Jharkhand illegal mining case: సీఎం సన్నిహిత నేత ఇంట్లో ఏకే-47 రైఫిళ్లు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand illegal mining case: అక్రమ మైనింగ్ కేసులో మనీలాండరింగ్ నిబంధనల కింద జార్ఖండ్, బీహార్లతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. ఈ దాడుల్లో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు అత్యంత సన్నిహితుడైన ప్రేమ్ ప్రకాశ్ ఇంట్లో రెండు ఏకే-47 రైఫిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ్ ప్రకాశ్ ఇంట్లోని అల్మారాలో వాటిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రేమ్ ప్రకాశ్కు సంబంధించి తమకు సమాచారం అందిందని, సీఎం హేమంత్ సోరెన్తో కూడా సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఈ దాడులు చేపట్టామని అధికారులు తెలిపారు. జార్ఖండ్లో అక్రమ మైనింగ్, మనీ లాండరింగ్పై ఈడీ విచారణ కొనసాగుతోంది.గతంలో కూడా ప్రేమ్ ప్రకాష్ నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అక్రమ ఆయుధాలపై ప్రత్యేకంగా మరో కేసు నమోదు చేయనున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రతినిధి పంకజ్ మిశ్రాను ప్రశ్నించడంతో తాజాగా దాడులు జరుగుతున్నాయి. ఈడీ జులై 19న మిశ్రాను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) 2002 కింద అరెస్టు చేసింది.
ప్రేమ్ ప్రకాశ్ ఇంటి ఆవరణతోపాటు మరో 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని అధికారులు చెప్పారు. జార్ఖండ్, బిహార్, తమిళనాడు, ఢిల్లీ-ఎన్సీఆర్లలో దాడులు జరిపామని వివరించారు. ఆయుధాల గుర్తింపు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయనున్నామని, ఆయుధ చట్టాల ప్రేమ్ ప్రకాశ్పై ప్రత్యేక కేసు నమోదు చేసే అవకాశం ఉందని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.
Also Read
- Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్తో H-1B ఇండియన్లలో భయం..
- Kejriwal: కేజ్రీవాల్ ఎన్నికల్లో పోటీ చేయొద్దనడానికి మీరెవరు? పిటిషనర్కు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు
- Sharad Pawar: విదేశీ పర్యటనలతో దేశ ప్రతిష్టతను కాపాడుతున్నారు.. మోడీపై శరద్పవార్ ప్రశంసలు
- Twisha Sharma: దేహమంతా గాయాలే.. తెలుగు నటి పోస్ట్మార్టంలో షాకింగ్ విషయాలు
Congress: కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనకే అవకాశం.. 1998 తర్వాత గాంధీయేతర కుటుంబం నుంచి ఛాన్స్
అలాగే, జార్ఖండ్లో అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి గతంలో అరెస్టు చేసిన బచ్చు యాదవ్ను రాంచీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు ఈ నెల ప్రారంభంలో ఆరు రోజుల ఈడీ రిమాండ్కు పంపింది. బచ్చు పంకజ్ మిశ్రాకు సన్నిహితుడు. ఈ కేసులో మిశ్రాకు చెందిన 37 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.11.88 కోట్ల నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న మొత్తం మిశ్రా, దాహూ యాదవ్, వారి సహచరులకు చెందినది. దీంతోపాటు ఇన్ల్యాండ్ వెస్సల్ ఎం.వి.ఇన్ఫ్రాలింక్-3ను కూడా అధికారులు సీజ్చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు సుమారు రూ.36 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకొంది. ‘ఇప్పటి వరకు మేము స్వాధీనం చేసుకొన్న నగదు, బ్యాంక్ ఖాతాల్లోని సొమ్ము సాహిబ్గంజ్, సమీప అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించినట్లు తెలుస్తోంది. అక్రమ మైనింగ్ నుంచి సంపాదించిన రూ.100 కోట్లు ఉన్న ప్రాంతం విషయం కూడా తెలిసింది. దానిని వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని ఈడీ పేర్కొంది.
తాజావార్తలు
-
Motorola Razr Fold: మోటరోలా రేజర్ ఫోల్డ్ సేల్ స్టార్ట్.. రూ. 10000 డిస్కౌంట్! 6,000mAh బ్యాటరీ, 8.1-అంగుళాల స్క్రీన్
-
Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్తో H-1B ఇండియన్లలో భయం..
-
Kejriwal: కేజ్రీవాల్ ఎన్నికల్లో పోటీ చేయొద్దనడానికి మీరెవరు? పిటిషనర్కు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు
-
WFH: ఆ బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోం..
-
Chiranjeevi : ఏపీసెట్ టాపర్ రుషి.. కలను నిజం చేసి, ల్యాప్టాప్ బహుకరించిన మెగాస్టార్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!