Sajjala: బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీతో పొత్తు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) వెంపర్లాడుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పొత్తు కోసం ఢిల్లీలో చంద్రబాబు పడిగాపులు కాస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నిరాశ, నిస్పృహలో ఉన్నారని వ్యాఖ్యానించారు. బీజేపీతో పొత్తు ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు కాంగ్రెస్ను కంట్రోల్లో ఉంచుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు పొత్తుల ప్రయత్నం చూస్తుంటూనే జగన్, వైసీపీ బలం ఏంటో అర్థమవుతుందన్నారు.
చంద్రబాబు డైరెక్షన్లో షర్మిల
చంద్రబాబు డైరెక్షన్లోనే కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పని చేస్తున్నారని విమర్శించారు. అందరూ కలిసినా వైసీపీకి ఏమి నష్టం ఉండదని చెప్పుకొచ్చారు. పొత్తులు కుదుర్చుకున్న వాళ్లకు భావసారుప్యత ఉంటుందా? అని ప్రశ్నించారు. బీజేపీ బలం రాష్ట్రంలో ఏంటో అందరికీ తెలిసిందేనన్నారు. టీడీపీ అంతిమయాత్ర సాగుతుందని సజ్జల ధ్వజమెత్తారు.
Also Read
- Kerala: విషాదం.. పెదవి గాయానికి ఆస్పత్రికి వెళ్తే, చిన్నారి ప్రాణమే పోయింది..
- Vaibhav Sooryavanshi: 3 మ్యాచ్లు.. కేవలం 42 పరుగులు.. వైభవ్ సూర్యవంశీకి నేడే 'అగ్ని పరీక్ష'!
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్లు మృతి
- Jaipur Murder: ప్రభుత్వ ఉద్యోగం కోసం తల్లిని మాత్రమే కాదు, తండ్రిని కూడా చంపింది.!
20 ఏళ్ల క్రితమే దోపిడీ.
‘‘చంద్రబాబు 20 ఏళ్ల క్రితమే మహా దోపిడీ బయటపడింది. దోపిడీ, నిలువు దోపిడీకి చంద్రబాబు ఫేమస్. చంద్రబాబు నేరుగా అవినీతికి పాల్పడ్డారు. అవినీతిలో విశ్వరూపం చూపించారు. 2003 మార్చిలో IMG భారత్ అనే సంస్థ పుట్టిన నాలుగు రోజులకే బాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ కంపెనీకి తల తోక లేదు. ఒప్పందం ప్రకారం 850 ఎకరాల ల్యాండ్ … స్టేడియంల మీద హక్కు, ఖర్చులు, కార్యాలయం ఏర్పాటుకు జూబ్లీ హిల్స్ లో 5 వేల గజాల స్థలం ఇచ్చారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండి ఆ సంస్థకు 400 ఎకరాలు కట్టబెట్టారు.’’ అని సజ్జల వివరించారు.
‘‘2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో స్టార్ట్ అప్ ఏరియా అని 17 వందల ఎకరాలు కేటాయించారు. ఆ పక్కనే పరిపాలనా ప్రధాన కేంద్రాలు ఏర్పాటుకు ఆలోచన చేశారు. లాండ్ ఫూలింగ్ పేరుతో 30 వేల మంది రైతుల ఉసురు పోసుకున్నారు. రాజధాని పేరుతో అమరావతి భూములతో లక్ష కోట్లు దోచుకునే ప్రయత్నం చేశారు. సీమెన్స్ పేరుతో చంద్రబాబు స్కిల్ స్కాం చేసి జైలుకు వెళ్లారు.’’ అని సజ్జల పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Akkineni Akhil : నా వల్ల సినిమా దెబ్బ తింటుందేమోనని భయపడ్డాను!
-
Kerala: విషాదం.. పెదవి గాయానికి ఆస్పత్రికి వెళ్తే, చిన్నారి ప్రాణమే పోయింది..
-
Vaibhav Sooryavanshi: 3 మ్యాచ్లు.. కేవలం 42 పరుగులు.. వైభవ్ సూర్యవంశీకి నేడే ‘అగ్ని పరీక్ష’!
-
Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్లు మృతి
-
Jaipur Murder: ప్రభుత్వ ఉద్యోగం కోసం తల్లిని మాత్రమే కాదు, తండ్రిని కూడా చంపింది.!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!