Bengaluru: ఒడిశా తరహాలో బెంగళూరులో మరో ఘోరం.. విద్యార్థినిపై లెక్చరర్లు అత్యాచారం
- ఒడిశా తరహాలో బెంగళూరులో మరో ఘోరం
- విద్యార్థినిపై లెక్చరర్లు సహా ముగ్గురు అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశాలో జరిగిన ఘోర సంఘటనను మరువక ముందే కర్ణాటకలో అత్యంత దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, బ్లాక్ మెయిల్ చేశారని కాలేజీ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర కలకలం రేపింది.
ఇది కూడా చదవండి: Srinivasaa Chitturi: టాలీవుడ్ నిర్మాత ఇంట విషాదం
Also Read
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
కర్ణాటకలోని మూడబిద్రిలోని కళాశాల విద్యార్థినిని భౌతికశాస్త్రం బోధించే నరేంద్ర పరిచయం చేసుకున్నాడు. చదువులో సహాయం చేస్తానని.. నోట్స్ బుక్స్ ఇస్తానని పరిచయం చేసుకున్నాడు. అది స్నేహంగా మారింది. దీంతో నరేంద్ర తన స్నేహితుడైన అనూప్ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను బెదిరించి అనూప్ కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ వీడియోలను అడ్డంపెట్టుకుని జీవశాస్త్రం బోధించే సందీప్ కూడా అత్యాచారం చేశాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ మధ్య వీడియోలను అడ్డంపెట్టుకుని అనూప్.. నిత్యం లైంగిక కోరిక తీర్చాలంటూ వేధిస్తు్న్నాడు. లేదంటే ఆన్లైన్లో పెడతానంటూ బెదిరిస్తున్నాడు. ఇక ఈ బాధను తట్టుకోలేక.. బాధితురాలు తల్లిదండ్రులకు విషయం చెప్పేసింది. దీంతో వారంతా మహిళా కమిషన్ను ఆశ్రయించారు. దీంతో మారతహళ్లి పోలీస్ స్టేషన్లో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇద్దరు లెక్చరర్లు సహా స్నేహితుడు అనూప్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: War 2: సినిమా అంతా ఎన్టీఆర్ ఉంటాడు!
ఇదిలా ఉంటే.. లెక్చరర్ వేధింపులు భరించలేక గతవారం కాలేజీ ప్రాంగణంలోనే ఒడిశా విద్యార్థిని(20) ఒంటికి నిప్పంటించుకుంది. కాలేజ్ ప్రొఫెసర్ నుంచి నిత్యం లైంగిక వేధింపులు ఎదుర్కొంటోంది. ఇక ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకుంది. చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి ప్రాణాలు విడిచింది. శరీరం తీవ్రంగా కాలిపోయిందని, ఆమెను కాపాడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదని భువనేశ్వర్ ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి విచారాన్ని వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం, వైద్య బృందం అన్ని రకాల మద్దతు అందించినప్పటికీ బాధితురాలిని ప్రాణాలతో కాపాడలేకపోయామని అన్నారు. ఈ కేసులో దోషులందరికి శిక్ష పడుతుందని, దీనిపై తాను వ్యక్తిగతంగా అధికారులకు సూచనలు జారీ చేశానని చెప్పారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని వెల్లడించారు.
తాజావార్తలు
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్తో అభిమానుల భారీ వేడుకలు!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!