PM Modi: రక్తం, నీరు కలిసి ప్రవహించవు..
- రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు..
- ఉగ్రవాదంపై పాకిస్తాన్కి ప్రధాని మోడీ వార్నింగ్..
- పరోక్షంగా సింధుజలాల ఒప్పందంపై వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా దేశ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. దేశ మహిళల సిందూరాన్ని దూరం చేస్తే ఏమవుతుందో పాకిస్తాన్కి తెలియజేశామని చెప్పారు. అణు బ్లాక్మెయిల్లకు దిగితే ఇక భారత్ ఎంతమాత్రం సహించదని పాకిస్తాన్ని హెచ్చరించారు. పాకిస్తాన్ సైన్యం భారత్ ప్రజల్ని, గుడులను, గురుద్వారాలను టార్గెట్ చేసిందని, మన సైన్యం స్థావరాలను టార్గెట్ చేసిందని ఆయన అన్నారు. పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లు భారతదేశంపై ప్రయోగించడాన్ని ప్రపంచం చూసిందని, భారత్ తన సొంత ఎయిర్ డిఫెన్స్ సిస్టం ద్వారా వాటిని మనం నాశనం చేశామని చెప్పారు.
Read Also: PM Modi: భారత్ ‘‘న్యూక్లియర్’’ బ్లాక్మెయిల్ని సహించదు.. పాక్కి మోడీ స్ట్రాంగ్ వార్నింగ్..
Also Read
అణ్వాయుధాలను అడ్డుపెట్టుకొని ఉగ్రవాదానికి పాల్పడతామంటే చూస్తూ ఊరుకోమని చెప్పారు. చనిపోయిన ఉగ్రవాదులను చూసి పాక్ ఆర్మీ ఆఫీసర్లు కన్నీరు పెట్టుకున్నారని, దీని ద్వారా పాక్ ప్రభుత్వం వీరి వెనక ఉన్నదనిన స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. ఉగ్రవాదం ఏ రోజైనా పాకిస్తాన్ని నాశనం చేయడం ఖాయమని అన్నారు. ఉగ్రవాదాన్ని మట్టుపెడితేనే పాకిస్తాన్కి మనుగడ ఉంటుందని చెప్పారు.
ఉగ్రవాదం ఆపేదాకా పాకిస్తాన్తో చర్చలు ఉండవని స్పష్టం చేశారు. ఒకవేళ చర్చలు ఉంటే పీఓకే పైనే అని అన్నారు. ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి సాగమని, అలాగే నీరు, రక్తం కలిసి ప్రవహించలేదని చెప్పారు. దీని ద్వారా సింధూ జలాల ఒప్పందాన్ని ప్రధాని మోడీ పరోక్షంగా ప్రస్తావించారు. గతంలో పుల్వామా దాడి సమయంలో కూడా ఇదే విషయాన్ని భారత్ స్పష్టం చేసింది. పహల్గామ్ దాడి తర్వాత, భారత్ సిందూ జలాల ఒప్పందాన్ని నిలిపేసింది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!