COVID 19: మళ్లీ కోవిడ్ టెన్షన్.. ఆ రాష్ట్రాలకు కేంద్రం వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒమిక్రాన్ వేరియంట్ ఎంట్రీ తర్వాత థర్డ్ వేవ్ రూపంలో మరోసారి భారత్పై విరుచుకుపడిన కరోనా మహమ్మారి కేసులు.. క్రమంగా తగ్గుముఖం పట్టాయి.. దీంతో, కోవిడ్ ఆంక్షలను కూడా ఎత్తివేసింది ప్రభుత్వం.. అయితే, కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కేసులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న కేంద్రం.. ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది.. హర్యానా, ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, మిజోరాంలలో గత వారం రోజులుగా కేసులు పెరుగుతున్నాయని తెలిపిన కేంద్రం.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని పేర్కొంటూ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాకేష్ భూషణ్ శుక్రవారం హెచ్చరించారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల అధికారులకు లేఖ రాశారు రాకేష్ భూషణ్.
Read Also: Andhra Pradesh: ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ.879 కోట్లు విడుదల
Also Read
- Caste Census: కులగణనకు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- CarryMen: 'మీరు షాపింగ్ చేయండి, మీ బ్యాగులు మేము మోస్తాం'.. మార్కెట్లలో షాపింగ్ అసిస్టెన్స్ సర్వీస్..
- Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
చైనా, యూఎస్లలో కూడా కోవిడ్ కేసుల పెరుగుతోన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.. కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. ఆర్థిక మరియు సామాజిక కార్యకలాపాలను తిరిగి తెరవడానికి రాష్ట్రాలు/యూటీలు వివిధ చర్యలను చేపడుతున్నందున, కోవిడ్ 19 నిర్వహణ కోసం రిస్క్ అసెస్మెంట్-ఆధారిత విధానాన్ని నిరంతరం అనుసరించాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు రాకేష్ భూషణ్.. ఈ మేరకు కేరళ, మిజోరం, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ పంపారు. గత వారంలో కేరళలో 2,321 కొత్త కేసులు నమోదయ్యాయి, ఇది భారతదేశంలోని కొత్త కేసులలో 31.8 శాతం.. రాష్ట్రంలో వీక్లీ పాజిటివిటీ రేటు కూడా 13.45 శాతం నుంచి 15.53 శాతానికి పెరిగింది. టెస్ట్, ట్రాకింగ్, ట్రీట్మెంట్, టీకాలు వేయడం మరియు కోవిడ్ నిబంధనలను కట్టుదిట్టం వంటి ఐదు రెట్లు వ్యూహాన్ని కొనసాగించాలని రాష్ట్రాలకు సూచించింది. ఆ లేఖ ప్రకారం.. ఢిల్లీలో ఏప్రిల్ 1తో ముగిసిన వారంలో 724 కొత్త కేసులు ఉంటే ఏప్రిల్ 8తో ముగిసిన వారానికి వాటి సంఖ్య 826కి పెరిగింది, ఇది దేశంలోని కొత్త కేసులలో 11.33 శాతం. గత వారంలో పాజివిటీ రేటు కూడా 0.51 శాతం నుంచి 1.25 శాతానికి పెరిగింది. ఇక, హర్యానాలో వారంలో ఏప్రిల్ 1తో ముగిసిన వారంలో 367 కొత్త కేసులు నమోదు కాగా.. 8న ముగిసిన వారంతో 416 కొత్త కేసులు వెలుగు చూశాయి.. ఇది భారతదేశంలోని కొత్త కేసుల్లో 5.70 శాతంగా ఉంది. మహారాష్ట్రలో ఏప్రిల్ 8తో ముగిసిన వారానికి 794 కొత్త కేసులు నమోదయ్యాయి, ఇది దేశంలోని కొత్త కేసుల్లో 10.9 శాతంగా ఉంది.. దీంతో.. ఆ యా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది కేంద్రం.
తాజావార్తలు
-
Modi – Meloni – Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
-
Allu Arjun: ‘ఈసారి టైగర్ కాదు.. డ్రాగన్’.. అంటూ బావ కోసం బన్నీ స్పెషల్ విషెస్ ..
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
Justin Langer: ఇప్పుడే ఇలా ఆడుతుంటే, అప్పటికి ఊహించలేం.. వైభవ్తో ప్రపంచ క్రికెట్కు వణుకే!
-
Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!