Manohar Rao: సోనియా గాంధీ కనీసం అంత్యక్రియలకు హాజరు కాలేదు: పీవీ నరసింహారావు సోదరుడు
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారకాల విషయంలో రాజకీయాలు
- మాజీ ప్రధానిని బీజేపీ అవమానించిందని కాంగ్రెస్ ఆరోపణ
- ఖండించిన పీవీ నరసింహారావు సోదరుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానంతరం అంత్యక్రియలు, స్మారకాల విషయంలో రాజకీయాలు మొదలయ్యాయి. మాజీ ప్రధానిని బీజేపీ అవమానించిందని కాంగ్రెస్ ఆరోపించింది. అటల్ బిహారీ వాజ్పేయి అంత్యక్రియలు జరిగినట్లే, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరిగిన చోట స్మారక చిహ్నం నిర్మించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
READ MORE: IND vs AUS: మెల్బోర్న్ టెస్టులో టీమిండియా విజయం సాధించగలదా?
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
కాగా.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అంత్యక్రియల అంశం బయటకు వచ్చింది.. ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కాంగ్రెస్ అనుమతించకపోవడాన్ని ప్రజలు గుర్తు చేసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పీవీ నరసింహారావు సోదరుడు మనోహర్రావు కాంగ్రెస్, సోనియా గాంధీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన ఓ జాతీయ మీడియాతో మనోహర్ రావు మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పార్టీ తమ నాయకుడు పీవీ నరసింహారావుకు ఎంత గౌరవం ఇచ్చిందో 20 ఏళ్లు వెనక్కి చూసుకోవాలి. సోనియా గాంధీ కూడా ఆయన అంత్యక్రియలకు హాజరు కాలేదు.. కాంగ్రెస్ ఆయనకు ఒక్క విగ్రహాన్ని నిర్మించలేదు. భారతరత్న కూడా ఇవ్వలేదు.. మీరు నరసింహారావు కోసం కాంగ్రెస్ ఏఐసీసీ కార్యాలయం గేట్లు కూడా తెరవలేదు. ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ భారతరత్న కూడా ఇవ్వలేకపోయారు. మాజీ ప్రధానికి మీరు ఇచ్చిన గౌరవం ఏమిటి?” అని ప్రశ్నించారు.
పీవీ నరసింహ రావుకు కనీసం రెండు గజాల భూమి కూడా కాంగ్రెస్ ఇవ్వలేదని మనోహర్రావు మండిపడ్డారు. “మీరు పీవీ నరసింహ రావుకు చేసినట్లు మన్మోహన్ సింగ్ కు జరగలేదు. దేనికైనా కొంత ప్రక్రియ ఉంటుంది. బీజేపీ ట్రస్ట్ ఏర్పాటు చేసి అన్ని చర్యలు తీసుకుంటుంది. కాంగ్రెస్ హయాంలో ఎంతో మంది ప్రధానులు చనిపోయినా వారి పేర్లు ఢిల్లీలో లేవు. మోడీ ప్రధానమంత్రులను సత్కరించి.. ఒకే చోట మ్యూజియం ఏర్పాటు చేశారు. చాలా మందికి భూమి కూడా ఇచ్చారు. అక్కడ మన్మోహన్ సింగ్ కు కూడా చోటు దక్కుతుంది. మీరు ప్రక్రియను పూర్తి చేయండి.” పీవీ నరసింహారావు సోదరుడు మనోహర్రావు అన్నారు.
#WATCH | Hyderabad | On the issue of allocating space for a memorial for former PM #DrManmohanSingh, brother of former PM PV Narasimha Rao, Manohar Rao says, "…Congress needs to look back 20 years on how much respect they gave to their leader PV Narasimha Rao… Even Sonia… pic.twitter.com/N5q12IYDRH
— ANI (@ANI) December 29, 2024
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!