Indus River: ఉత్తరాది రాష్ట్రాలకు “సింధు” నీరు.. ఇక పాకిస్తాన్కు కన్నీరు..
- ఉత్తరాాది రాష్ట్రాలకు సింధు జలాలు..
- ఇదే జరిగితే పాకిస్తాన్కు కన్నీరే..
- 2029 ఎన్నికల్లోపు సిద్ధం చేసేలా ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indus River: సింధు నది జలాల కోసం కేంద్రం కొత్త ప్లాన్తో సిద్ధమవుతోంది. ఉత్తరాది రాష్ట్రాల దాహార్తిని, సాగు అవసరాలను తీర్చేందుకు కేంద్రం సింధు నది వ్యవస్థలో భారీ మార్పులు చేయాలని భావిస్తోంది. పాకిస్తాన్తో ‘‘సిందు జల ఒప్పందాన్ని’’ నిలిపేసిన తర్వాత, కేంద్రం ఈ వ్యూహాత్మక చర్యలు తీసుకుంటోంది. 2029 లోక్సభ ఎన్నికల ముందు ఈ ప్రాజెక్ట్ సిద్ధం చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
గత శుక్రవారం సీనియర్ మంత్రులు నిర్వహించిన సమీక్షా సమావేశంలో సింధు నదిని దాని ఉప నది అయిన బియాస్ నదితో అనుసంధానించేందుకు 14 కి.మీ సొరంగాన్ని నిర్మించేందుకు డీపీఆర్ ఇప్పటికే సిద్ధమవుతోందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఎల్ అండ్ టీ ప్రాజెక్ట్ నివేదికను తయారు చేసే బాధ్యతను అప్పగించారు. ఇది వచ్చే ఏడాది నాటికి సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు సింధు నది జలాలను సరఫరా చేసే ప్రతిపాదిత 113 కి.మీ కాలువ పనులనున కూడా సమావేశంలో చర్చించారు.
Also Read
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
- Beggar Woman’s Surprising Savings: జీవితాంతం వీధుల్లో భిక్షాటన చేసిన మహిళ.. మరణానంతరం బయటపడ్డ రూ.8.40 లక్షలు!
- Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
- Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
Read Also: Ladakh : రగులుతున్న లద్దాక్, రాష్ట్ర హోదా కోసం రగులుతున్న డిమాండ్లు
1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్-పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. అయితే, పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ఈ ఒప్పందాన్ని నిలుపుదల చేసింది. ఇప్పుడు, కేంద్రం ప్రతిపాదిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే, భారత్ సమర్థవంతంగా సింధు జలాలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు పాకిస్తాన్ కు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ఏమవుతుందనే సందేశాన్ని కూడా ఇచ్చినట్లు అవుతుంది.
ఈ ప్రాజెక్టులో అత్యంత సవాలుతో కూడుకున్నది ఈ 14 కి.మీ సొరంగ మార్గం. పర్వత ప్రాంతాల్లో నిర్మితమవుతున్న నేపథ్యంలో శిలలను సమర్థవంతంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. వేగంగా, సురక్షితంగా ప్రాజెక్టు చేపట్టడానికి టెన్నెల్ బోరింగ్ యంత్రాలు, రాక్ షీల్డ్ టెక్నాలజీని ఉపయోగించాలని చూస్తున్నారు. ఈ సొరంగం జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలోని ఉజ్ ప్రాజెక్టులో అనుసంధానించబడుతుంది. రావి నందికి ఉప నది అయిన ఉజ్ నది నుంచి బియాస్ బేసిన్కు నీటిని తరలించడానికి వీలు కలుగుతుంది. 2028 నాటికి పూర్తి చేయాలనుకునే ఈ ప్రాజెక్టు విలువ రూ. 4000-8000 కోట్లుగా ఉంటుందని అంచనా. దీని వల్ల రాజస్థాన్లోని శుష్క ప్రాంతాలకు ఇందిరాగాంధీ కాలువ ద్వారా నీటిని అందిచవచ్చు. జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలు దీని ద్వారా ప్రయోజనం పొందుతాయి.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : 22ఏ భూములపై మంత్రి పొంగులేటి బిగ్ క్లారిటీ
-
CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
-
Anasuya: హిందూ ఆచారాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు.. అసలు స్కెచ్ ఇదేనా!
-
Tollywood Wedding: సైలెంట్గా న్యూజిలాండ్లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. తన రియల్ హీరోయిన్తో ఫోటోలు వైరల్!
-
Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!