Maharashtra Bus Fire: ఈ 8 మంది మృత్యుంజయులు.. బస్సు ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Bus Fire: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగ్ పూర్ నుంచి పూణే వెళ్తున్న స్లీపర్ కోచ్ బస్సు ప్రమాదానికి గురై 25 మంది సజీవదహనమయ్యారు. మొత్తం 33 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బుల్దానా జిల్లాలోని సమృద్ధి ఎక్స్ప్రెస్వేపై సింధ్ఖేడ్రాజా సమీపంలోని పింపాల్ఖుటా గ్రామం వద్ద శనివారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో రోడ్డు డివైడర్ను ఢీకొనడంతో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 33 మంది ప్రయాణికుల్లో 25 మంది మరణించారు. డ్రైవర్, క్లీనర్ తో సహా 8 మంది ప్రాణాలు దక్కించుకున్నారు.
బస్సు ప్రమాదానికి గురైన సమయంలో కుడివైపు బోల్తాపడిందని.. దాని ఎంట్రెన్స్/ఎగ్జిట్ డోర్ పైకి ఉందని ప్రమాదం నుంచి బయటపడిన వారు తెలిపారు. ఈ 8 మంది ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డారనేది ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉందని చెబుతున్నారు. బస్సు టైర్ పగలడంతో బస్సు బోల్తా పడింది. వెంటనే మంటలు అంటుకున్నట్లు ప్రయాణికుల్లో బతికిన వ్యక్తి చెప్పారు. నా పక్కన కూర్చున్న వ్యక్తి, నేను వెనక కిటికీ పగలగొట్టి బస్సు నుంచి బయటపడ్డామని తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది త్వరితగతిన ఘటనాస్థలికి చేరుకున్నారని ప్రాణాలతో బయటపడిన వ్యక్తి తెలిపారు.
Also Read
- Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
- Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
- Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
Read Also: ICC World Cup Qualifier: వెస్టిండీస్కి ఘోర అవమానం.. పసికూన దెబ్బకు వరల్డ్కప్ నుంచి ఔట్
ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన మరో వ్యక్తి ఆయుష్ ఘట్గే ఈ ఘోర ప్రమాదం నుంచి బయటపడడం ఓ అద్భుతం అన్నారు. అతను నాగపూర్లోని పారిశ్రామిక శివారు ప్రాంతమైన బుటిబోరి వద్ద తాను బస్సు ఎక్కినట్లు తెలిపారు. ‘‘ప్రమాదం జరిగిన సమయంలో నేను చివరి సీటులో మరియు నిద్రపోతున్నాను. ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది నాపై పడటంతో నేను మేల్కొన్నాను. నేను వెంటనే లేచి బయటకు రావడానికి కిటికీ కోసం వెతకడం ప్రారంభించాను. నాతో పాటు ముగ్గురం ఒకరికి ఒకరం సాయం చేసుకుని బస్సు విండో అద్దాల్ని పగలగొట్టి బయటపడ్డాం’’ అని ఘట్గే అనే వ్యక్తి చెప్పారు.
ఉద్యోగాన్వేషన కోసం పూణే వెళ్తున్న ఐటీ ఇంజనీర్ అవనీ పోహ్నేకర్ ఈ ప్రమాదంలో మరణించారు. ఆమె వార్దాలో బస్సు ఎక్కిందని బంధువులు తెలిపారు. నలుగురైదుగురు ప్రయాణికులు మాత్రమే అద్దాలు పగలగొట్టి బయటపడ్డారని స్థానికులు చెప్పారు. బస్సు నుంచి బయటపడిన ప్రయాణికులకు హైవేపై వెళ్తున్న వాహనదారుల నుంచి సాయం అందలేదని చెప్పారు.
సాయం కోసం వెళ్లినప్పుడు అక్కడ భయానక పరిస్థితులు ఉన్నాయని స్థానికులు చెప్పారు. ప్రయాణికులు మంటల్లో సజీవదహనం అవ్వడం చూశామని.. మంటలు తీవ్రంగా ఉండటంతో ఏం చేయలేకపోయామని, కన్నీరు పెట్టుకోవడం తప్పితే సాయం చేయలేకపోయాం అని స్థానిక నివాసి తెలిపారు. హైవే గుండా వెళ్లే వాహనాలను సహాయం కోసం నిలిపి ఉంటే, మరింత మంది ప్రాణాలను కాపాడేవారని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
-
Thaman : ‘ఎల్లమ్మ’ కథపై తమన్ షాకింగ్ కామెంట్స్..
-
Infosys: ఉద్యోగాల ఊస్ట్ సమయంలోనూ ఈ కంపెనీ ఏకంగా కోటి రూపాయల జీతాలు ఎలా ఇస్తోంది?
-
Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!