Manohar Rao: సోనియా గాంధీ కనీసం అంత్యక్రియలకు హాజరు కాలేదు: పీవీ నరసింహారావు సోదరుడు
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారకాల విషయంలో రాజకీయాలు
- మాజీ ప్రధానిని బీజేపీ అవమానించిందని కాంగ్రెస్ ఆరోపణ
- ఖండించిన పీవీ నరసింహారావు సోదరుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానంతరం అంత్యక్రియలు, స్మారకాల విషయంలో రాజకీయాలు మొదలయ్యాయి. మాజీ ప్రధానిని బీజేపీ అవమానించిందని కాంగ్రెస్ ఆరోపించింది. అటల్ బిహారీ వాజ్పేయి అంత్యక్రియలు జరిగినట్లే, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరిగిన చోట స్మారక చిహ్నం నిర్మించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
READ MORE: IND vs AUS: మెల్బోర్న్ టెస్టులో టీమిండియా విజయం సాధించగలదా?
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
కాగా.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అంత్యక్రియల అంశం బయటకు వచ్చింది.. ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కాంగ్రెస్ అనుమతించకపోవడాన్ని ప్రజలు గుర్తు చేసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పీవీ నరసింహారావు సోదరుడు మనోహర్రావు కాంగ్రెస్, సోనియా గాంధీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన ఓ జాతీయ మీడియాతో మనోహర్ రావు మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పార్టీ తమ నాయకుడు పీవీ నరసింహారావుకు ఎంత గౌరవం ఇచ్చిందో 20 ఏళ్లు వెనక్కి చూసుకోవాలి. సోనియా గాంధీ కూడా ఆయన అంత్యక్రియలకు హాజరు కాలేదు.. కాంగ్రెస్ ఆయనకు ఒక్క విగ్రహాన్ని నిర్మించలేదు. భారతరత్న కూడా ఇవ్వలేదు.. మీరు నరసింహారావు కోసం కాంగ్రెస్ ఏఐసీసీ కార్యాలయం గేట్లు కూడా తెరవలేదు. ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ భారతరత్న కూడా ఇవ్వలేకపోయారు. మాజీ ప్రధానికి మీరు ఇచ్చిన గౌరవం ఏమిటి?” అని ప్రశ్నించారు.
పీవీ నరసింహ రావుకు కనీసం రెండు గజాల భూమి కూడా కాంగ్రెస్ ఇవ్వలేదని మనోహర్రావు మండిపడ్డారు. “మీరు పీవీ నరసింహ రావుకు చేసినట్లు మన్మోహన్ సింగ్ కు జరగలేదు. దేనికైనా కొంత ప్రక్రియ ఉంటుంది. బీజేపీ ట్రస్ట్ ఏర్పాటు చేసి అన్ని చర్యలు తీసుకుంటుంది. కాంగ్రెస్ హయాంలో ఎంతో మంది ప్రధానులు చనిపోయినా వారి పేర్లు ఢిల్లీలో లేవు. మోడీ ప్రధానమంత్రులను సత్కరించి.. ఒకే చోట మ్యూజియం ఏర్పాటు చేశారు. చాలా మందికి భూమి కూడా ఇచ్చారు. అక్కడ మన్మోహన్ సింగ్ కు కూడా చోటు దక్కుతుంది. మీరు ప్రక్రియను పూర్తి చేయండి.” పీవీ నరసింహారావు సోదరుడు మనోహర్రావు అన్నారు.
#WATCH | Hyderabad | On the issue of allocating space for a memorial for former PM #DrManmohanSingh, brother of former PM PV Narasimha Rao, Manohar Rao says, "…Congress needs to look back 20 years on how much respect they gave to their leader PV Narasimha Rao… Even Sonia… pic.twitter.com/N5q12IYDRH
— ANI (@ANI) December 29, 2024
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!