Manmohan Singh Cremation: పీవీకి మీరు చేసింది ఏమిటి..? కాంగ్రెస్వి చిల్లర రాజకీయాలు..
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిసినా, కొనసాగుతున్న వివాదం..
- మాజీ ప్రధానిని బీజేపీ గౌరవించలేదని కాంగ్రెస్ ఫైర్..
- మీరు పీవీకి చేసిందేమిటని ప్రశ్నించిన కేంద్రమంత్రి..
Manmohan Singh Cremation: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిసినా, వివాదం మాత్రం చల్లారడం లేదు. మన్మోహన్ సింగ్కి బీజేపీ ప్రభుత్వం గౌరవం ఇవ్వలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. స్మారక చిహ్నం విషయంలో అవమానపరించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయన దహన సంస్కారాలు రాజ్ఘాట్లో కాకుండా ఢిల్లీలోని నిగంభోద్ ఘాట్లో నిర్వహించడంపై కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు ఎక్కు పెట్టింది.
Read Also: Manohar Rao: సోనియా గాంధీ కనీసం అంత్యక్రియలకు హాజరు కాలేదు: పీవీ నరసింహారావు సోదరుడు
Also Read
ఇదిలా ఉంటే, ఈ ఆరోపణలపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందించారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో ఏ వివాదం లేదన, అయితే కాంగ్రెస్ కావాలనే వివాదం చేస్తూ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. అంత్యక్రియలకు నిర్దిష్ట ఏర్పాట్లు చేయాలని కోరుతూ కాంగ్రెస్ రాసిన లేఖ ఆలస్యంగా తమకు వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్మారక చిహ్నం నిర్మించాలని కోరడంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అంగీకరించిందని చెప్పారు. నిగంబోధ్లో అంత్యక్రియలు నిర్వహించడానికి లాజిస్టిక్ కారణాలు ఉన్నాయని, ఆ రోజు ఢిల్లీలో భారీ వర్షం కురిసినట్లు ఆయన చెప్పారు.
1991లో భారతదేశాన్ని ఆర్థికంగా పటిష్టం చేసిన పీవీ నరసింహరావుకి కాంగ్రెస్ చేసింది ఏమిటని పూరీ ప్రశ్నించారు. ఆయన 2004లో మరణించిన సమయంలో కాంగ్రెస్ ఢిల్లీలో అంత్యక్రియలకు కూడా అనుమతించలేదని, హైదరాబాద్లో అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. మోడీ ప్రధాని అయిన తర్వాతే ఢిల్లీలో ఆయన స్మారకం ఏర్పాటు చేశామని చెప్పారు. మన్మోహన్ సింగ్ చితాభస్మం ఈరోజు యమునా నదిలో కలిపిన సమయంలో గాంధీ కుటుంబానికి చెందిన ఒక్కరు కూడా రాలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బేరర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని అన్నారు
తాజావార్తలు
-
Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
-
LSG vs KKR: కోల్కతాపై పంజా విసిరిన మోసిన్ ఖాన్.. దంచికొట్టిన రింకూ.. లక్నో టార్గెట్ ఎంతంటే?
-
Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0” ప్రారంభం.!
-
IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
-
Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!