Khalistan Referendum: ఖలిస్తానీ వేర్పాటువాదులకు ఎదురుదెబ్బ.. రెఫరెండానికి కెనడా అనుమతి నిరాకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalistan Referendum: ‘ఖలిస్తాన్’ పేరుతో భారత్ పై ఖలిస్తానీవాదులు విషం చిమ్ముతున్నారు. ముఖ్యంగా కెనడా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియాల్లోని కొంతమంది ఖలిస్తానీ వేర్పాటువాదులు ఇండియా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కెనడా వ్యాప్తంగా ఖలిస్తాని మద్దతుదారులు ‘ఖలిస్తాన్ రెఫరెండం’ పేరుతో నానా హంగామా సృష్టిస్తున్నారు. భారత్ నుంచి పంజాబ్ విడగొట్టి ఖలిస్తాన్ అనే కొత్త దేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10న కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఖలిస్తాన్ రెఫరెండంపై ఓటింగ్ నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే అక్కడి ప్రభుత్వం దీనికి అనుమతి నిరాకరించింది. ముఖ్యంగా ఏకే-47 పోస్టర్లతో ఖలిస్తాన్ మద్దతుదారులు ప్రచారం చేసిన కారణంగా అనుమతి నిరాకరించారు అక్కడి అధికారులు. ఖలిస్తాన్ రెఫరెండం కోసం కెనడా భూభాగాన్ని వినియోగించడంపై భారత్ పలుమార్లు తన అసహనం వ్యక్తం చేసింది.
Also Read
- సొంతిల్లు లేని వారికి గుడ్న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
- Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
- S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
- DILRMP 3.0: ఇకపై మీ భూమికి కూడా 'ఆధార్' లాంటి నెంబర్.. కేంద్రం సరికొత్త పథకం ప్రారంభం.!
Read Also: G20 Summit: జీ20 సదస్సుకు జిన్పింగ్ గైర్హాజరు.. ప్రీమియర్ వస్తారని స్పష్టం చేసిన చైనా
ఏకే-47 మెషిన్ గన్ పోస్టర్లు, కిర్పాన్లతో కూడిన ప్రచార చిత్రాలు ఉండటంతో ఒప్పందాన్ని ఉల్లంఘించారని చెబుతూ అనుమతి రద్దు చేసినట్లు కెనడా అధికారులు వెల్లడించారు. చాలా సార్లు ఈ పోస్టర్లను తీసేయాలని చెప్పినప్పటికీ నిర్వాహకులు వీటిని తీసేయకపోవడంతోనే అనుమతి నిరాకరించామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఫ్రెండ్స్ ఆఫ్ కెనడా , ఇండియా ఫౌండేషన్ అధ్యక్షుడు మణిందర్ గిల్ స్వాగతించారు.
ఏకే-47 పోస్టర్లే కాకుండా జూన్ 23, 1985న 329 మంది ప్రయాణికులను బలిగొన్న ఎయిరిండియా ఫ్లైట్ 182 కనిష్కపై ఉగ్రవాద దాడిలో కీలకంగా ఉన్న తల్వీందర్ సింగ్ పోస్టర్లను కూడా అంటించారు. అయితే ఈ రెఫరెండం క్యాన్సిల్ కావడంతో కొత్త తేదీని నిర్వాహకులు ప్రకటించలేదు. సిక్కు వేర్పాటువాది, సిక్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ సెప్టెంబర్ 8న వాంకోవర్ లోని ఇండియన్ కాన్సులేట్ ‘లాక్ డౌన్’కి ఖలిస్తాన్ మద్దతుదారులకు పిలుపునిచ్చాడు.
తాజావార్తలు
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
-
సొంతిల్లు లేని వారికి గుడ్న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?