Arunachal Pradesh: సరిహద్దుల్లో చైనాకు ధీటుగా భారత్ అభివృద్ధి పనులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Centre Clears Construction Of 6 Corridors In Arunachal Near China Border: భారత-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు అలాగే ఉన్నాయి. భారత్ ను ఇరుకునపెట్టేందుకు ఇప్పటికే చైనా కొత్త గ్రామాలను, రోడ్డు, ఎయిర్ స్ట్రిప్స్, ఎయిర్ బేసులను నిర్మించింది. గల్వాన్ ఘర్షణల అనంతరం చైనా తన సైనిక నిర్మాణాలను పెంచుకుంటూ పోతోంది. ఇదిలా ఉంటే భారత్ కూడా చైనాకు ధీటుగా సరిహద్దుల్లో మౌళిక నిర్మాణాలను చేపడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ మొదలుకుని చైనాతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో రోడ్లు, వంతెనలను నిర్మిస్తోంది. ఉద్రిక్తతల సమయంలో సైన్యాన్ని, ఆయుధ వ్యవస్థలను వేగంగా తరలించేందుకు రోడ్లను నిర్మిస్తోంది.
జాతీయ రహదారి-15, అరుణాచల్ ప్రదేశ్ లో ఫ్రాంటియర్ హైవేలకు కేంద్ర పచ్చ జెండా ఊపింది. చైనాకు సరిహద్దులో ఉన్న భారత ప్రాంతాలను కలిపేందుకు, రహదారి కనెక్టవిటీని మెరుగుపరిచేందుకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ రూ. 2,178 కిలోమీటర్ల పొడవైన ఆరు కారిడార్లను నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ రోడ్ల ద్వారా సైనిక సామాగ్రిని వేగంగా చైనా సరిహద్దుల్లో మోహరించే అవకాశం ఏర్పడుతుంది.
Also Read
- KCC New Rules 2026: కిసాన్ క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు.. రైతులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- Vivek Agarwal: FATF ఉపాధ్యక్షుడిగా వివేక్ అగర్వాల్.. ప్రపంచ వేదికపై పెరిగిన భారత ప్రతిష్ఠ
- Kesar Mango Record: పండ్ల రాజు గిర్ కేసర్ మామిడి.. 10 ఏళ్ల రికార్డులు బద్దలు
- Uddhav Thackeray: అధికారం కోసం కాదు, సిద్ధాంతాల కోసమే పదవిని వదులుకున్నా: ఉద్ధవ్ ఠాక్రే
Read Also: Madya Pradesh Bus Accident: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం
సరిహద్దుల వరక మూడు కీలక రహదారులను విస్తరించనున్నారు. ఇటాఖోలా-సీజోసా-పక్కే కెస్సాండ్- సెప్పా చయాంగ్తాజో- సాంగ్గ్రామ్-పార్సీ పార్లో వరకు 391 కిలోమీటర్లు, కనుబారి -లాంగ్డింగ్ వరకు 404 కిలోమీటర్లు, అకాజాన్-పాంగో జార్జింగ్ మధ్య 398 కిలోమీటర్లు, గోగముఖ్ తహిలా టాటో వరకు 285 కిలోమీటర్ల దూరం, తెలమార- తవాంగ్- నీలియా (సరిహద్దు) వరకు 402 కిలోమీటర్లు, పాసిఘాట్ బిషింగ్ (సరిహద్దు) వరకు 298 కిలోమీటర్లు ఇలా ఆరు కారిడార్లను అభివృద్ధి చేయనున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం చైనాలో భాగం అని చాలా రోజులుగా చైనా వాదిస్తోంది. దీంతో ఈ ప్రాంతంపై చైనా బలగాల కన్ను ఉంది. దీంతో ఈ రాష్ట్ర సరిహద్దుల్లో చైనా గ్రామాలను కూడా నిర్మిస్తోంది. దీంతో భారత్ ప్రభుత్వం కూడా చైనా దుందుడుకు చర్యలకు చెక్ పెట్టే విధంగా సైనిక మౌళిక సదుపాయాలను పెంచుకుంటోంది. అయితే భారత్ లఢఖ్, అరుణాచల్ ప్రదేశ్ లోచేపడుతున్న నిర్మాణాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇవి ఉద్రిక్తతలను పెంచే విధంగా ఉన్నాయంటూ గగ్గోలు పెడుతోంది. అయితే తను మాత్రం ఎంచక్కా నిర్మాణాలు చేపడుతూ పోతోంది.
తాజావార్తలు
-
Trump vs Meloni: ‘నాతో ఫోటో కోసం ఆమె బతిమలాడింది’.. మెలోనిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. కట్చేస్తే..
-
KCC New Rules 2026: కిసాన్ క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు.. రైతులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాలలో అనుకూలం!
-
Gautham Gambhir: ఆ విజయాలతో గంభీర్ కి ఏం సంబంధం లేదు.. నిప్పు రాజేసిన శ్రీశాంత్ కామెంట్స్
-
Astrology: కోపం త్వరగా వచ్చినా.. అంతే వేగంగా మర్చిపోయే 4 రాశులు ఇవేనా? మనసులో పగ పెట్టుకోరట!
ట్రెండింగ్
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!