Jharkhand illegal mining case: సీఎం సన్నిహిత నేత ఇంట్లో ఏకే-47 రైఫిళ్లు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand illegal mining case: అక్రమ మైనింగ్ కేసులో మనీలాండరింగ్ నిబంధనల కింద జార్ఖండ్, బీహార్లతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. ఈ దాడుల్లో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు అత్యంత సన్నిహితుడైన ప్రేమ్ ప్రకాశ్ ఇంట్లో రెండు ఏకే-47 రైఫిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ్ ప్రకాశ్ ఇంట్లోని అల్మారాలో వాటిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రేమ్ ప్రకాశ్కు సంబంధించి తమకు సమాచారం అందిందని, సీఎం హేమంత్ సోరెన్తో కూడా సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఈ దాడులు చేపట్టామని అధికారులు తెలిపారు. జార్ఖండ్లో అక్రమ మైనింగ్, మనీ లాండరింగ్పై ఈడీ విచారణ కొనసాగుతోంది.గతంలో కూడా ప్రేమ్ ప్రకాష్ నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అక్రమ ఆయుధాలపై ప్రత్యేకంగా మరో కేసు నమోదు చేయనున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రతినిధి పంకజ్ మిశ్రాను ప్రశ్నించడంతో తాజాగా దాడులు జరుగుతున్నాయి. ఈడీ జులై 19న మిశ్రాను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) 2002 కింద అరెస్టు చేసింది.
ప్రేమ్ ప్రకాశ్ ఇంటి ఆవరణతోపాటు మరో 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని అధికారులు చెప్పారు. జార్ఖండ్, బిహార్, తమిళనాడు, ఢిల్లీ-ఎన్సీఆర్లలో దాడులు జరిపామని వివరించారు. ఆయుధాల గుర్తింపు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయనున్నామని, ఆయుధ చట్టాల ప్రేమ్ ప్రకాశ్పై ప్రత్యేక కేసు నమోదు చేసే అవకాశం ఉందని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
Congress: కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనకే అవకాశం.. 1998 తర్వాత గాంధీయేతర కుటుంబం నుంచి ఛాన్స్
అలాగే, జార్ఖండ్లో అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి గతంలో అరెస్టు చేసిన బచ్చు యాదవ్ను రాంచీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు ఈ నెల ప్రారంభంలో ఆరు రోజుల ఈడీ రిమాండ్కు పంపింది. బచ్చు పంకజ్ మిశ్రాకు సన్నిహితుడు. ఈ కేసులో మిశ్రాకు చెందిన 37 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.11.88 కోట్ల నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న మొత్తం మిశ్రా, దాహూ యాదవ్, వారి సహచరులకు చెందినది. దీంతోపాటు ఇన్ల్యాండ్ వెస్సల్ ఎం.వి.ఇన్ఫ్రాలింక్-3ను కూడా అధికారులు సీజ్చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు సుమారు రూ.36 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకొంది. ‘ఇప్పటి వరకు మేము స్వాధీనం చేసుకొన్న నగదు, బ్యాంక్ ఖాతాల్లోని సొమ్ము సాహిబ్గంజ్, సమీప అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించినట్లు తెలుస్తోంది. అక్రమ మైనింగ్ నుంచి సంపాదించిన రూ.100 కోట్లు ఉన్న ప్రాంతం విషయం కూడా తెలిసింది. దానిని వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని ఈడీ పేర్కొంది.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!