China: భారత సైన్యం మోహరింపుపై చైనా చిలక పలుకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనా-భారత్ సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ బోర్డర్లో మరింత మంది సైన్యాన్ని మోహరించింది. అయితే, ఈ పరిణామాలు డ్రాగన్ కంట్రీ చైనాకు మింగుడు పడటం లేదు. వివాదాస్పద సరిహద్దుల్లో భారత్ మరిన్ని బలగాలను మోహరించడం ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఉపయోగపడేది కాదని చైనా విశ్వసిస్తోదని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి శుక్రవారం అన్నారు. చైనాతో వివాదాస్పద సరిహద్దులను మరింత బలోపేతం చేసేందుకు 10,000 మంది సైన్యాన్ని మోహరించింది.
రెండు దేశాలు గతంలో సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చలు నిర్వహించడానికి అంగీకరించాయి. ఇరు దేశాలు మధ్య పలుమార్లు సైనిక చర్చలు జరిగాయి. అయినా పెద్దగా ఫలితం కనిపించలేదు. హిమాలయాలకు సరిహద్దుగా ఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు చైనాతో 532 కి.మీ సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ పశ్చిమ సరిహద్దు వద్ద 10 వేల మంది సైనికులను భారత్ మోహరించినట్లు భారత మీడియా తెలిపింది.
Also Read
- AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
Read Also: Sajjala: బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారు
సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతను కాపాడేందుకు భారత్తో కలిసి పనిచేయడానికి చైనా కట్టుబడి ఉందని చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. భారత ప్రవర్తన శాంతిని కాపాడటానికి అనుకూలంగా లేదని, ఉద్రిక్తతలను తగ్గించడానికి అనుకూలంగా లేదని ఆమె అన్నారు. సైనిక మోహరింపు ఆ ప్రాంతంలో శాంతిని కాపాడటానికి సాయం చేయదని ఆమె అన్నారు.
భారత్-చైనాలు 3800 కి.మీ సరిహద్దును పంచుకుంటున్నాయి. చాలా చోట్ల సరిహద్దు స్పష్టంగా లేదు. 2020లో గాల్వాన్ ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు మరణించారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు భారత్కి చెందిన ప్రాంతాలను కూడా చైనా తమవిగా చెప్పుకుంటోంది. పలుమార్లు సరిహద్దు దాటి భారత్లోకి పీపుల్ లిజరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) దళాలు ప్రవేశిస్తున్నాయి. వీరికి భారత సైన్యం ధీటుగా సమాధానం ఇస్తోంది.
తాజావార్తలు
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
-
AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
ట్రెండింగ్
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..