Delhi: రూ.లక్ష కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం రేఖాగుప్తా.. మహిళలకు సాయం ప్రకటన
- రూ.లక్ష కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం రేఖాగుప్తా
- మహిళలకు రూ.2,500 సాయం ప్రకటన
ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం తొలి ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. రూ.లక్ష కోట్ల బడ్జెట్ను ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నట్లు ప్రకటించారు. మహిళలకు రూ.2,500 సాయం అందిస్తున్నట్లు రేఖా గుప్తా తెలిపారు. మహిళా సమ్మాన్ యోజన పథకం కోసం మొత్తం రూ.5,100 కోట్లు మంజూరు చేసింది. దేశ రాజధానిలో అర్హులైన ప్రతి మహిళకు రూ.2,500 సాయం అందిస్తామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Supreme Court : పార్టీ ఫిరాయింపులకు ఏడాది పూర్తి.. సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
26 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ.. తొలి బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టింది. గత ఫిబ్రవరిలో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 70 స్థానాలకు గాను బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకుంది. విద్యుత్, రోడ్లు, నీరు వంటి 10 రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్లో నిధులు కేటాయించారు. మొత్తం రూ.లక్ష కోట్లతో బీజేపీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇది చారిత్రాత్మకమైన బడ్జెట్గా రేఖా గుప్తా అభివర్ణించారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో మెరుగైన కనెక్టివిటీ కోసం రూ. 1,000 కోట్లు ప్రతిపాదించారు. మహిళల భద్రత కోసం.. నగరం అంతటా 50,000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇది కూడా చదవండి: Hyderabad: దారుణం.. కానిస్టేబుల్పై బీర్ బాటిల్తో దాడి చేసిన బైక్ రేసర్..
ఇక ఢిల్లీలో యమునా నది, మురుగు నీటి శుద్ధి కోసం రూ.9000 కోట్లు కేటాయించారు. ఇక నీటి ట్యాంకర్లకు జీపీఎస్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్య రంగానికి రూ.6,874 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలతో గొడవలు పెట్టుకునేది… మేమైతే కలిసి పని చేస్తామని చెప్పారు.
ఇక ఆప్కు బీజేపీ ప్రభుత్వానికి మధ్య చాలా తేడా ఉందని రేఖా గుప్తా గుర్తుచేశారు. ఆప్ కేవలం వాగ్దానాలు ఇస్తుంది. కానీ అమలు చేయదు. మేము హామీలు ఇస్తే అమలు చేస్తామన్నారు. వాళ్లు శీష్ మహల్ నిర్మించుకుంటారు.. మేము పేదలకు ఇళ్లు నిర్మిస్తాం. వాళ్లు లక్షల విలువైన మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకుంటారు.. మేము మురికివాడ ప్రజలకు మరుగుదొడ్లు నిర్మిస్తామని రేఖా గుప్తా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
#WATCH | #DelhiBudget2025 | CM Rekha Gupta says, "… There is a lot of difference between us and them (AAP)… You (AAP) made promises, we will fulfil them. You abused the governments of the other states, we will establish harmony and work together… You made 'Sheesh Mahal', we… pic.twitter.com/41fWqtK9Pm
— ANI (@ANI) March 25, 2025
Watch: Delhi CM Rekha Gupta says, "To digitize healthcare services, we have allocated ₹10 crore for the Ayushman Bharat Digital Mission…Moving towards alternative healthcare, we are also implementing the Delhi Rajya AYUSH Society"
(Video Courtesy: Delhi Assembly) pic.twitter.com/VYVsWyyimT
— IANS (@ians_india) March 25, 2025
తాజావార్తలు
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!