CM Himanta Biswa Sarma: భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మదర్సాలను కూల్చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Himanta Biswa Sarma.. Bulldozer Action In Assam: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. మదర్సాలు కేంద్రంగా జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను అస్సాం పోలీసులు గుర్తించి.. వరసగా అరెస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా బ్రహ్మపుత్ర నదీకి అటూఇటూగా బంగ్లాదేశ్ ను అనుకుని ఉన్న జిల్లాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను గుర్తించారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి అక్రమంగా చొరబడి పలు మదర్సాల్లో ఉగ్రశిక్షణ ఇస్తున్నారు. అల్ ఖైదాకు అనుబంధంగా పనిచేస్తున్న అన్సరుల్లా బంగ్లా టీమ్ ఉగ్రవాదులను ప్రణాళికలను భగ్నం చేశారు అస్సాం పోలీసులు. కొన్ని అక్రమ మదర్సాలు నిర్వహణపై ప్రభుత్వ కొరడా ఝుళిపించింది. మదర్సాలకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందించాలని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఆదేశించింది.
Read Also: MLA Raja Singh: రేపటితో ముగియనున్న బీజేపీ డెడ్లైన్.. గడువు కోరిన రాజాసింగ్ భార్య
Also Read
- Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
ఇదిలా ఉంటే భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే మదర్సాలను కూల్చివేస్తామని.. సీఎం హిమంత బిశ్వ శర్మ స్ట్రాంగ్ హెచ్చరిక జారీ చేశారు. బుధవారం బొంగైగావ్ జిల్లాలో ‘జీహాదీ’ కార్యక్రమాలకు ఉపయోగించిన మదర్సా భవనాన్ని అధికారులు కూల్చివేసిన తర్వాత ఈ ప్రకటన చేశారు. మదర్సాలను కూల్చివేసే ఉద్దేశ్యం మాకు లేదని.. అయితే జీహాదీలు ఉపయోగించుకుండా చూడాలనే ఉద్దేశ్యం మాత్రమే ఉందని బిశ్వ శర్మ అన్నారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు సమాచారం వస్తే.. మేము వాటిని తప్పకుండా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.
అంతకుముందు బంగ్లాదేశ్ వ్యక్తులకు నాలుగేళ్లుగా ఆశ్రయం కల్పించిన బార్ పేట జిల్లాలోని మదర్సాను సోమవారం అధికారులు కూల్చివేశారు. మంగళవారం రాత్రి గోల్ పరా పోలీసులు జరిపిన ఆపరేషన్ లో జీహాదీ అంశాలకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి సంబంధం ఉన్న మదర్సా టీచర్లు, ఇతర వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత ఉపఖండంలో అల్ ఖైదాకు సంబంధించి ఐదు మాడ్యుళ్లను అస్సాం పోలీసులు ఛేదించారు. బంగ్లాదేశీయులతో సహా జీహాదీ సంబంధాాలు ఉణ్న అనుమానిత వ్యక్తులను 40 మందికి పైగా మందిని మార్చి నుంచి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
-
Ghamasaan OTT: అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఢీ.. అదరగొట్టిన ‘ఘమాసాన్’ ట్రైలర్ .. నేరుగా ఓటీటీలోకే
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!