China: భారత సైన్యం మోహరింపుపై చైనా చిలక పలుకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనా-భారత్ సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ బోర్డర్లో మరింత మంది సైన్యాన్ని మోహరించింది. అయితే, ఈ పరిణామాలు డ్రాగన్ కంట్రీ చైనాకు మింగుడు పడటం లేదు. వివాదాస్పద సరిహద్దుల్లో భారత్ మరిన్ని బలగాలను మోహరించడం ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఉపయోగపడేది కాదని చైనా విశ్వసిస్తోదని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి శుక్రవారం అన్నారు. చైనాతో వివాదాస్పద సరిహద్దులను మరింత బలోపేతం చేసేందుకు 10,000 మంది సైన్యాన్ని మోహరించింది.
రెండు దేశాలు గతంలో సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చలు నిర్వహించడానికి అంగీకరించాయి. ఇరు దేశాలు మధ్య పలుమార్లు సైనిక చర్చలు జరిగాయి. అయినా పెద్దగా ఫలితం కనిపించలేదు. హిమాలయాలకు సరిహద్దుగా ఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు చైనాతో 532 కి.మీ సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ పశ్చిమ సరిహద్దు వద్ద 10 వేల మంది సైనికులను భారత్ మోహరించినట్లు భారత మీడియా తెలిపింది.
Also Read
Read Also: Sajjala: బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారు
సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతను కాపాడేందుకు భారత్తో కలిసి పనిచేయడానికి చైనా కట్టుబడి ఉందని చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. భారత ప్రవర్తన శాంతిని కాపాడటానికి అనుకూలంగా లేదని, ఉద్రిక్తతలను తగ్గించడానికి అనుకూలంగా లేదని ఆమె అన్నారు. సైనిక మోహరింపు ఆ ప్రాంతంలో శాంతిని కాపాడటానికి సాయం చేయదని ఆమె అన్నారు.
భారత్-చైనాలు 3800 కి.మీ సరిహద్దును పంచుకుంటున్నాయి. చాలా చోట్ల సరిహద్దు స్పష్టంగా లేదు. 2020లో గాల్వాన్ ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు మరణించారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు భారత్కి చెందిన ప్రాంతాలను కూడా చైనా తమవిగా చెప్పుకుంటోంది. పలుమార్లు సరిహద్దు దాటి భారత్లోకి పీపుల్ లిజరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) దళాలు ప్రవేశిస్తున్నాయి. వీరికి భారత సైన్యం ధీటుగా సమాధానం ఇస్తోంది.
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!