Ram Mohan Naidu: కూలిన టెర్మినల్ కప్పు మోడీ ప్రారంభించింది కాదు.. 2009లో నిర్మించారు..
- ఢిల్లీ ఎయిర్పోర్టును పరిశీలించిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
- టెర్మినల్1 పైకప్పు కూలడం తీవ్రమైన ఘటన అన్న మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aviation Minister Ram Mohan Naidu: ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 వద్ద పైకప్పు కూలిపోవడంతో ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. పౌర విమానయాన శాఖ మంత్రి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఇది చాలా తీవ్రమైన ఘటన అని ఆయన వ్యాఖ్యానించారు. కూలిన టర్మినల్ పైకప్పు 2008-09 కాలంలో నిర్మించబడిందని మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం తెలిపారు. ఈ ఏడాది మార్చిలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరించిన టెర్మినల్ 1లో భాగమే కూలిపోయిందని కాంగ్రెస్ ఆరోపించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో పరిస్థితిని పరిశీలించిన రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన భవనం మరొక వైపు ఉందని, ఇక్కడ కూలిపోయిన భవనం పాత భవనమని, 2009 లో ప్రారంభించబడిందని నేను స్పష్టం చేయాలనుకుంటున్నానని చెప్పారు.
Read Also: NTA: ఏం చేద్దాం చెప్పండి.. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో పేరెంట్స్ని కోరిన కేంద్రం..
Also Read
- NTA: నీట్ వివాదం.. NTAలో భారీ ప్రక్షాళన.. 47 మందిపై వేటు..
- Ravneet Singh Bittu: కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు రాజీనామా.. ఆమోదం
- Delhi: చాట్జీపీటీకి శుభవార్త.. ఏఎన్ఐ కంటెంట్ వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఊరట
- Modi-Instagram: వైరల్ వీడియోతో ప్రధాని మోడీకి భారీ క్రేజ్.. ఒక్క రాత్రిలోనే సరికొత్త చరిత్ర
ప్రభావిత పైకప్పు నిర్మాణాన్ని జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. శుక్రవారం దేశ రాజధానిలో కురిసిన భారీ వర్షం కారణంగా ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్-1 పైకప్పులో కొంత భాగం కూలిపోయింది. దేశవ్యాప్తంగా ఆడిట్ నిర్వహించి మృతులకు రూ.20 లక్షలు, క్షతగాత్రులకు రూ.3 లక్షల పరిహారం ప్రకటించనున్నట్టు కేంద్రమంత్రి తెలిపారు. “టెర్మినల్1 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బయలుదేరాల్సిన అన్ని విమానాలు రద్దు చేయబడ్డాయి. ప్రయాణీకులు పూర్తి వాపసు పొందుతారు లేదా ప్రత్యామ్నాయ విమానాలు, మార్గాలలో రీబుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత బయలుదేరాల్సిన విమానాలు టెర్మినల్ 2, టెర్మినల్ 3 నుంచి నడపబడతాయి” అని ఓ ప్రకటనలో ఆయన చెప్పారు.
శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-1 పైకప్పులో కొంత భాగం కూలిపోవడంతో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. “ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తున్నాము. మేము వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఫైర్ సేఫ్టీ టీమ్, సీఐఎస్ఎఫ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పంపాము. ప్రతి ఒక్కరూ సైట్లో అందుబాటులో ఉన్నారు. వారు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తద్వారా ఇతర ప్రాణనష్టం జరగలేదు’’ అని మంత్రి తెలిపారు. గత 24 గంటల్లో ఢిల్లీలో జూన్లో అత్యధిక వర్షపాతం నమోదవడంతో ఢిల్లీలో 228.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఫ్లై ఓవర్ల కింద వాహనాలు మునిగిపోతున్న దృశ్యాలతో దేశ రాజధానిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!