Manohar Rao: సోనియా గాంధీ కనీసం అంత్యక్రియలకు హాజరు కాలేదు: పీవీ నరసింహారావు సోదరుడు
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారకాల విషయంలో రాజకీయాలు
- మాజీ ప్రధానిని బీజేపీ అవమానించిందని కాంగ్రెస్ ఆరోపణ
- ఖండించిన పీవీ నరసింహారావు సోదరుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానంతరం అంత్యక్రియలు, స్మారకాల విషయంలో రాజకీయాలు మొదలయ్యాయి. మాజీ ప్రధానిని బీజేపీ అవమానించిందని కాంగ్రెస్ ఆరోపించింది. అటల్ బిహారీ వాజ్పేయి అంత్యక్రియలు జరిగినట్లే, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరిగిన చోట స్మారక చిహ్నం నిర్మించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
READ MORE: IND vs AUS: మెల్బోర్న్ టెస్టులో టీమిండియా విజయం సాధించగలదా?
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
కాగా.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అంత్యక్రియల అంశం బయటకు వచ్చింది.. ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కాంగ్రెస్ అనుమతించకపోవడాన్ని ప్రజలు గుర్తు చేసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పీవీ నరసింహారావు సోదరుడు మనోహర్రావు కాంగ్రెస్, సోనియా గాంధీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన ఓ జాతీయ మీడియాతో మనోహర్ రావు మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పార్టీ తమ నాయకుడు పీవీ నరసింహారావుకు ఎంత గౌరవం ఇచ్చిందో 20 ఏళ్లు వెనక్కి చూసుకోవాలి. సోనియా గాంధీ కూడా ఆయన అంత్యక్రియలకు హాజరు కాలేదు.. కాంగ్రెస్ ఆయనకు ఒక్క విగ్రహాన్ని నిర్మించలేదు. భారతరత్న కూడా ఇవ్వలేదు.. మీరు నరసింహారావు కోసం కాంగ్రెస్ ఏఐసీసీ కార్యాలయం గేట్లు కూడా తెరవలేదు. ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ భారతరత్న కూడా ఇవ్వలేకపోయారు. మాజీ ప్రధానికి మీరు ఇచ్చిన గౌరవం ఏమిటి?” అని ప్రశ్నించారు.
పీవీ నరసింహ రావుకు కనీసం రెండు గజాల భూమి కూడా కాంగ్రెస్ ఇవ్వలేదని మనోహర్రావు మండిపడ్డారు. “మీరు పీవీ నరసింహ రావుకు చేసినట్లు మన్మోహన్ సింగ్ కు జరగలేదు. దేనికైనా కొంత ప్రక్రియ ఉంటుంది. బీజేపీ ట్రస్ట్ ఏర్పాటు చేసి అన్ని చర్యలు తీసుకుంటుంది. కాంగ్రెస్ హయాంలో ఎంతో మంది ప్రధానులు చనిపోయినా వారి పేర్లు ఢిల్లీలో లేవు. మోడీ ప్రధానమంత్రులను సత్కరించి.. ఒకే చోట మ్యూజియం ఏర్పాటు చేశారు. చాలా మందికి భూమి కూడా ఇచ్చారు. అక్కడ మన్మోహన్ సింగ్ కు కూడా చోటు దక్కుతుంది. మీరు ప్రక్రియను పూర్తి చేయండి.” పీవీ నరసింహారావు సోదరుడు మనోహర్రావు అన్నారు.
#WATCH | Hyderabad | On the issue of allocating space for a memorial for former PM #DrManmohanSingh, brother of former PM PV Narasimha Rao, Manohar Rao says, "…Congress needs to look back 20 years on how much respect they gave to their leader PV Narasimha Rao… Even Sonia… pic.twitter.com/N5q12IYDRH
— ANI (@ANI) December 29, 2024
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..