Mahua Moitra: మహువా మోయిత్రాపై సీబీఐ విచారణ.? “క్యాష్ ఫర్ క్వేరీ” కేసులో కీలక మలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా డబ్బులు తీసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ఆమెను పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ విచారించింది. ఇదిలా ఉంటే మహువా మోయిత్రాపై సీబీఐ విచారణ చేయాలని యాంటీ-కరప్షన్ ప్యానెల్ ఆదేశించిందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ మహువా మోయిత్రాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై అవినీతి నిరోధక సంస్థ లోక్పాల్ సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినట్లు బీజేపీకి చెందిన ఎంపీ నిషికాంత్ దూబే ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ‘‘ నా ఫిర్యాదు ఆధారంగా జాతీయ భద్రత విషయంలో రాజీ పడిన మహువా మోయిత్రా అవినీతిపై లోక్పాల్ సీబీఐ విచారణకు ఆదేశించింది.’’ అంటూ ట్వీట్ చేశారు. ఇదే నిజమైతే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టు అవుతుంది.
పార్లమెంట్లో అదానీకి వ్యతిరేకంగా ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని మహువా మోయిత్రా ప్రశ్నలు అడిగిందని, అందుకు గానూ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు, గిఫ్టులు తీసుకుందని నిషికాంత్ దూబే ఆరోపించారు. దీనిపై లోక్ సభ స్పీకర్కి లేఖ రాశారు. మరోవైపు మహువా తన పార్లమెంట్ లాగిన్ వివరాలను వేరే వారితో పంచుకోవడమే కాకుండా, దుబాయ్ నుంచి లాగిన్ అయిందని దీనిపై విచారణ జరపాలని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ కి లేఖ రాశారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Read Also: Mahua Moitra: మహువా మోయిత్రాపై సీబీఐ విచారణ.? “క్యాష్ ఫర్ క్వేరీ” కేసులో కీలక మలుపు
ఈ నేపథ్యంలో వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ముందు ఓ అఫిడవిట్ సమర్పించారు. తన వద్ద నుంచి మహువా గిఫ్టులు తీసుకున్న మాట నిజమే అని అందులో ఒప్పుకున్నారు. ప్రధాని మోడీని, అదానీ గ్రూపును లక్ష్యంగా చేసుకుని ప్రశ్నలు అడిగిందని అందులో పేర్కొన్నారు. తనతో చేయకూడని పనులు చేయించుకుందని ఆరోపించారు.
ఈ వ్యవహారంపై ఈ నెల2న పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ మహువా మోయిత్రాను విచారించింది. అయితే ఈ సమావేశంలో విపక్ష ఎంపీలు ఆమెకు మద్దతుగా నిలిచారు. ప్యానెల్ చైర్పర్సన్ ఆమెను అడగకూడని ప్రశ్నలు అడిగారని విపక్ష ఎంపీలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎంపీ నిషికాంత్ దూబే సీబీఐ విచారణ జరుగుతుందని ట్వీట్ చేయడంతో మరోసారి ఈ కేసు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
लोकपाल ने आज मेरे कम्प्लेन पर आरोपी सांसद महुआ जी के राष्ट्रीय सुरक्षा को गिरवी रखकर भ्रष्टाचार करने पर CBI inquiry का आदेश दिया
— Dr Nishikant Dubey (@nishikant_dubey) November 8, 2023
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!