Khalistan Referendum: ఖలిస్తానీ వేర్పాటువాదులకు ఎదురుదెబ్బ.. రెఫరెండానికి కెనడా అనుమతి నిరాకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalistan Referendum: ‘ఖలిస్తాన్’ పేరుతో భారత్ పై ఖలిస్తానీవాదులు విషం చిమ్ముతున్నారు. ముఖ్యంగా కెనడా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియాల్లోని కొంతమంది ఖలిస్తానీ వేర్పాటువాదులు ఇండియా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కెనడా వ్యాప్తంగా ఖలిస్తాని మద్దతుదారులు ‘ఖలిస్తాన్ రెఫరెండం’ పేరుతో నానా హంగామా సృష్టిస్తున్నారు. భారత్ నుంచి పంజాబ్ విడగొట్టి ఖలిస్తాన్ అనే కొత్త దేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10న కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఖలిస్తాన్ రెఫరెండంపై ఓటింగ్ నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే అక్కడి ప్రభుత్వం దీనికి అనుమతి నిరాకరించింది. ముఖ్యంగా ఏకే-47 పోస్టర్లతో ఖలిస్తాన్ మద్దతుదారులు ప్రచారం చేసిన కారణంగా అనుమతి నిరాకరించారు అక్కడి అధికారులు. ఖలిస్తాన్ రెఫరెండం కోసం కెనడా భూభాగాన్ని వినియోగించడంపై భారత్ పలుమార్లు తన అసహనం వ్యక్తం చేసింది.
Also Read
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
Read Also: G20 Summit: జీ20 సదస్సుకు జిన్పింగ్ గైర్హాజరు.. ప్రీమియర్ వస్తారని స్పష్టం చేసిన చైనా
ఏకే-47 మెషిన్ గన్ పోస్టర్లు, కిర్పాన్లతో కూడిన ప్రచార చిత్రాలు ఉండటంతో ఒప్పందాన్ని ఉల్లంఘించారని చెబుతూ అనుమతి రద్దు చేసినట్లు కెనడా అధికారులు వెల్లడించారు. చాలా సార్లు ఈ పోస్టర్లను తీసేయాలని చెప్పినప్పటికీ నిర్వాహకులు వీటిని తీసేయకపోవడంతోనే అనుమతి నిరాకరించామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఫ్రెండ్స్ ఆఫ్ కెనడా , ఇండియా ఫౌండేషన్ అధ్యక్షుడు మణిందర్ గిల్ స్వాగతించారు.
ఏకే-47 పోస్టర్లే కాకుండా జూన్ 23, 1985న 329 మంది ప్రయాణికులను బలిగొన్న ఎయిరిండియా ఫ్లైట్ 182 కనిష్కపై ఉగ్రవాద దాడిలో కీలకంగా ఉన్న తల్వీందర్ సింగ్ పోస్టర్లను కూడా అంటించారు. అయితే ఈ రెఫరెండం క్యాన్సిల్ కావడంతో కొత్త తేదీని నిర్వాహకులు ప్రకటించలేదు. సిక్కు వేర్పాటువాది, సిక్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ సెప్టెంబర్ 8న వాంకోవర్ లోని ఇండియన్ కాన్సులేట్ ‘లాక్ డౌన్’కి ఖలిస్తాన్ మద్దతుదారులకు పిలుపునిచ్చాడు.
తాజావార్తలు
-
Zim vs Ban: ‘ఇన్నోసెంట్ కైయా’ సెంచరీ.. బంగ్లాదేశ్పై ఇన్నింగ్స్ తేడాతో జింబాబ్వే ఘన విజయం.!
-
2026 Half Year: అర్థ సంవత్సరంలో అంతర్జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
-
Trisha: త్రిష పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!
-
Brahmanandam: బ్రహ్మాజీ పరువు తీసేసిన బ్రహ్మానందం!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
ట్రెండింగ్
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ