Lands For Job: బిహార్ సర్కారు బలపరీక్ష రోజే.. ఆర్జేడీ నేతల నివాసాలపై సీబీఐ దాడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lands For Job: బిహార్లో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం బలపరీక్ష రోజే ఆర్జేడీ నేతల నివాసాలపై సీబీఐ దాడులు జరగడం సంచలనం సృష్టిస్తోంది. బిహార్లో ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్, ముగ్గురు ఎంపీలు అష్ఫాక్ కరీం, ఫయాజ్ అహ్మద్, సుబోధ్ రాయ్లకు సంబంధించిన ఆస్తులపై దాడులు నిర్వహించారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో ఈ ఉదయం ఈ కేసులో రాష్ట్రీయ జనతాదళ్ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహించింది. ‘ల్యాండ్స్ ఫర్ జాబ్స్’ కుంభకోణానికి సంబంధించి సీబీఐ బుధవారం 25 వేర్వేరు చోట్ల దాడులు నిర్వహించింది. ఢిల్లీ, హర్యానాలోని గురుగ్రామ్, బిహార్లోని పాట్నా, కతిహార్, మధుబనిలోని వివిధ ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. గురుగ్రామ్ సెక్టార్ 65లోని వరల్డ్మార్క్ భవనంలో ఉన్న వైట్ల్యాండ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాడులు జరుగుతున్నాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో లాలూప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న రోజుల్లో జరిగిన ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
ఈ దాడుల నేపథ్యంలో కేంద్రంపై ఆర్జేడీ విరుచుకుపడింది. కొత్తగా ఏర్పాటైన బిహార్ ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొంటన్న రోజునే దాడులు నిర్వహించడం ఏంటని ప్రశ్నించింది. నితీష్ కుమార్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో భయపడుతున్నారని, బీజేపీ మినహా అన్ని పార్టీలు తమ వెంటే ఉన్నాయని, రాష్ట్రంలో మెజారిటీ తమకు ఉందని బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి అన్నారు. పార్టీ శాసనసభ్యులను బెదిరించేందుకే ఈ దాడులు చేశారని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా అన్నారు. “ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఇందులో అర్థం లేదు. ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా వస్తారనే భయంతో వారు ఇలా చేస్తున్నారు” అని ఆర్జేడీ ఎమ్మెల్యే సునీల్ సింగ్ అన్నారు.
Also Read
- Bihar Police Exam Chaos: పరీక్ష రోజున రైళ్లు ఆలస్యం.. ఆగ్రహంతో రాళ్ల దాడికి దిగిన కానిస్టేబుల్ అభ్యర్థులు
- NDA Women Cadets: భారత రక్షణ రంగంలో నయా హిస్టరీ.. చరిత్ర సృష్టించిన నారీమణులు! ‘ఎన్డీఏ’ తొలి మహిళా సింహాలు వీరే..
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Modi-Trump Meet: ఫ్రాన్స్లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్హౌజ్..
Jharkhand illegal mining case: సీఎం సన్నిహిత నేత ఇంట్లో ఏకే-47 రైఫిళ్లు స్వాధీనం
ఈ మేలో ‘ల్యాండ్స్ ఫర్ జాబ్స్’ కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్, అతని భార్య, కుమార్తెలతో పాటు పలువురిని ఈ కేసులో నిందితులుగా పేర్కొంది. మే నెలలో ఢిల్లీ, బీహార్లలో లాలూ యాదవ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన 17 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా పనిచేసిన భోలా యాదవ్ను ‘ల్యాండ్స్ ఫర్ జాబ్స్’ కేసులో సీబీఐ జులైలో అరెస్టు చేసింది.
తాజావార్తలు
-
9000mAh Battery Smartphones 2026: 9000mAh బ్యాటరీతో 2026లో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే.. పూర్తి జాబితా!
-
The Deverakonda Foundation : స్వగ్రామంలో 180 మంది విద్యార్థులకు స్కాలర్షిప్… విజయ్ దేవరకొండ గొప్ప మనసు
-
Shubman Gill: నేను ఇప్పటివరకు గుర్తుండిపోయే క్యాచ్ అందుకోలేదు.. చాలా సంతోషంగా ఉంది!
-
Best Electric Scooters: ఓలా, హీరో, టీవీఎస్.. హైయెస్ట్ స్పీడ్ గల ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది? కేవలం రూ.44,990 నుంచే ప్రారంభం!
-
Explainer: ప్రేమిస్తే జైలుకు..? శృంగారంలో పరస్పర అంగీకారం ఉన్నా కూడా రే*ప్ కేసు అవుతుందా?
ట్రెండింగ్
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!