Cocaine: పారాదీప్ పోర్టులో భారీగా పట్టుబడిన డ్రగ్స్.. రూ.220 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cocaine: ఒడిశాలోని పారాదీప్ పోర్టులో భారీగా డ్రగ్స్ బయటపడ్డాయి. పోర్టులోని ఓ ఓడలో రూ.220 కోట్ల విలువైన కొకైన్ని అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి పారదీప్ ఇంటర్నేషనల్ కార్గో టెర్మినల్ వద్ద లంగర్ వేసి ఉన్న ఓడలోని క్రేన్లో 22 అనుమానాస్పద ప్యాకెట్లు కనిపించాయని వారు వెల్లడించారు. పట్టుబడిన డ్రగ్స్ బరువు 22 కిలోలు ఉందని అధికారులు వెల్లడించారు.
ముందుగా వాటిని క్రేన్ ఆపరేటర్ గుర్తించాడు. అయితే వాటిని పేలుడు పదార్థాలుగా భావించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో డ్రగ్స్ విషయం వెలుగులోకి వచ్చింది. పరీక్షల్లో కొకైన్గా నిర్థారించారు. ఎంవీ డెబి అనే కార్గో షిప్ ఈజిప్టు నుంచి ప్రయాణం ప్రారంభించింది. ఇండోనేషియాలోని గ్రెసిక్ ద్వారా ఇక్కకు చేరుకుంది. ఇక్కడి నుంచి స్టీల్ ప్లేట్లతో డెన్మార్క్కి బయలుదేరాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.
Also Read
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
Read Also: Afghanistan: ఆఫ్ఘన్లో మతాధికారులపై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి
‘‘ఓడలోని క్రేన్ నుండి ఇరవై రెండు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నాము. ప్రత్యేక కిట్ను ఉపయోగించి పరీక్షించిన తర్వాత పౌడర్ లాంటి పదార్ధం కొకైన్గా నిర్ధారించబడింది. స్వాధీనం చేసుకున్న పదార్థం యొక్క అంతర్జాతీయ మార్కెట్ ధర రూ. 200 కోట్ల నుండి రూ. 220 కోట్ల మధ్య ఉంటుంది.’’ అని రాష్ట్ర కస్టమ్స్ కమిషనర్ మధాబ్ చంద్ర మిశ్రా వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఓడలోని సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ దర్యాప్తులో సహకరించేందుకు రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నుంచి కస్టమ్స్ టీంను పారాదీప్ తరలించినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
-
Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
-
Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
-
Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
-
Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..