Arvind Kejriwal: ఢిల్లీలో ఆపరేషన్ కమలం విఫలమైందని చెప్పేందుకే విశ్వాస తీర్మానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న వాదనల మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సొంత ప్రభుత్వంపైనే అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ముఖ్యమంత్రి ప్రసగించారు. అనంతరం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పార్టీ మారితే ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.20 కోట్లు ఇస్తామని బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అరవింద్ కేజ్రీవాల్.. తన పార్టీలో ఫిరాయింపులు లేవని నిరూపించుకునేందుకు విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ శాసనసభ్యులను బలవంతంగా సభ నుంచి బయటకు పంపించారు.
బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ తీసుకొచ్చిన ”ఆపరేషన్ కమలం” ఢిల్లీలో విఫలమైందని నిరూపించేందుకే తాను ఈ విశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నిజాయతీపరులని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిందని ఆయన విమర్శించారు. కొన్ని చోట్ల అయితే ఒక్కో ఎమ్మెల్యేను రూ.50 కోట్లు చొప్పున కొనేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలోనూ అలాంటి ప్రయత్నాలు జరిగాయని.. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి రూ.20 కోట్లు ఇస్తామంటూ.. 12 మంది ఎమ్మెల్యేలకు ఆఫర్ చేశారని.. కానీ ఆపరేషన్ కమలం విఫలమైందన్నారు. ఆప్ ఎమ్మెల్యేలు నిజాయతీపరులని.. వారిని కొనుగోలు చేయలేరని రుజువు చేసేందుకే ఈ తీర్మానం తీసుకొచ్చినట్లు కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇంధన ధరల పెంపుతో వచ్చిన ఆదాయాన్ని ఎమ్మెల్యేల కొనుగోలుకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ విశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది.
Also Read
- Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
- Suryastra Rocket: శత్రువులకు హెచ్చరికగా.. స్వదేశీ ‘సూర్యాస్త్ర’ రాకెట్ సక్సెస్.. పెరిగిన డిఫెన్స్ పవర్
- PM Modi: కాశీ-రోమ్ శాశ్వతనగరాలు.. సంబంధాలు కూడా అంతే గొప్పవన్న మోడీ
Ghulam Nabi Azad: నేను మోడీ ఏజెంట్ని కాదు.. ఆయనను కౌగిలించుకున్నది నేనా?
అంతకు ముందు బీజేపీ నేతలు ఆందోళనకు దిగడంతో అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానం, తరగతి గదుల నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఇందుకు డిప్యూటీ స్పీకర్ అంగీకరించకపోవడంతో ప్రతిపక్ష శాసనసభ్యుల వెల్లోకి దూసుకొచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో వారు సభ నుంచి బయటకు వెళ్లిపోవాలని డిప్యూటీ స్పీకర్ ఆదేశించారు. వారు వినిపించుకోకపోవడంతో బలవంతంగా బయటకు పంపించేశారు.
తాజావార్తలు
-
Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
-
Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
-
Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
-
Lenovo Legion Y900: కొత్త టాబ్లెట్ లెనోవో లెజియన్ Y900 విడుదల..144Hz డిస్ప్లే, 12,700mAh బ్యాటరీ
-
US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!