Indus River: ఉత్తరాది రాష్ట్రాలకు “సింధు” నీరు.. ఇక పాకిస్తాన్కు కన్నీరు..
- ఉత్తరాాది రాష్ట్రాలకు సింధు జలాలు..
- ఇదే జరిగితే పాకిస్తాన్కు కన్నీరే..
- 2029 ఎన్నికల్లోపు సిద్ధం చేసేలా ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indus River: సింధు నది జలాల కోసం కేంద్రం కొత్త ప్లాన్తో సిద్ధమవుతోంది. ఉత్తరాది రాష్ట్రాల దాహార్తిని, సాగు అవసరాలను తీర్చేందుకు కేంద్రం సింధు నది వ్యవస్థలో భారీ మార్పులు చేయాలని భావిస్తోంది. పాకిస్తాన్తో ‘‘సిందు జల ఒప్పందాన్ని’’ నిలిపేసిన తర్వాత, కేంద్రం ఈ వ్యూహాత్మక చర్యలు తీసుకుంటోంది. 2029 లోక్సభ ఎన్నికల ముందు ఈ ప్రాజెక్ట్ సిద్ధం చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
గత శుక్రవారం సీనియర్ మంత్రులు నిర్వహించిన సమీక్షా సమావేశంలో సింధు నదిని దాని ఉప నది అయిన బియాస్ నదితో అనుసంధానించేందుకు 14 కి.మీ సొరంగాన్ని నిర్మించేందుకు డీపీఆర్ ఇప్పటికే సిద్ధమవుతోందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఎల్ అండ్ టీ ప్రాజెక్ట్ నివేదికను తయారు చేసే బాధ్యతను అప్పగించారు. ఇది వచ్చే ఏడాది నాటికి సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు సింధు నది జలాలను సరఫరా చేసే ప్రతిపాదిత 113 కి.మీ కాలువ పనులనున కూడా సమావేశంలో చర్చించారు.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Ladakh : రగులుతున్న లద్దాక్, రాష్ట్ర హోదా కోసం రగులుతున్న డిమాండ్లు
1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్-పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. అయితే, పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ఈ ఒప్పందాన్ని నిలుపుదల చేసింది. ఇప్పుడు, కేంద్రం ప్రతిపాదిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే, భారత్ సమర్థవంతంగా సింధు జలాలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు పాకిస్తాన్ కు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ఏమవుతుందనే సందేశాన్ని కూడా ఇచ్చినట్లు అవుతుంది.
ఈ ప్రాజెక్టులో అత్యంత సవాలుతో కూడుకున్నది ఈ 14 కి.మీ సొరంగ మార్గం. పర్వత ప్రాంతాల్లో నిర్మితమవుతున్న నేపథ్యంలో శిలలను సమర్థవంతంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. వేగంగా, సురక్షితంగా ప్రాజెక్టు చేపట్టడానికి టెన్నెల్ బోరింగ్ యంత్రాలు, రాక్ షీల్డ్ టెక్నాలజీని ఉపయోగించాలని చూస్తున్నారు. ఈ సొరంగం జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలోని ఉజ్ ప్రాజెక్టులో అనుసంధానించబడుతుంది. రావి నందికి ఉప నది అయిన ఉజ్ నది నుంచి బియాస్ బేసిన్కు నీటిని తరలించడానికి వీలు కలుగుతుంది. 2028 నాటికి పూర్తి చేయాలనుకునే ఈ ప్రాజెక్టు విలువ రూ. 4000-8000 కోట్లుగా ఉంటుందని అంచనా. దీని వల్ల రాజస్థాన్లోని శుష్క ప్రాంతాలకు ఇందిరాగాంధీ కాలువ ద్వారా నీటిని అందిచవచ్చు. జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలు దీని ద్వారా ప్రయోజనం పొందుతాయి.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు!
-
Sambarala Yeti Gattu: క్లైమాక్స్కు చేరుకున్న సాయి దుర్గ తేజ్ పాన్ ఇండియా మూవీ.. చివరి షెడ్యూల్తో భారీ అప్డేట్!
-
Hormonal Imbalance in Women: తెలియకుండా చేసే ఈ అలవాట్లు మహిళల హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి.. ఈరోజే మార్చుకోండి!
-
US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్పై అమెరికా వైమానిక దాడి
-
Astrology: సమస్యలు వచ్చినా భయపడని 4 రాశులు వీరేనా? ఎంత కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొంటారట!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!