Manohar Rao: సోనియా గాంధీ కనీసం అంత్యక్రియలకు హాజరు కాలేదు: పీవీ నరసింహారావు సోదరుడు
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారకాల విషయంలో రాజకీయాలు
- మాజీ ప్రధానిని బీజేపీ అవమానించిందని కాంగ్రెస్ ఆరోపణ
- ఖండించిన పీవీ నరసింహారావు సోదరుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానంతరం అంత్యక్రియలు, స్మారకాల విషయంలో రాజకీయాలు మొదలయ్యాయి. మాజీ ప్రధానిని బీజేపీ అవమానించిందని కాంగ్రెస్ ఆరోపించింది. అటల్ బిహారీ వాజ్పేయి అంత్యక్రియలు జరిగినట్లే, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరిగిన చోట స్మారక చిహ్నం నిర్మించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
READ MORE: IND vs AUS: మెల్బోర్న్ టెస్టులో టీమిండియా విజయం సాధించగలదా?
Also Read
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
- Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
కాగా.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అంత్యక్రియల అంశం బయటకు వచ్చింది.. ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కాంగ్రెస్ అనుమతించకపోవడాన్ని ప్రజలు గుర్తు చేసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పీవీ నరసింహారావు సోదరుడు మనోహర్రావు కాంగ్రెస్, సోనియా గాంధీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన ఓ జాతీయ మీడియాతో మనోహర్ రావు మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పార్టీ తమ నాయకుడు పీవీ నరసింహారావుకు ఎంత గౌరవం ఇచ్చిందో 20 ఏళ్లు వెనక్కి చూసుకోవాలి. సోనియా గాంధీ కూడా ఆయన అంత్యక్రియలకు హాజరు కాలేదు.. కాంగ్రెస్ ఆయనకు ఒక్క విగ్రహాన్ని నిర్మించలేదు. భారతరత్న కూడా ఇవ్వలేదు.. మీరు నరసింహారావు కోసం కాంగ్రెస్ ఏఐసీసీ కార్యాలయం గేట్లు కూడా తెరవలేదు. ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ భారతరత్న కూడా ఇవ్వలేకపోయారు. మాజీ ప్రధానికి మీరు ఇచ్చిన గౌరవం ఏమిటి?” అని ప్రశ్నించారు.
పీవీ నరసింహ రావుకు కనీసం రెండు గజాల భూమి కూడా కాంగ్రెస్ ఇవ్వలేదని మనోహర్రావు మండిపడ్డారు. “మీరు పీవీ నరసింహ రావుకు చేసినట్లు మన్మోహన్ సింగ్ కు జరగలేదు. దేనికైనా కొంత ప్రక్రియ ఉంటుంది. బీజేపీ ట్రస్ట్ ఏర్పాటు చేసి అన్ని చర్యలు తీసుకుంటుంది. కాంగ్రెస్ హయాంలో ఎంతో మంది ప్రధానులు చనిపోయినా వారి పేర్లు ఢిల్లీలో లేవు. మోడీ ప్రధానమంత్రులను సత్కరించి.. ఒకే చోట మ్యూజియం ఏర్పాటు చేశారు. చాలా మందికి భూమి కూడా ఇచ్చారు. అక్కడ మన్మోహన్ సింగ్ కు కూడా చోటు దక్కుతుంది. మీరు ప్రక్రియను పూర్తి చేయండి.” పీవీ నరసింహారావు సోదరుడు మనోహర్రావు అన్నారు.
#WATCH | Hyderabad | On the issue of allocating space for a memorial for former PM #DrManmohanSingh, brother of former PM PV Narasimha Rao, Manohar Rao says, "…Congress needs to look back 20 years on how much respect they gave to their leader PV Narasimha Rao… Even Sonia… pic.twitter.com/N5q12IYDRH
— ANI (@ANI) December 29, 2024
తాజావార్తలు
-
Nithiin: ఫ్లాప్ల తర్వాత ఫుల్ ఫోకస్.. వరుసగా మూడు సినిమాలతో భారీ కమ్బ్యాక్కు సిద్ధమైన నితిన్!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
Survival Thriller: గుహల్లో చిక్కుకున్న స్నేహితులు.. ప్రాణాలు తీసే రహస్య జీవి… వణికించబోతున్న సర్వైవల్ థ్రిల్లర్
-
Kannada Villains : తెలుగు సినిమాల్లో బలమైన విలన్లుగా ముద్ర వేస్తున్నారు కన్నడ నటులు
-
Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!