Asaduddin Owaisi: రాజాసింగ్ అరెస్ట్ అయ్యాడు.. నిరసనలు వద్దంటూ ఓవైసీ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ నేత రాజా సింగ్ను రెండోసారి అరెస్టు చేసారని, శుక్రవారం ప్రార్థనలు శాంతియుతంగా జరిగేలా చూడాలని ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వారి డిమాండ్ ప్రకారమే రాజాసింగ్ అరెస్ట్ చేశారని ఒవైసీ పేర్కొన్నారు కావున ముస్లీం ప్రజలు ప్రశాంతంగా మసీదుల్లో ప్రార్థనలు జరుపుకోవాలని కోరారు.
#Hyderabad की आवाम को @aimim_national प्रमुख @asadowaisi
का पैगाम
हमारी सबसे बड़ी डिमांड यही थी कि जिस शख्स ने ऐसी बकवास की है उसे जेल भेजा जाए, अब ये हमारी जिम्मेदारी है कि कल के नमाज़ ए जुमा के बाद हम कोई नारा न लगाएं, ऐसा कोई वाकया न पेश आए जिससे दूसरों को तकलीफ हो।#RajaSingh pic.twitter.com/cD9wlnpJzNAlso Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
— T Raghavan (@NewsRaghav) August 25, 2022
రాజాసింగ్ పై కేసు నమోదు చేసి, జైలుకు పంపాల్సిందే అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే రాజా సింగ్ విడుదల చేసిన విడియో రిలీజ్ చేయడం వల్ల ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజా సింగ్ మహుమద్ ప్రవక్తపై అభ్యంతర వ్యాఖ్యలు చేశాడని పేర్కొన్నారు. దానీ ప్రభావంవల్లే ఇప్పుడు పాతబస్తీలో నిరసనలు వెల్లువెత్తాయని మండిపడ్డారు. తెలంగాణలో ప్రశాంత వాతావరణం ఉండేదని, ఇప్పుడు బీజేపీ వల్ల ప్రశాంతంగా ఉన్న నగరం అశాంతి నెలకొందని ఆరోపించారు. రాజా సింగ్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. రాజా సింగ్ భవిషత్ లో ఇలాంటి వాక్యలు చేయకుండా ఉండాలంటే అతని పై కేసు లు నమోదు చేసి జైల్ పంపాలని డిమాండ్ చేశారు. ఓ ప్రజా ప్రతినిధి అయి ఉండి రాజా సిగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి వాఖ్యలు చేయకుండా ఉండాలంటే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ స్పందించి రాజాసింగ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
నేడు శుక్రవారం దృష్ట్యా.. ఎటువంటి అల్లర్లకు తావులేకుండా.. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19, ఏప్రిల్ 12న నమోదైన కేసుల్లో భాగంగా.. గురువారం ఉదయం షాహినాయత్, మంగళ్హట్ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో మంగళ్హట్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేసి, చర్లపల్లి జైలుకు తరలించారు. వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాజా సింగ్ అరెస్ట్ తరుణంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రాజా సింగ్కు మద్దతుగా ఆయన అనుచరులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తరచూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుండటం వల్లే.. రాజాసింగ్పై హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఒక ఎమ్మెల్యేపై తెలంగాణ చరిత్రలో పీడీ యాక్ట్ నమోదు కావడం.. ఇదే మొదటిసారి.
Irfan Pathan: విస్తారా ఎయిర్లైన్స్పై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం.. అసలు ఏం జరిగిందంటే..?
తాజావార్తలు
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
-
Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
-
Summer Special: మామిడితో ఈ మ్యాజిక్ ట్రై చేశారా..? ఒక్క స్పూన్ తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!