Bihar: బీహార్లో కుంగిన వంతెన..20 రోజల్లో ఆరో ఘటన..
- బీహార్లో కుంగిన వంతెన..
- 20 రోజుల్లో ఆరో ఘటన..
- వరసగా రాష్ట్రం కుప్పకూలుతున్న వంతెనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: బీహార్లో వరసగా వంతెనలను ప్రమాదానికి గురవుతున్నాయి. రోజుల వ్యవధిలో వంతెనలు కూలిపోవడమో, కుంగిపోవడం జరుగుతోంది. తాజాగా మరో వంతెన ఆదివారం కుంగిపోయింది. 20 రోజుల్లో ఇది ఆరో ఘటన. భారీ వర్షాల తర్వాత బండ్ నది నీటిమట్ట పెరగడంతో ఠాకూర్గంజ్ బ్లాక్లోని వంతెన ఈ రోజు కొన్ని అడుగుల మేర కుంగిపోయింది. దీంతో వంతెన ఉపరితలంపై పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో వంతెన ప్రమాదకరంగా మారింది. పఠారియా పంచాయతీలోని ఖోషి డాంగి గ్రామంలో ఉన్న వంతెనను ఠాకూర్గంజ్లోని అప్పటి ఎంపీ ఎండీ తస్లీముద్దీన్ ఎంపీ నిధుల నుంచి 2007-2008లో నిర్మించారు. కానీ వంతెన నీటి ఒత్తిడిని తట్టుకోలేకపోయినట్లు తెలుస్తోంది. మూడు నాలుగు పంచాయతీలను కలుపుతున్న ఈ వంతెన కూలిపోతే 60 వేల మంది ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది.
Read Also: Araku Coffee: అరకు కాఫీపై ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు మధ్య ఆసక్తికర చర్చ
Also Read
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
నిన్న మధుబని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. బీహార్ ప్రభుత్వంలోని రూరల్ వర్క్స్ డిపార్ట్మెంట్ రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంతెన కుప్పకూలింది. దీనికి ముందు అరారియా, సివాన్, తూర్పు చంపారన్ మరియు కిషన్గంజ్ ప్రాంతాల్లో వంతెనలు కూలాయి.
ఇటీవల బీహార్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వంతెనలు కూలిపోతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు ముఖ్యంగా ఆర్జేడీ పార్టీ అధికార జేడీయూ-బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర రాష్ట్రాలు బీహార్ ప్రజలకు ‘మంగళ్రాజ్’ అందించారని వంతెనల కూలిన ఘటనలపై ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ విమర్శించారు. అయితే, ఈ బ్రిడ్జిలు కూలిపోతున్న ఘటనపై ఏదైనా కుట్ర ఉందా..? అనే అనుమానాన్ని కేంద్రమంత్రి జీతన్ రామ్ మాంఝీ వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత నుంచే ఎందుకు కూలడం ప్రారంభమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పరువు తీసేందుకు ఏదైనా కుట్ర చేస్తున్నారా.? అని అన్నారు.
- Tags
- bihar
- Bihar Bridge Collapse
- bjp
- JDU
- RJD
తాజావార్తలు
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!