Delhi Accident: ఆర్థిక శాఖ అధికారిని చంపిన కేసులో కీలక ట్విస్ట్.. మహిళా నిందితురాలు ఎవరంటే..
- ఆర్థిక శాఖ అధికారిని చంపిన కేసులో కీలక ట్విస్ట్
- ఆస్పత్రిలో మహిళా నిందితురాలు అరెస్ట్
- ఆస్పత్రి నిందితురాలి కుటుంబానిదే కావడం విశేషం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి నవజ్యోత్ సింగ్ (52) మరణానికి కారణమైన బీఎండబ్ల్యూ కారు యజమాని గగన్ప్రీత్ కౌర్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్పత్రి నుంచి నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెట్రో పిల్లర్ నంబర్ 67 సమీపంలో బైక్పై భార్య సందీప్ కౌర్తో నవజ్యోత్ సింగ్ ఇంటికి వెళ్తున్నారు. ఇంతలో బీఎండబ్ల్యూ కారు వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. అక్కడికక్కడే నవజ్యోత్ ప్రాణాలు కోల్పోగా.. భార్య సందీప్ కౌర్ తీవ్రంగా గాయపడ్డారు. భార్యాభర్తలిద్దరూ బంగ్లా సాహిబ్ గురుద్వారాను సందర్శించి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.
ఇది కూడా చదవండి: Earthquake: ఓ వైపు భూప్రకంపనలు.. ఇంకోవైపు వణికిన పిల్లల వార్డు.. అస్సాం నర్సులు ఏం చేశారంటే..!
Also Read
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
- Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
- Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
ఇక కారులో భర్త పరీక్షిత్తో కలిసి గగన్ప్రీత్ కౌర్ వేగంగా వెళ్తుండగా బైక్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న దంపతులకు కూడా గాయాలయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే నవజ్యోత్ సింగ్, ఆయన భార్య సందీప్ కౌర్ను జీటీబీ నగర్లోని న్యూలైఫ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఆస్పత్రి నిందితురాలు గగన్ప్రీత్ కుటుంబానికి సంబంధించింది కావడం విశేషం. ఆమె తండ్రి ఆస్పత్రి యాజమాన్యంలో భాగంగా ఉన్నట్లు వర్గాలు పేర్కొన్నాయి. గురుగ్రామ్ నివాసితులైన గగన్ప్రీత్, పరీక్షిత్ మక్కర్ దంపతులను టాక్సీలో ఆస్పత్రికి తరలించారు. ఇది ప్రమాద స్థలం నుంచి 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాస్తవంగా పక్కనే ఆస్పత్రి ఉండగా.. దాదాపు 19 కిలోమీటర్ల దూరంలో ఆస్పత్రికి తరలించడానికి కారణం నిందితురాలికి సంబంధించిన ఆస్పత్రినే కావడం విశేషం.
ఇది కూడా చదవండి: Acharya Devvrat: మహారాష్ట్ర గవర్నర్గా ఆచార్య దేవవ్రత్ ప్రమాణం
తన తల్లిదండ్రులను దూరంలో ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లారని నవజ్యోత్ సింగ్ కుమారుడు నవనూర్ సింగ్ ప్రశ్నించాడు. ప్రమాద స్థలిలో ఉన్న ఆస్పత్రి దగ్గరకు కాకుండా 19 కిలోమీటర్లు ఎందుకు తీసుకెళ్లారని నిలదీశాడు. తన తండ్రిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లుంటే బతికే వాడని కుమారుడు నవనూర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే తన తండ్రి చనిపోలేదని.. కొనఊపిరి ఉందని చెప్పాడు. ఈ కేసును తారుమారు చేసేందుకు ఇంత దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకొచ్చారని ఆరోపించాడు.
తాజావార్తలు
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
-
Kitchen Hacks: ఫ్రిజ్లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్గా ఉంటుంది!
-
SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!