China: పుతిన్ భారత పర్యటనపై చైనా మీడియా ఏం చెబుతోంది..
- పుతిన్ భారత పర్యటన ప్రపంచానికి సందేశం..
- చైనీస్ మీడియా కథనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు వచ్చారు. డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్లో పర్యటించారు. ఈ పర్యటనలో భారత్, రష్యాల మధ్య అనేక ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. అంతకుమందు, పుతిన్ ఢిల్లీలోని పాలం ఎయిర్పోర్టులో దిగిన వెంటనే, స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ స్వాగతం పలికారు. ఇద్దరూ ఒకే కారులో ప్రధాని నివాసంలో నిర్వహించిన విందుకు హాజరయ్యారు.
Read Also: Srisailam: శ్రీశైలం మల్లన్న భక్తులకు అలర్ట్.. ఫిబ్రవరి 8 నుంచి బ్రహ్మోత్సవాలు మొదలు..
Also Read
- GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
- Karnataka: మందుబాబులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
అయితే, ఈ పర్యటనపై చైనీస్ మీడియా ప్రశంసలు కురిపించింది. చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ పుతిన్ భారత పర్యటనను హైలెట్ చేసింది. చైనా విదేశాంగ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ లీ హైడాంగ్ చైనా మీడియాతో మాట్లాడుతూ.. రష్యా, భారత్ మధ్య సమన్వయం, సహకారం రెండు దేశాల స్వతంత ప్రతిపత్తి, సామర్థ్యాలను బలోపేతం చేస్తున్నాయని అన్నారు. భారతదేశం-రష్యా సంబంధం అత్యంత వ్యూహాత్మకమైనదని ఆయన అభివర్ణించారు, ఇది బాహ్య ఒత్తిడి లేదా జోక్యం ద్వారా ప్రభావితం కాదని చెప్పారు.
పుతిన్ పర్యటనలో భారత్, రష్యా ఏ దేశమూ కూడా ప్రపంచంలో ఒంటరిగా లేదని ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని ఇస్తోందని లీ పేర్కొన్నారు. రెండు దేశాలు కూడా ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చుకుంటున్నారని, ఒకరి అవసరాలను మరొకరు తీర్చుకుంటున్నారని చెప్పారు. రష్యా, భారత్లపై అమెరికా, పాశ్చాత్య దేశాల ఆంక్షలు, ఒత్తిడి విజయం కావని అన్నారు. భారత్, రష్యా మధ్య సంబంధాలు కొన్ని విషయాలను స్పష్టం చేస్తున్నాయని, రష్యాకు గణనీయమైన శక్తి, ప్రభావం ఉందని పాశ్చాత్య ఆంక్షలు దాని ప్రయోజనాలు, డిమాండ్లను ప్రభావితం చేయలేదని అమెరికా, పాశ్చాత్య దేశాలకు నిరూపిస్తోందని లీ మాటల్ని ఉటంకిస్తూ గ్లోబల్ టైమ్స్ చెప్పింది. భారత్ తన సొంత ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని రష్యా పట్ల తన విధానాన్ని రూపొందిస్తుందని స్పష్టం చేస్తోందని గ్లోబల్ టైమ్స్ నివేదించింది.
Russian President Vladimir #Putin landed in India on Thursday, kicking off a two-day trip with a private dinner hosted by Prime Minister Narendra #Modi. An expert said through Putin’s visit, #India and #Russia have jointly sent a clear message: neither country is isolated. “On… pic.twitter.com/lqe8ywbdgg
— Global Times (@globaltimesnews) December 4, 2025
తాజావార్తలు
-
Chinmayi: డబ్బింగ్ రూమ్లో భావోద్వేగానికి గురైన చిన్మయి శ్రీపాద
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..