Arvind Kejriwal: ఢిల్లీలో ఆపరేషన్ కమలం విఫలమైందని చెప్పేందుకే విశ్వాస తీర్మానం
Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న వాదనల మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సొంత ప్రభుత్వంపైనే అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ముఖ్యమంత్రి ప్రసగించారు. అనంతరం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పార్టీ మారితే ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.20 కోట్లు ఇస్తామని బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అరవింద్ కేజ్రీవాల్.. తన పార్టీలో ఫిరాయింపులు లేవని నిరూపించుకునేందుకు విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ శాసనసభ్యులను బలవంతంగా సభ నుంచి బయటకు పంపించారు.
బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ తీసుకొచ్చిన ”ఆపరేషన్ కమలం” ఢిల్లీలో విఫలమైందని నిరూపించేందుకే తాను ఈ విశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నిజాయతీపరులని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిందని ఆయన విమర్శించారు. కొన్ని చోట్ల అయితే ఒక్కో ఎమ్మెల్యేను రూ.50 కోట్లు చొప్పున కొనేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలోనూ అలాంటి ప్రయత్నాలు జరిగాయని.. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి రూ.20 కోట్లు ఇస్తామంటూ.. 12 మంది ఎమ్మెల్యేలకు ఆఫర్ చేశారని.. కానీ ఆపరేషన్ కమలం విఫలమైందన్నారు. ఆప్ ఎమ్మెల్యేలు నిజాయతీపరులని.. వారిని కొనుగోలు చేయలేరని రుజువు చేసేందుకే ఈ తీర్మానం తీసుకొచ్చినట్లు కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇంధన ధరల పెంపుతో వచ్చిన ఆదాయాన్ని ఎమ్మెల్యేల కొనుగోలుకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ విశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది.
Also Read
Ghulam Nabi Azad: నేను మోడీ ఏజెంట్ని కాదు.. ఆయనను కౌగిలించుకున్నది నేనా?
అంతకు ముందు బీజేపీ నేతలు ఆందోళనకు దిగడంతో అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానం, తరగతి గదుల నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఇందుకు డిప్యూటీ స్పీకర్ అంగీకరించకపోవడంతో ప్రతిపక్ష శాసనసభ్యుల వెల్లోకి దూసుకొచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో వారు సభ నుంచి బయటకు వెళ్లిపోవాలని డిప్యూటీ స్పీకర్ ఆదేశించారు. వారు వినిపించుకోకపోవడంతో బలవంతంగా బయటకు పంపించేశారు.
తాజావార్తలు
-
Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. ‘ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్’ వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
-
Lavanya : మా రామ్ చరణ్ బావకి థాంక్స్!
-
Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ‘బంపర్ గిఫ్ట్’.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
-
Getup Srinu: మేం కాపులం వివాదం.. అంతా ప్రమోషనా?
-
NBK111: నయన్ అవుట్.. కాజల్ ఇన్.. అసలు రీజన్ ఇదా?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!