Uttar Pradesh: బుల్డోజర్ యాక్షన్ షురూ.. శుక్రవారం తరువాత శనివారం ఉంటుందని వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశంలో ఉద్రిక్తతకు కారణం అయ్యాయి. పలు చోట్ల ముస్లింలు తమ నిరసనను తెలియజేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం రాళ్లు రువ్వడంతో పాటు ఆస్తులను ధ్వంసం చేయడం, వాహనాలను తగలబెట్టడం చేశారు. ముఖ్యంగా ఇటీవల యూపీ కాన్పూర్ లో రాళ్లదాడి చేయగా.. నిన్న ప్రయాగ్ రాజ్ లో కొంతమంది అల్లరి మూకలు రాళ్లదాడి చేశారు. దీంతో పాటు సహరాల్ పూర్ లో కూడా ఉద్రిక్తత నెలకొంది. ఇక బెంగాల్ హౌరాలో, జార్ఖండ్ రాంచీలో ఆందోళను హింసాత్మకంగా మారాయి. రాంచీ అల్లర్లలో ఇద్దరు మరణించారు.
ఇదిలా ఉంటే శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా ప్రవర్తించిన నిందితులను గుర్తించే పనిలో ఉంది ఉత్తర్ ప్రదేశ్ యోగీ సర్కార్. మరోసారి యోగీ తన బుల్డోజర్ అస్త్రాన్ని బయటకు తీశారు. సహరాన్ పూర్ లో అల్లర్లకు కారణం అయిన ఇద్దరు నిందితులను గుర్తించి వారి అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేశారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ప్రవర్తించిన 64 మందిని అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులు ముజమ్మిల్, అబ్దుల్ వకీర్ నివాసాలను మునిసిపల్ సిబ్బంది కూల్చివేసింది. ప్రతీ శుక్రవారం తరువాత శనివారం ఉంటుందని యూపీ సీఎం మీడియా అడ్వైజర్ మృత్యుంజయ్ కుమార్ ట్విట్టర్ లో ఆందోళనకారులను హెచ్చరించారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
జూన్ 3న కాన్పూర్ లో అల్లర్లలో ప్రమేయం ఉన్న జాఫర్ హయత్ హష్మీ ఆస్తులను కూడా కూల్చివేశారు. ఇతని దగ్గరి బందువైన ఇస్తియాఖ్ కొత్తగా నిర్మించుకున్న భవనాన్ని కాన్పూర్ డెవలప్మెంట్ అథారిటీ కూల్చిేసింది. కాన్పూర్ అల్లర్లోప్రమేయం ఉన్న జావేద్ అహ్మద్ ఖాన్, మహ్మద్ రహీల్, సుఫియాన్, హష్మీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని మూడు రోజుల విచారణ కోసం పోలీసులకు అప్పగించింది స్థానిక కోర్ట్. ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్, షహరాన్ పూర్, ప్రయాగ్ రాజ్ మొదలైన చోట్ల అల్లర్లకు కారణం అయిన మొత్తం 230 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరిని గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!