Arvind Kejriwal: బీజేపీలోనే ఉండి డబ్బులు తీసుకోండి.. ఆప్ కోసం పనిచేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Arvind kejriwal comments on BJP over Gujarat elections: ఈ ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ సారి గుజరాత్ లో పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) భావిస్తోంది. బీజేపీ నుంచి అధికారాన్ని తీసుకోవాలని ఆప్ భావిస్తోంది. ఇదిలా ఉంటే ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. తాజాగా ఆయన బీజేపీ కార్యకర్తలను, నాయకులును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ లో బీజేపీ కార్యకర్తలు బీజేపీలో ఉంటూనే ఆప్ కు సహకరించాలని కోరారు.
బీజేపీ కార్యకర్తలందరూ అక్కడే( బీజేపీలో)నే ఉండి ఆప్ కోసం పనిచేయమన్నారు. మీరు తెలివైన వారు.. ఆప్ కోసం లోపల నుంచే పనిచేయండి, బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని మా కోసం పని చేయండి అని వ్యాఖ్యానించారు. ఎందుకంటే మాకు డబ్బులు లేవని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. రాజ్ కోట్ లో మీడియాలో మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
Read Also: Karimnagar mayor Ravinder singh : టీఆర్ఎస్ లోకి రీఎంట్రీ తర్వాత రవీందర్ సింగ్ కి కలిసొచ్చిందేంటి..?
గుజరాత్ లో అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్ అందించడంతో పాటు మీ పిల్లలకు ఉచిత విద్యను అందించే మంచి పాఠశాలను నిర్మిస్తాము.. ఉచిత, నాణ్యమైన విద్యను అందిస్తామని.. కుటుంబంలో మహిళలకు రూ. 1000 అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే గుజరాత్ ఆప్ ప్రధాన కార్యదర్శి మనోజ్ సొరథియాపై ఇటీవల జరిగిన దాడి అంశాన్ని కూడా కేజ్రీవాల్ ప్రస్తావించారు. మేం భయపడటానికి కాంగ్రెస్ వాళ్లం కాదని.. మేము భయపడబోమని.. పరికివాళ్లం కాదని.. అన్యాయం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామని ఆయన అన్నారు. గుజరాత్ లోని 6 కోట్ల మందికి ఇప్పుడు ఆప్ ప్రత్యామ్నాయంగా ఉందని కేజ్రీవాల్ అన్నారు.
ఈ ఏడాది డిసెంబర్ లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం కావడంతో ఇక్కడ ఎన్నికలు కీలకంగా మారాయి. గుజరాత్ లో బీజేపీని అడ్డుకుంటే 2024 లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఆధిపత్యానికి బ్రేక్ వేయొచ్చని కాంగ్రెస్ పార్టీతో పాటు ఆప్ భావిస్తున్నాయి. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ సీట్ల సంఖ్య, ఓట్ షేర్ పెంచుకోగలిగింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
-
Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
-
Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!