Bihar: బీహార్లో కుంగిన వంతెన..20 రోజల్లో ఆరో ఘటన..
- బీహార్లో కుంగిన వంతెన..
- 20 రోజుల్లో ఆరో ఘటన..
- వరసగా రాష్ట్రం కుప్పకూలుతున్న వంతెనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: బీహార్లో వరసగా వంతెనలను ప్రమాదానికి గురవుతున్నాయి. రోజుల వ్యవధిలో వంతెనలు కూలిపోవడమో, కుంగిపోవడం జరుగుతోంది. తాజాగా మరో వంతెన ఆదివారం కుంగిపోయింది. 20 రోజుల్లో ఇది ఆరో ఘటన. భారీ వర్షాల తర్వాత బండ్ నది నీటిమట్ట పెరగడంతో ఠాకూర్గంజ్ బ్లాక్లోని వంతెన ఈ రోజు కొన్ని అడుగుల మేర కుంగిపోయింది. దీంతో వంతెన ఉపరితలంపై పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో వంతెన ప్రమాదకరంగా మారింది. పఠారియా పంచాయతీలోని ఖోషి డాంగి గ్రామంలో ఉన్న వంతెనను ఠాకూర్గంజ్లోని అప్పటి ఎంపీ ఎండీ తస్లీముద్దీన్ ఎంపీ నిధుల నుంచి 2007-2008లో నిర్మించారు. కానీ వంతెన నీటి ఒత్తిడిని తట్టుకోలేకపోయినట్లు తెలుస్తోంది. మూడు నాలుగు పంచాయతీలను కలుపుతున్న ఈ వంతెన కూలిపోతే 60 వేల మంది ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది.
Read Also: Araku Coffee: అరకు కాఫీపై ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు మధ్య ఆసక్తికర చర్చ
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- Cargo Ship Sinks in Bay of Bengal: బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం.. 24 మంది సిబ్బందితో సరుకు నౌక మునక
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
నిన్న మధుబని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. బీహార్ ప్రభుత్వంలోని రూరల్ వర్క్స్ డిపార్ట్మెంట్ రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంతెన కుప్పకూలింది. దీనికి ముందు అరారియా, సివాన్, తూర్పు చంపారన్ మరియు కిషన్గంజ్ ప్రాంతాల్లో వంతెనలు కూలాయి.
ఇటీవల బీహార్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వంతెనలు కూలిపోతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు ముఖ్యంగా ఆర్జేడీ పార్టీ అధికార జేడీయూ-బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర రాష్ట్రాలు బీహార్ ప్రజలకు ‘మంగళ్రాజ్’ అందించారని వంతెనల కూలిన ఘటనలపై ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ విమర్శించారు. అయితే, ఈ బ్రిడ్జిలు కూలిపోతున్న ఘటనపై ఏదైనా కుట్ర ఉందా..? అనే అనుమానాన్ని కేంద్రమంత్రి జీతన్ రామ్ మాంఝీ వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత నుంచే ఎందుకు కూలడం ప్రారంభమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పరువు తీసేందుకు ఏదైనా కుట్ర చేస్తున్నారా.? అని అన్నారు.
- Tags
- bihar
- Bihar Bridge Collapse
- bjp
- JDU
- RJD
తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభ వార్తలే.. నేడు డబ్బే డబ్బు!
-
Cargo Ship Sinks in Bay of Bengal: బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం.. 24 మంది సిబ్బందితో సరుకు నౌక మునక
-
Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
-
Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!