Delhi: రూ.లక్ష కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం రేఖాగుప్తా.. మహిళలకు సాయం ప్రకటన
- రూ.లక్ష కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం రేఖాగుప్తా
- మహిళలకు రూ.2,500 సాయం ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం తొలి ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. రూ.లక్ష కోట్ల బడ్జెట్ను ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నట్లు ప్రకటించారు. మహిళలకు రూ.2,500 సాయం అందిస్తున్నట్లు రేఖా గుప్తా తెలిపారు. మహిళా సమ్మాన్ యోజన పథకం కోసం మొత్తం రూ.5,100 కోట్లు మంజూరు చేసింది. దేశ రాజధానిలో అర్హులైన ప్రతి మహిళకు రూ.2,500 సాయం అందిస్తామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Supreme Court : పార్టీ ఫిరాయింపులకు ఏడాది పూర్తి.. సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
26 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ.. తొలి బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టింది. గత ఫిబ్రవరిలో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 70 స్థానాలకు గాను బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకుంది. విద్యుత్, రోడ్లు, నీరు వంటి 10 రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్లో నిధులు కేటాయించారు. మొత్తం రూ.లక్ష కోట్లతో బీజేపీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇది చారిత్రాత్మకమైన బడ్జెట్గా రేఖా గుప్తా అభివర్ణించారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో మెరుగైన కనెక్టివిటీ కోసం రూ. 1,000 కోట్లు ప్రతిపాదించారు. మహిళల భద్రత కోసం.. నగరం అంతటా 50,000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇది కూడా చదవండి: Hyderabad: దారుణం.. కానిస్టేబుల్పై బీర్ బాటిల్తో దాడి చేసిన బైక్ రేసర్..
ఇక ఢిల్లీలో యమునా నది, మురుగు నీటి శుద్ధి కోసం రూ.9000 కోట్లు కేటాయించారు. ఇక నీటి ట్యాంకర్లకు జీపీఎస్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్య రంగానికి రూ.6,874 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలతో గొడవలు పెట్టుకునేది… మేమైతే కలిసి పని చేస్తామని చెప్పారు.
ఇక ఆప్కు బీజేపీ ప్రభుత్వానికి మధ్య చాలా తేడా ఉందని రేఖా గుప్తా గుర్తుచేశారు. ఆప్ కేవలం వాగ్దానాలు ఇస్తుంది. కానీ అమలు చేయదు. మేము హామీలు ఇస్తే అమలు చేస్తామన్నారు. వాళ్లు శీష్ మహల్ నిర్మించుకుంటారు.. మేము పేదలకు ఇళ్లు నిర్మిస్తాం. వాళ్లు లక్షల విలువైన మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకుంటారు.. మేము మురికివాడ ప్రజలకు మరుగుదొడ్లు నిర్మిస్తామని రేఖా గుప్తా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
#WATCH | #DelhiBudget2025 | CM Rekha Gupta says, "… There is a lot of difference between us and them (AAP)… You (AAP) made promises, we will fulfil them. You abused the governments of the other states, we will establish harmony and work together… You made 'Sheesh Mahal', we… pic.twitter.com/41fWqtK9Pm
— ANI (@ANI) March 25, 2025
Watch: Delhi CM Rekha Gupta says, "To digitize healthcare services, we have allocated ₹10 crore for the Ayushman Bharat Digital Mission…Moving towards alternative healthcare, we are also implementing the Delhi Rajya AYUSH Society"
(Video Courtesy: Delhi Assembly) pic.twitter.com/VYVsWyyimT
— IANS (@ians_india) March 25, 2025
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!