Union Cabinet: రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్రం శుభవార్త.. PMGKAY పొడగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేషన్ కార్డు ఉన్న వారికి కేంద్రం శుభవార్త అందించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పొడిగిస్తూ కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం ప్రకటించారు. కరోనా సమయంలో పేద ప్రజలకు ఉచిత రేషన్ అందించేందుకు కేంద్రం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఈ పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 81 కోట్ల మంది పేద ప్రజలు లబ్ధీ పొందుతన్నారు. అయితే ఇప్పుడు ఈ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నవంబర్ 29న వెల్లడించారు.
Also Read: Telangana Elections 2023: తెలంగాణలో రేపే పోలింగ్.. పూర్తైన ఎన్నికల సామాగ్రి పంపిణీ..
Also Read
- Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
ఈ పొడగింపు జనవరి 1, 2024 నుంచి డిసెంబర్, 2028 వరకు వర్తిస్తుందని, దీని ద్వారా పేద ప్రజలకు కేంద్ర సర్కార్ ఉచితంగా బియ్యం పంపిణీ చేయనుందని చెప్పారు. ఈ నిర్ణయంతో కేంద్రంపై అదనంగా మరో రూ.11.8 లక్షల కోట్ల భారం పడుతుందని ఆయన తెలిపారు. కాగా ఈ పథకాన్ని ఏప్రిల్ 2020లో కరోనా లాక్ డౌన్ విధించిన క్రమంలో కేంద్రం పీఎంజీకేఏవై పేరుతో ప్రకటించింది. దీనికి ద్వారా రేషన్ కార్డు ఉన్నవారు నెలల రూ. 5 కిలోల ఉచిత రేషన్ అందించింది. అయితే మొదట మూడు నెలలకు మాత్రమే ఉచితంగా రేషన్ ఇచ్చేందుకు ఈ స్కీమ్ తెచ్చారు. ఆ తర్వాత పలు మార్లు ఈ స్కీమ్ పొడిగించింది కేంద్రం. ఇప్పుడు మరో 5 ఏళ్లు పొడగించి ఉచితంగ రేషన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ పథకం డిసెంబర్ 2023 లో అంటే వచ్చే నెలలో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర కెబినెట ఈ పథకాన్ని పొడగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పొడగింపుతో లబ్ధిదారులు 2028 వరకు ఉచిత రేషన్ పొందవచ్చు.
Also Read: Telangana Assembly Elections 2023: రేపు సెలవు ఇవ్వని కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు: ఎన్నికల సంఘం
తాజావార్తలు
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ben Stokes: చిరకాల సలహాదారుడిని కలుస్తున్న బెన్ స్టోక్స్.. బయపడిపోతున్న ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు!
-
Peddi : భారీ నష్టాల దిశగా ‘పెద్ది’ నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకుమించి?
-
Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
-
Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
ట్రెండింగ్
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!