Bihar: బీహార్లో కుంగిన వంతెన..20 రోజల్లో ఆరో ఘటన..
- బీహార్లో కుంగిన వంతెన..
- 20 రోజుల్లో ఆరో ఘటన..
- వరసగా రాష్ట్రం కుప్పకూలుతున్న వంతెనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: బీహార్లో వరసగా వంతెనలను ప్రమాదానికి గురవుతున్నాయి. రోజుల వ్యవధిలో వంతెనలు కూలిపోవడమో, కుంగిపోవడం జరుగుతోంది. తాజాగా మరో వంతెన ఆదివారం కుంగిపోయింది. 20 రోజుల్లో ఇది ఆరో ఘటన. భారీ వర్షాల తర్వాత బండ్ నది నీటిమట్ట పెరగడంతో ఠాకూర్గంజ్ బ్లాక్లోని వంతెన ఈ రోజు కొన్ని అడుగుల మేర కుంగిపోయింది. దీంతో వంతెన ఉపరితలంపై పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో వంతెన ప్రమాదకరంగా మారింది. పఠారియా పంచాయతీలోని ఖోషి డాంగి గ్రామంలో ఉన్న వంతెనను ఠాకూర్గంజ్లోని అప్పటి ఎంపీ ఎండీ తస్లీముద్దీన్ ఎంపీ నిధుల నుంచి 2007-2008లో నిర్మించారు. కానీ వంతెన నీటి ఒత్తిడిని తట్టుకోలేకపోయినట్లు తెలుస్తోంది. మూడు నాలుగు పంచాయతీలను కలుపుతున్న ఈ వంతెన కూలిపోతే 60 వేల మంది ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది.
Read Also: Araku Coffee: అరకు కాఫీపై ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు మధ్య ఆసక్తికర చర్చ
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
నిన్న మధుబని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. బీహార్ ప్రభుత్వంలోని రూరల్ వర్క్స్ డిపార్ట్మెంట్ రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంతెన కుప్పకూలింది. దీనికి ముందు అరారియా, సివాన్, తూర్పు చంపారన్ మరియు కిషన్గంజ్ ప్రాంతాల్లో వంతెనలు కూలాయి.
ఇటీవల బీహార్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వంతెనలు కూలిపోతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు ముఖ్యంగా ఆర్జేడీ పార్టీ అధికార జేడీయూ-బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర రాష్ట్రాలు బీహార్ ప్రజలకు ‘మంగళ్రాజ్’ అందించారని వంతెనల కూలిన ఘటనలపై ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ విమర్శించారు. అయితే, ఈ బ్రిడ్జిలు కూలిపోతున్న ఘటనపై ఏదైనా కుట్ర ఉందా..? అనే అనుమానాన్ని కేంద్రమంత్రి జీతన్ రామ్ మాంఝీ వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత నుంచే ఎందుకు కూలడం ప్రారంభమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పరువు తీసేందుకు ఏదైనా కుట్ర చేస్తున్నారా.? అని అన్నారు.
- Tags
- bihar
- Bihar Bridge Collapse
- bjp
- JDU
- RJD
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..