Khalistan Referendum: ఖలిస్తానీ వేర్పాటువాదులకు ఎదురుదెబ్బ.. రెఫరెండానికి కెనడా అనుమతి నిరాకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalistan Referendum: ‘ఖలిస్తాన్’ పేరుతో భారత్ పై ఖలిస్తానీవాదులు విషం చిమ్ముతున్నారు. ముఖ్యంగా కెనడా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియాల్లోని కొంతమంది ఖలిస్తానీ వేర్పాటువాదులు ఇండియా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కెనడా వ్యాప్తంగా ఖలిస్తాని మద్దతుదారులు ‘ఖలిస్తాన్ రెఫరెండం’ పేరుతో నానా హంగామా సృష్టిస్తున్నారు. భారత్ నుంచి పంజాబ్ విడగొట్టి ఖలిస్తాన్ అనే కొత్త దేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10న కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఖలిస్తాన్ రెఫరెండంపై ఓటింగ్ నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే అక్కడి ప్రభుత్వం దీనికి అనుమతి నిరాకరించింది. ముఖ్యంగా ఏకే-47 పోస్టర్లతో ఖలిస్తాన్ మద్దతుదారులు ప్రచారం చేసిన కారణంగా అనుమతి నిరాకరించారు అక్కడి అధికారులు. ఖలిస్తాన్ రెఫరెండం కోసం కెనడా భూభాగాన్ని వినియోగించడంపై భారత్ పలుమార్లు తన అసహనం వ్యక్తం చేసింది.
Also Read
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
Read Also: G20 Summit: జీ20 సదస్సుకు జిన్పింగ్ గైర్హాజరు.. ప్రీమియర్ వస్తారని స్పష్టం చేసిన చైనా
ఏకే-47 మెషిన్ గన్ పోస్టర్లు, కిర్పాన్లతో కూడిన ప్రచార చిత్రాలు ఉండటంతో ఒప్పందాన్ని ఉల్లంఘించారని చెబుతూ అనుమతి రద్దు చేసినట్లు కెనడా అధికారులు వెల్లడించారు. చాలా సార్లు ఈ పోస్టర్లను తీసేయాలని చెప్పినప్పటికీ నిర్వాహకులు వీటిని తీసేయకపోవడంతోనే అనుమతి నిరాకరించామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఫ్రెండ్స్ ఆఫ్ కెనడా , ఇండియా ఫౌండేషన్ అధ్యక్షుడు మణిందర్ గిల్ స్వాగతించారు.
ఏకే-47 పోస్టర్లే కాకుండా జూన్ 23, 1985న 329 మంది ప్రయాణికులను బలిగొన్న ఎయిరిండియా ఫ్లైట్ 182 కనిష్కపై ఉగ్రవాద దాడిలో కీలకంగా ఉన్న తల్వీందర్ సింగ్ పోస్టర్లను కూడా అంటించారు. అయితే ఈ రెఫరెండం క్యాన్సిల్ కావడంతో కొత్త తేదీని నిర్వాహకులు ప్రకటించలేదు. సిక్కు వేర్పాటువాది, సిక్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ సెప్టెంబర్ 8న వాంకోవర్ లోని ఇండియన్ కాన్సులేట్ ‘లాక్ డౌన్’కి ఖలిస్తాన్ మద్దతుదారులకు పిలుపునిచ్చాడు.
తాజావార్తలు
-
PEDDI Ki Aawaz: నమస్తే భోపాల్.. దసరా మైదాన్లో ‘పెద్ది’ దిగుతున్నాడు!
-
CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!