Punjab and Haryana HC: భర్తని ‘‘నపుంసకుడు’’ అని పిలవడం మానసిక క్రూరత్వమే..
- భర్తని ‘నపుంసకుడి’గా పిలవడం మానసిక క్రూరత్వమే..
- విడాకులను సమర్థించిన పంజాబ్ - హర్యానా హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab and Haryana HC: భర్తని ‘‘హిజ్దా’’(నపుంసకుడు) అని పిలవడం మానసిక క్రూరత్వమే అని పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ వ్యక్తికి అనుకూలంగా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకులను హైకోర్టు సమర్థించింది. ఈ ఏడాది జూలైలో ఫ్యామిలీ కోర్టు తన భర్తకు అనుకూలంగా విడాకులు మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. ఒక మహిళ వేసిన పిటిషన్ని జస్టిస్ జస్జిత్ సింగ్ బేడీ, జస్టిన్ సుధీర్ సింగ్లతో కూడిన డివిజనల్ బెంచ్ విచారించింది.
‘‘ఫ్యామిలీ కోర్టు చెప్పినదానిని బట్టి చూస్తే, సుప్రీంకోర్టు తీర్పులను పరిశీలిస్తే, అప్పీలుదారు-భార్య యొక్క చర్యలు, ప్రవర్తన క్రూరత్వానికి సమానం’’ అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. భర్తను హిజ్దాగా పేర్కొనడం, అతడి తల్లిని నపుంసకుడికి జన్మనిచ్చామని దూషించడం మానసిక క్రూరత్వానికి సంబంధంచిన చర్యగా కోర్టు పేర్కొంది. భార్య మొత్తం చర్యలను, ప్రవర్తనను పరిగణలోకి తీసుకుంటే, ఇరువురు ఆరేళ్లుగా విడివిడిగా నివసిస్తున్నట్లు తెలుస్తోందని, వారి మధ్య వివాహం విచ్ఛిన్నమైందని కోర్టు ఆర్డర్ పేర్కొంది.
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
Read Also: PM Modi Xi Jinping: ఐదేళ్ల తర్వాత ప్రధాని మోడీ, జిన్ పింగ్ భేటీ..
ఈ జంటకు 2017లో వివాహం జరిగింది. తన భార్య చాలా ఆలస్యంగా నిద్ర లేస్తుందని, తన తల్లిని మొదటి అంతస్తులోని బెడ్రూమ్ లోకి భోజనం పంపమని అడిగేదని, తన తల్లి కీళ్ల నొప్పులతో బాధపడుతున్నా.. రోజుకు నాలుగైదు సార్లు పైకి పిలిచేదని భర్త కోర్టు తెలిపాడు. తన భార్య పోర్న్ చూడటం అలవాటు చేసుకుందని, శారీరకంగా ఫిట్గా లేనని తనను వెక్కిరించేదని, వేరే వ్యక్తిని వివాహం చేసుకోవాలని అనుకుందని చెప్పాడు.
అయితే, భర్త ఆరోపణల్ని భార్య కొట్టిపారేసింది. తాను పోర్న్ చూస్తున్నానని ఎలాంటి సాక్ష్యం లేదని, తన అత్తమామలు తనకు మత్తు మందు ఇస్తు్న్నారని కూడా ఆరోపించింది. తన క్లయింట్పై భర్తే క్రూరత్వానికి పాల్పడినట్లు మహిళ తరుపున వాదిస్తున్న లాయర్ కోర్టుకు తెలిపాడు. అయితే, సదరు వ్యక్తి తల్లి తన కొడుకు నపుంసకుడు అని పిలిచేదని సాక్ష్యం చెప్పింది. భార్య తనకు మత్తు మందు ఇస్తున్నారనే వాదనకు రుజువులు చూపించలేకపోయింది. ఇద్దరు ఆరేళ్లుగా కలిసి లేరని, ఈ వివాహం పనికిరాకుండా పోయిందని, పూర్తిగా చనిపోయిందని, తిరిగి కలిసి ఉండాలని ఆదేశించడం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని కోర్టు పేర్కొంది.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!