Arvind Kejriwal: ఢిల్లీలో ఆపరేషన్ కమలం విఫలమైందని చెప్పేందుకే విశ్వాస తీర్మానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న వాదనల మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సొంత ప్రభుత్వంపైనే అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ముఖ్యమంత్రి ప్రసగించారు. అనంతరం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పార్టీ మారితే ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.20 కోట్లు ఇస్తామని బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అరవింద్ కేజ్రీవాల్.. తన పార్టీలో ఫిరాయింపులు లేవని నిరూపించుకునేందుకు విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ శాసనసభ్యులను బలవంతంగా సభ నుంచి బయటకు పంపించారు.
బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ తీసుకొచ్చిన ”ఆపరేషన్ కమలం” ఢిల్లీలో విఫలమైందని నిరూపించేందుకే తాను ఈ విశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నిజాయతీపరులని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిందని ఆయన విమర్శించారు. కొన్ని చోట్ల అయితే ఒక్కో ఎమ్మెల్యేను రూ.50 కోట్లు చొప్పున కొనేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలోనూ అలాంటి ప్రయత్నాలు జరిగాయని.. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి రూ.20 కోట్లు ఇస్తామంటూ.. 12 మంది ఎమ్మెల్యేలకు ఆఫర్ చేశారని.. కానీ ఆపరేషన్ కమలం విఫలమైందన్నారు. ఆప్ ఎమ్మెల్యేలు నిజాయతీపరులని.. వారిని కొనుగోలు చేయలేరని రుజువు చేసేందుకే ఈ తీర్మానం తీసుకొచ్చినట్లు కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇంధన ధరల పెంపుతో వచ్చిన ఆదాయాన్ని ఎమ్మెల్యేల కొనుగోలుకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ విశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది.
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
Ghulam Nabi Azad: నేను మోడీ ఏజెంట్ని కాదు.. ఆయనను కౌగిలించుకున్నది నేనా?
అంతకు ముందు బీజేపీ నేతలు ఆందోళనకు దిగడంతో అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానం, తరగతి గదుల నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఇందుకు డిప్యూటీ స్పీకర్ అంగీకరించకపోవడంతో ప్రతిపక్ష శాసనసభ్యుల వెల్లోకి దూసుకొచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో వారు సభ నుంచి బయటకు వెళ్లిపోవాలని డిప్యూటీ స్పీకర్ ఆదేశించారు. వారు వినిపించుకోకపోవడంతో బలవంతంగా బయటకు పంపించేశారు.
తాజావార్తలు
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!