Maharashtra Bus Fire: ఈ 8 మంది మృత్యుంజయులు.. బస్సు ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Bus Fire: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగ్ పూర్ నుంచి పూణే వెళ్తున్న స్లీపర్ కోచ్ బస్సు ప్రమాదానికి గురై 25 మంది సజీవదహనమయ్యారు. మొత్తం 33 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బుల్దానా జిల్లాలోని సమృద్ధి ఎక్స్ప్రెస్వేపై సింధ్ఖేడ్రాజా సమీపంలోని పింపాల్ఖుటా గ్రామం వద్ద శనివారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో రోడ్డు డివైడర్ను ఢీకొనడంతో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 33 మంది ప్రయాణికుల్లో 25 మంది మరణించారు. డ్రైవర్, క్లీనర్ తో సహా 8 మంది ప్రాణాలు దక్కించుకున్నారు.
బస్సు ప్రమాదానికి గురైన సమయంలో కుడివైపు బోల్తాపడిందని.. దాని ఎంట్రెన్స్/ఎగ్జిట్ డోర్ పైకి ఉందని ప్రమాదం నుంచి బయటపడిన వారు తెలిపారు. ఈ 8 మంది ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డారనేది ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉందని చెబుతున్నారు. బస్సు టైర్ పగలడంతో బస్సు బోల్తా పడింది. వెంటనే మంటలు అంటుకున్నట్లు ప్రయాణికుల్లో బతికిన వ్యక్తి చెప్పారు. నా పక్కన కూర్చున్న వ్యక్తి, నేను వెనక కిటికీ పగలగొట్టి బస్సు నుంచి బయటపడ్డామని తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది త్వరితగతిన ఘటనాస్థలికి చేరుకున్నారని ప్రాణాలతో బయటపడిన వ్యక్తి తెలిపారు.
Also Read
Read Also: ICC World Cup Qualifier: వెస్టిండీస్కి ఘోర అవమానం.. పసికూన దెబ్బకు వరల్డ్కప్ నుంచి ఔట్
ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన మరో వ్యక్తి ఆయుష్ ఘట్గే ఈ ఘోర ప్రమాదం నుంచి బయటపడడం ఓ అద్భుతం అన్నారు. అతను నాగపూర్లోని పారిశ్రామిక శివారు ప్రాంతమైన బుటిబోరి వద్ద తాను బస్సు ఎక్కినట్లు తెలిపారు. ‘‘ప్రమాదం జరిగిన సమయంలో నేను చివరి సీటులో మరియు నిద్రపోతున్నాను. ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది నాపై పడటంతో నేను మేల్కొన్నాను. నేను వెంటనే లేచి బయటకు రావడానికి కిటికీ కోసం వెతకడం ప్రారంభించాను. నాతో పాటు ముగ్గురం ఒకరికి ఒకరం సాయం చేసుకుని బస్సు విండో అద్దాల్ని పగలగొట్టి బయటపడ్డాం’’ అని ఘట్గే అనే వ్యక్తి చెప్పారు.
ఉద్యోగాన్వేషన కోసం పూణే వెళ్తున్న ఐటీ ఇంజనీర్ అవనీ పోహ్నేకర్ ఈ ప్రమాదంలో మరణించారు. ఆమె వార్దాలో బస్సు ఎక్కిందని బంధువులు తెలిపారు. నలుగురైదుగురు ప్రయాణికులు మాత్రమే అద్దాలు పగలగొట్టి బయటపడ్డారని స్థానికులు చెప్పారు. బస్సు నుంచి బయటపడిన ప్రయాణికులకు హైవేపై వెళ్తున్న వాహనదారుల నుంచి సాయం అందలేదని చెప్పారు.
సాయం కోసం వెళ్లినప్పుడు అక్కడ భయానక పరిస్థితులు ఉన్నాయని స్థానికులు చెప్పారు. ప్రయాణికులు మంటల్లో సజీవదహనం అవ్వడం చూశామని.. మంటలు తీవ్రంగా ఉండటంతో ఏం చేయలేకపోయామని, కన్నీరు పెట్టుకోవడం తప్పితే సాయం చేయలేకపోయాం అని స్థానిక నివాసి తెలిపారు. హైవే గుండా వెళ్లే వాహనాలను సహాయం కోసం నిలిపి ఉంటే, మరింత మంది ప్రాణాలను కాపాడేవారని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!