Lands For Job: బిహార్ సర్కారు బలపరీక్ష రోజే.. ఆర్జేడీ నేతల నివాసాలపై సీబీఐ దాడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lands For Job: బిహార్లో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం బలపరీక్ష రోజే ఆర్జేడీ నేతల నివాసాలపై సీబీఐ దాడులు జరగడం సంచలనం సృష్టిస్తోంది. బిహార్లో ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్, ముగ్గురు ఎంపీలు అష్ఫాక్ కరీం, ఫయాజ్ అహ్మద్, సుబోధ్ రాయ్లకు సంబంధించిన ఆస్తులపై దాడులు నిర్వహించారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో ఈ ఉదయం ఈ కేసులో రాష్ట్రీయ జనతాదళ్ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహించింది. ‘ల్యాండ్స్ ఫర్ జాబ్స్’ కుంభకోణానికి సంబంధించి సీబీఐ బుధవారం 25 వేర్వేరు చోట్ల దాడులు నిర్వహించింది. ఢిల్లీ, హర్యానాలోని గురుగ్రామ్, బిహార్లోని పాట్నా, కతిహార్, మధుబనిలోని వివిధ ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. గురుగ్రామ్ సెక్టార్ 65లోని వరల్డ్మార్క్ భవనంలో ఉన్న వైట్ల్యాండ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాడులు జరుగుతున్నాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో లాలూప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న రోజుల్లో జరిగిన ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
ఈ దాడుల నేపథ్యంలో కేంద్రంపై ఆర్జేడీ విరుచుకుపడింది. కొత్తగా ఏర్పాటైన బిహార్ ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొంటన్న రోజునే దాడులు నిర్వహించడం ఏంటని ప్రశ్నించింది. నితీష్ కుమార్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో భయపడుతున్నారని, బీజేపీ మినహా అన్ని పార్టీలు తమ వెంటే ఉన్నాయని, రాష్ట్రంలో మెజారిటీ తమకు ఉందని బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి అన్నారు. పార్టీ శాసనసభ్యులను బెదిరించేందుకే ఈ దాడులు చేశారని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా అన్నారు. “ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఇందులో అర్థం లేదు. ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా వస్తారనే భయంతో వారు ఇలా చేస్తున్నారు” అని ఆర్జేడీ ఎమ్మెల్యే సునీల్ సింగ్ అన్నారు.
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
Jharkhand illegal mining case: సీఎం సన్నిహిత నేత ఇంట్లో ఏకే-47 రైఫిళ్లు స్వాధీనం
ఈ మేలో ‘ల్యాండ్స్ ఫర్ జాబ్స్’ కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్, అతని భార్య, కుమార్తెలతో పాటు పలువురిని ఈ కేసులో నిందితులుగా పేర్కొంది. మే నెలలో ఢిల్లీ, బీహార్లలో లాలూ యాదవ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన 17 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా పనిచేసిన భోలా యాదవ్ను ‘ల్యాండ్స్ ఫర్ జాబ్స్’ కేసులో సీబీఐ జులైలో అరెస్టు చేసింది.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!