CM Himanta Biswa Sarma: భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మదర్సాలను కూల్చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Himanta Biswa Sarma.. Bulldozer Action In Assam: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. మదర్సాలు కేంద్రంగా జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను అస్సాం పోలీసులు గుర్తించి.. వరసగా అరెస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా బ్రహ్మపుత్ర నదీకి అటూఇటూగా బంగ్లాదేశ్ ను అనుకుని ఉన్న జిల్లాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను గుర్తించారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి అక్రమంగా చొరబడి పలు మదర్సాల్లో ఉగ్రశిక్షణ ఇస్తున్నారు. అల్ ఖైదాకు అనుబంధంగా పనిచేస్తున్న అన్సరుల్లా బంగ్లా టీమ్ ఉగ్రవాదులను ప్రణాళికలను భగ్నం చేశారు అస్సాం పోలీసులు. కొన్ని అక్రమ మదర్సాలు నిర్వహణపై ప్రభుత్వ కొరడా ఝుళిపించింది. మదర్సాలకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందించాలని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఆదేశించింది.
Read Also: MLA Raja Singh: రేపటితో ముగియనున్న బీజేపీ డెడ్లైన్.. గడువు కోరిన రాజాసింగ్ భార్య
Also Read
- Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
ఇదిలా ఉంటే భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే మదర్సాలను కూల్చివేస్తామని.. సీఎం హిమంత బిశ్వ శర్మ స్ట్రాంగ్ హెచ్చరిక జారీ చేశారు. బుధవారం బొంగైగావ్ జిల్లాలో ‘జీహాదీ’ కార్యక్రమాలకు ఉపయోగించిన మదర్సా భవనాన్ని అధికారులు కూల్చివేసిన తర్వాత ఈ ప్రకటన చేశారు. మదర్సాలను కూల్చివేసే ఉద్దేశ్యం మాకు లేదని.. అయితే జీహాదీలు ఉపయోగించుకుండా చూడాలనే ఉద్దేశ్యం మాత్రమే ఉందని బిశ్వ శర్మ అన్నారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు సమాచారం వస్తే.. మేము వాటిని తప్పకుండా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.
అంతకుముందు బంగ్లాదేశ్ వ్యక్తులకు నాలుగేళ్లుగా ఆశ్రయం కల్పించిన బార్ పేట జిల్లాలోని మదర్సాను సోమవారం అధికారులు కూల్చివేశారు. మంగళవారం రాత్రి గోల్ పరా పోలీసులు జరిపిన ఆపరేషన్ లో జీహాదీ అంశాలకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి సంబంధం ఉన్న మదర్సా టీచర్లు, ఇతర వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత ఉపఖండంలో అల్ ఖైదాకు సంబంధించి ఐదు మాడ్యుళ్లను అస్సాం పోలీసులు ఛేదించారు. బంగ్లాదేశీయులతో సహా జీహాదీ సంబంధాాలు ఉణ్న అనుమానిత వ్యక్తులను 40 మందికి పైగా మందిని మార్చి నుంచి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!