COVID 19: మళ్లీ కోవిడ్ టెన్షన్.. ఆ రాష్ట్రాలకు కేంద్రం వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒమిక్రాన్ వేరియంట్ ఎంట్రీ తర్వాత థర్డ్ వేవ్ రూపంలో మరోసారి భారత్పై విరుచుకుపడిన కరోనా మహమ్మారి కేసులు.. క్రమంగా తగ్గుముఖం పట్టాయి.. దీంతో, కోవిడ్ ఆంక్షలను కూడా ఎత్తివేసింది ప్రభుత్వం.. అయితే, కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కేసులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న కేంద్రం.. ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది.. హర్యానా, ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, మిజోరాంలలో గత వారం రోజులుగా కేసులు పెరుగుతున్నాయని తెలిపిన కేంద్రం.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని పేర్కొంటూ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాకేష్ భూషణ్ శుక్రవారం హెచ్చరించారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల అధికారులకు లేఖ రాశారు రాకేష్ భూషణ్.
Read Also: Andhra Pradesh: ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ.879 కోట్లు విడుదల
Also Read
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
చైనా, యూఎస్లలో కూడా కోవిడ్ కేసుల పెరుగుతోన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.. కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. ఆర్థిక మరియు సామాజిక కార్యకలాపాలను తిరిగి తెరవడానికి రాష్ట్రాలు/యూటీలు వివిధ చర్యలను చేపడుతున్నందున, కోవిడ్ 19 నిర్వహణ కోసం రిస్క్ అసెస్మెంట్-ఆధారిత విధానాన్ని నిరంతరం అనుసరించాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు రాకేష్ భూషణ్.. ఈ మేరకు కేరళ, మిజోరం, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ పంపారు. గత వారంలో కేరళలో 2,321 కొత్త కేసులు నమోదయ్యాయి, ఇది భారతదేశంలోని కొత్త కేసులలో 31.8 శాతం.. రాష్ట్రంలో వీక్లీ పాజిటివిటీ రేటు కూడా 13.45 శాతం నుంచి 15.53 శాతానికి పెరిగింది. టెస్ట్, ట్రాకింగ్, ట్రీట్మెంట్, టీకాలు వేయడం మరియు కోవిడ్ నిబంధనలను కట్టుదిట్టం వంటి ఐదు రెట్లు వ్యూహాన్ని కొనసాగించాలని రాష్ట్రాలకు సూచించింది. ఆ లేఖ ప్రకారం.. ఢిల్లీలో ఏప్రిల్ 1తో ముగిసిన వారంలో 724 కొత్త కేసులు ఉంటే ఏప్రిల్ 8తో ముగిసిన వారానికి వాటి సంఖ్య 826కి పెరిగింది, ఇది దేశంలోని కొత్త కేసులలో 11.33 శాతం. గత వారంలో పాజివిటీ రేటు కూడా 0.51 శాతం నుంచి 1.25 శాతానికి పెరిగింది. ఇక, హర్యానాలో వారంలో ఏప్రిల్ 1తో ముగిసిన వారంలో 367 కొత్త కేసులు నమోదు కాగా.. 8న ముగిసిన వారంతో 416 కొత్త కేసులు వెలుగు చూశాయి.. ఇది భారతదేశంలోని కొత్త కేసుల్లో 5.70 శాతంగా ఉంది. మహారాష్ట్రలో ఏప్రిల్ 8తో ముగిసిన వారానికి 794 కొత్త కేసులు నమోదయ్యాయి, ఇది దేశంలోని కొత్త కేసుల్లో 10.9 శాతంగా ఉంది.. దీంతో.. ఆ యా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది కేంద్రం.
తాజావార్తలు
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్లో ‘రష్మిక మందన్న’
-
Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Renault Kwid Facelift 2027: రెనాల్ట్ క్విడ్ ఫేస్లిఫ్ట్ 2027 విడుదల.. 4 ఎయిర్బ్యాగ్స్, 10.1″ టచ్స్క్రీన్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!