Senior Citizen Railway Concession: సీనియర్ సిటిజన్లకు గుడ్న్యూస్.. బడ్జెట్లో రైల్వే టికెట్పై రాయితీలు ఉండే ఛాన్స్!
- బడ్జెట్ కి ముందు సీనియర్ సిటిజన్లకు గుడ్న్యూస్..
- సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్ ఛార్జీలలో భారీ రిలీఫ్ లభించే అవకాశం..
- ఆర్థిక మంత్రిత్వ శాఖ అండ్ రైల్వే మంత్రిత్వ శాఖ మధ్య ఈ విషయంపై చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Senior Citizen Railway Concession: 2026 ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్ రానుంది. ఈ బడ్జెట్ లో సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్ ఛార్జీలలో భారీ రిలీఫ్ లభించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. శతాబ్ది, రాజధాని, మెయిల్/ఎక్స్ప్రెస్ లాంటి ప్రధాన రైళ్లలో సీనియర్ సిటిజన్లకు 40 శాతం నుంచి 50 శాతం వరకు రాయితీలను పునరుద్ధరించాలని కేంద్రం పరిశీలిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020 మార్చిలో నిలిపివేసిన రైల్వే సీనియర్ సిటిజన్ కన్సెషన్ను తిరిగి ప్రారంభించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా, బడ్జెట్కు ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖ అండ్ రైల్వే మంత్రిత్వ శాఖ మధ్య ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే, 60 ఏళ్లు నిండిన పురుషులు, 58 ఏళ్లు నిండిన మహిళలు మళ్లీ రాయితీలతో రైలు టికెట్లు పొందే అవకాశం ఉంది.
Read Also: Putin-Zelensky: 4 ఏళ్ల యుద్ధం తర్వాత కీలక పరిణామం.. జెలెన్స్కీని మాస్కోకు ఆహ్వానించిన రష్యా
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
సీనియర్ సిటిజన్ కన్సెషన్:
భారతీయ రైల్వేలు దశాబ్దాలుగా సీనియర్ సిటిజన్లకు టికెట్ రాయితీ సౌకర్యం అందిస్తూ వచ్చాయి. ఇందులో పురుషులకు 40 శాతం, మహిళలకు 50 శాతం వరకు టికెట్ ధరలపై తగ్గింపు ఉండేది. ఈ సౌకర్యం స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ సహా దాదాపు అన్ని తరగతులకు వర్తించేది. టికెట్ బుకింగ్ సమయంలో వయసు వివరాలు నమోదు చేస్తే సరిపోయేది. ప్రత్యేక కార్డు లేదా అదనపు ప్రక్రియ అవసరం ఉండేది కాదు. ఈ రాయితీ IRCTC ఆన్లైన్ ప్లాట్ఫామ్ తో పాటు రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో కూడా అందుబాటులో ఉండేది. అయితే, 2020 మార్చిలో కోవిడ్-19 విజృంభణ కారణంగా రైలు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గడంతో రైల్వే తీవ్రమైన ఆర్థిక నష్టాలు ఎదుర్కొంది. ఈ పరిస్థితుల్లో సీనియర్ సిటిజన్ కన్సెషన్ను పూర్తిగా రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. కేవలం సీనియర్ సిటిజన్ రాయితీల వల్లే ఏటా సుమారు రూ.1,600 నుంచి రూ.2,000 కోట్ల వరకు నష్టం వస్తోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. తరువాత రైలు సేవలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించిన, టికెట్ ధరలు పెరిగినా, ఈ కన్సెషన్ మాత్రం ఇప్పటి వరకు తిరిగి అమలు చేయలేదు.
Read Also: స్నాప్డ్రాగన్ 8 ఎలైట్, 512GB స్టోరేజ్, 520Hz టచ్ సాంప్లింగ్ రేట్తో Red Magic 11 Air లాంచ్
బడ్జెట్ 2026లో ఏమి ఆశించవచ్చు?
అయితే, 2026 బడ్జెట్కు ముందు జరిగిన సమావేశాల్లో సీనియర్ సిటిజన్ కన్సెషన్ పునరుద్ధరణ అంశం చర్చకు వచ్చింది. ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు తుది ఆమోదం లభిస్తే, వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
సీనియర్ సిటిజన్లకు ఇది ఎందుకు ముఖ్యం?
ఈ కన్సెషన్ కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదు, వృద్ధులకు రైలు ప్రయాణాన్ని మరింత సులభంగా, అందుబాటులోకి తీసుకొచ్చే ముఖ్యమైన సాయంగా నిలిచింది. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే వృద్ధులకు, వైద్య, కుటుంబ అవసరాల కోసం తరచూ ప్రయాణించే వారికి టికెట్ ఖర్చు తగ్గడం వల్ల పెద్ద ఊరట లభిస్తుంది. అందుకే ఈ రాయితీ పునరుద్ధరణపై సీనియర్ సిటిజన్లు దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!