Rajasthan: ప్రభుత్వ భవనం కింద రూ.2000 నోట్ల కట్టలు, బంగారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: అవినీతి అధికారులు, అవినీతి డబ్బును దాచేందుకు ఏకంగా ప్రభుత్వ భవనాన్నే వాడకున్నారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాజధాని జైపూర్ నగరంలోని యోజన భవన్లోని బేస్మెంట్లో తాళం వేసి ఉన్న అల్మారా నుంచి ₹ 2.31 కోట్ల నగదు, కిలో బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ బేస్మెంట్లోకి తరుచుగా వెళ్లే ఏడుగురు ప్రభుత్వ అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: PM Modi: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ప్రధాని మోడీ భేటీ.. యుద్ధం తర్వాత ఇదే తొలిసారి
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
అల్మారాలో దాచి ఉంచిన ట్రాలీ సూట్కేస్లో రూ.2000, రూ.500 డినామినేషన్ నోట్లు ఉన్నాయి. ఆర్బీఐ రూ. 2000 కరెన్సీ చెలామణిని ఉపసంహరించుకున్న తర్వాతి రోజే రికవరీ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు అధికారులు వివరించారు. సూట్కేస్ నిండా నగదు, బంగారం కనుగొన్నామని, ఆ తర్వాత అనుమానిత ఉద్యోగులను అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ తరలించామని జైపూర్ పోలీస్ కమిషనర్ ఆనంద్ శ్రీవాస్తవ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మొత్తం రూ. 2.31 కోట్ల నగదు, కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ-ఫైలింగ్ ప్రాజెక్ట్ కింద ఫైళ్లను స్కాన్ చేసి డిజిటలైజ్ చేస్తున్నామని, తాళం వేసి ఉంచిన రెండు అల్మారాలను తెరిచిన సమయంలో భారీగా డబ్బు, బంగారం కనిపించినట్లు అధికారలు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ రెండు అల్మారాలు గత కొంత కాలంగా తాళం వేేసే ఉన్నాయి. డబ్బు ఎవరిది..ఎలా వచ్చింది.. విచారణ జరుపుతున్నారు.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు అధికారులు. ఈ అంశంపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షం బీజేపీ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. యోజన భవన్ లోకి ఇంత డబ్బు ఎలా వచ్చిందో ముఖ్యమంత్రి చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తుంది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!