Tejasvi Surya: తప్పుడు వార్తలను ప్రచారం చేశారంటూ బీజేపీ ఎంపీపై కేసు నమోదు..
- ఓ రైతు భూమిని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకోవడంలో సూసైడ్ చేసుకున్నాడు..
- ప్పుడు వార్తలను ప్రచారం చేశారంటూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tejasvi Surya: కర్ణాటకలోని హవేరి జిల్లాకు చెందిన రైతు రుద్రప్ప చన్నప్ప బాలికై తన భూమిని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకోవడంతో సూసైడ్ చేసుకున్నట్లు.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, మంత్రి జమీర్ అహ్మద్ చర్యల వల్ల రైతులు కుంగిపోతున్నారని ఇటీవల సోషల్మీడియా వేదికగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఆరోపించారు. అయితే, 2022 జనవరిలో రైతు రుద్రప్ప పంట నష్టం, రుణ భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని, భూ సమస్యల వల్ల కాదని హవేరీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వెల్లించారు.
Read Also: Apple iOS 18.2: స్టన్నింగ్ ఫీచర్లతో సాఫ్ట్వేర్ అప్డేట్ను ఇచ్చిన ఆపిల్ సంస్థ
Also Read
- Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
- Kalyan Banerjee: "నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?" మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
- AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
కాగా, రైతు రుద్దరప్ప ఆత్మహత్యను వక్ఫ్ భూములకు ముడి పెడుతూ పోస్టు పెట్టి.. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలతో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యతో పాటు రెండు కన్నడ పత్రికల ఎడిటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వక్ఫ్ నోటీసులకు వ్యతిరేకంగా హవేరీలో రైతులు ఆందోళన తెలియజేస్తున్నారని.. ఈ ఘటనతో రైతు మానసిక క్షోభకు గురై సూసైడ్ చేసుకున్నారని వార్తా పత్రికలు తెలిపాయి. కాగా, ఆ పోస్టును ప్రస్తుతం ఎంపీ సూర్య డిలీట్ చేశారు.
Read Also: CJI DY Chandrachud: సీజేఐగా లాస్ట్ వర్కింగ్ డే.. అలీగఢ్ యూనివర్సిటీపై కీలక తీర్పు..
అయితే, కర్ణాటక అంతటా వక్ఫ్ భూముల సమస్యలపై ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎంపీ తేజస్వి సూర్య.. జాయింట్ పార్లమెంటరీ (జేపీసీ) కమిటీ ఛైర్మన్ జగదాంబికా పాల్ ఆందోళన చేపడుతున్న రైతుల దగ్గరకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వక్ఫ్ ఆస్తులపై నిజ నిర్ధరణ నివేదికను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అందజేస్తామని పాల్ తెలిపారు. ఇదిలా ఉండగా.. రైతులకు కొత్త వక్ఫ్ నోటీసులు జారీని నిలిపివేయాలని.. ఇప్పటికే ఉన్న నోటీసులను ఉపసంహరించుకోవాలని సీఎం సిద్ధరామయ్య అధికారులను ఆదేశించారు.
#haveripolice #fakenews #factcheck @DgpKarnataka @igperdvg @anshu_ips @kspfactcheck @siddaramaiah @BZZameerAhmedK @DrParameshwara @DKShivakumar @Tejasvi_Surya @KarnatakaCops pic.twitter.com/o4SMx8OTTL
— SP Haveri (@sphaveri) November 7, 2024
తాజావార్తలు
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?