Central Government: రైతులకు శుభవార్త.. మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతుల కోసం మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయానికి సంబంధించి ఈనెల 25 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా ప్రచారం చేపట్టాలని భావిస్తోంది. ఈ మేరకు ‘కిసాన్ భగీదారీ ప్రాథమిక హమారీ’ పేరిట ప్రచారాన్ని నిర్వహించాలని తలపెట్టింది. వ్యవసాయానికి సంబంధించిన అన్ని సంస్థలు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్నాయి. రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దేశంలో ఉన్న 720 కృషి విజ్ఞాన కేంద్రాలకు చెందిన రైతులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయనుంది.
ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ పరిశోధన, విద్యా శాఖ ప్రతి కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ మేళా, సహజ వ్యవసాయంపై కేంద్ర ప్రభుత్వం ఒక ప్రదర్శనను నిర్వహిస్తోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో వ్యవసాయ రంగ అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ఈ ప్రచారంలో హైలైట్ చేయనున్నారు. ఈ ప్రచారానికి డెయిరీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు కూడా సహకరిస్తాయని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద క్రాప్ ఇన్సూరెన్స్ స్కూల్ను కూడా ప్రారంభించనున్నారు.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
ఐదు రోజుల పాటు జరిగే ఈ ప్రచారంలో హరిత విప్లవం-ఆహార ఉత్పత్తిలో స్వావలంబన, ఉద్యాన పంటల అతిపెద్ద ఉత్పత్తిదారు- అల్లం, అరటి, మామిడి, బొప్పాయి, పసుపు పంట, తేనె ఉత్పత్తి, పంటల నీటిపారుదల వ్యవస్థను మెరుగుపర్చడం, వ్యవసాయ యాంత్రీకరణలో పురోగతి, సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్, ఎఫెక్టివ్ పెస్ట్ మేనేజ్మెంట్, వ్యవసాయంలో రిమోట్ సెన్సింగ్, GIS, డ్రోన్స్, బయోటెక్నాలజీ, వాటర్షెడ్ అభివృద్ధి కార్యక్రమం విజయవంతం, విత్తనాలు, ఎరువుల్లో స్వయం సమృద్ధి వంటి పలు అంశాలపై చర్చించనున్నారు.
Congress: కాంగ్రెస్ ‘ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్’ ఏర్పాటు.. పీకేపై మౌనం..!
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!