Manmohan Singh Cremation: పీవీకి మీరు చేసింది ఏమిటి..? కాంగ్రెస్వి చిల్లర రాజకీయాలు..
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిసినా, కొనసాగుతున్న వివాదం..
- మాజీ ప్రధానిని బీజేపీ గౌరవించలేదని కాంగ్రెస్ ఫైర్..
- మీరు పీవీకి చేసిందేమిటని ప్రశ్నించిన కేంద్రమంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manmohan Singh Cremation: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిసినా, వివాదం మాత్రం చల్లారడం లేదు. మన్మోహన్ సింగ్కి బీజేపీ ప్రభుత్వం గౌరవం ఇవ్వలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. స్మారక చిహ్నం విషయంలో అవమానపరించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయన దహన సంస్కారాలు రాజ్ఘాట్లో కాకుండా ఢిల్లీలోని నిగంభోద్ ఘాట్లో నిర్వహించడంపై కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు ఎక్కు పెట్టింది.
Read Also: Manohar Rao: సోనియా గాంధీ కనీసం అంత్యక్రియలకు హాజరు కాలేదు: పీవీ నరసింహారావు సోదరుడు
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
ఇదిలా ఉంటే, ఈ ఆరోపణలపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందించారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో ఏ వివాదం లేదన, అయితే కాంగ్రెస్ కావాలనే వివాదం చేస్తూ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. అంత్యక్రియలకు నిర్దిష్ట ఏర్పాట్లు చేయాలని కోరుతూ కాంగ్రెస్ రాసిన లేఖ ఆలస్యంగా తమకు వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్మారక చిహ్నం నిర్మించాలని కోరడంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అంగీకరించిందని చెప్పారు. నిగంబోధ్లో అంత్యక్రియలు నిర్వహించడానికి లాజిస్టిక్ కారణాలు ఉన్నాయని, ఆ రోజు ఢిల్లీలో భారీ వర్షం కురిసినట్లు ఆయన చెప్పారు.
1991లో భారతదేశాన్ని ఆర్థికంగా పటిష్టం చేసిన పీవీ నరసింహరావుకి కాంగ్రెస్ చేసింది ఏమిటని పూరీ ప్రశ్నించారు. ఆయన 2004లో మరణించిన సమయంలో కాంగ్రెస్ ఢిల్లీలో అంత్యక్రియలకు కూడా అనుమతించలేదని, హైదరాబాద్లో అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. మోడీ ప్రధాని అయిన తర్వాతే ఢిల్లీలో ఆయన స్మారకం ఏర్పాటు చేశామని చెప్పారు. మన్మోహన్ సింగ్ చితాభస్మం ఈరోజు యమునా నదిలో కలిపిన సమయంలో గాంధీ కుటుంబానికి చెందిన ఒక్కరు కూడా రాలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బేరర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని అన్నారు
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!