smartphone Under 10,000: రూ. 10000 లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్స్.. భారీ బ్యాటరీలు, 50MP కెమెరాలు 90Hz డిస్ప్లేలతో..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
Kitchen Hacks: గ్యాస్ బర్నర్లు నల్లగా మారిపోయాయా? ఇలా చేస్తే నిమిషాల్లో కొత్త వాటిలా మెరిసిపోతాయి!
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!