Sonia Gandhi: కాంగ్రెస్ ఓటమిని ఒప్పుకుంది.. సోనియా గాంధీ రాజ్యసభ సీటుపై బీజేపీ..
Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ యూపీ రాయ్ బరేలీ ఎంపీ బరిలో నిలవడం లేదు. తాజాగా ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభ స్థానానికి ఎన్నికవ్వాలని నిర్ణయించుకున్నారు. గాంధీ కుటుంబానికి రాయ్ బరేలీలో ప్రత్యేక అనుబంధం ఉంది. కాంగ్రెస్లో ఈ పరిణామంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని అంగీకరిస్తోందని బీజేపీ బుధవారం పేర్కొంది. సోనియా గాంధీ జైపూర్లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన తర్వాత బిజెపి ప్రతిస్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ హాజరయ్యారు.
Read Also: Jammu Kashmir: జమ్మూ సరిహద్దు వెంబడి భారత పోస్టులపై పాక్ కాల్పులు..
Also Read
- Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
- Puducherry Elections Exit poll 2026: పుదుచ్చేరిలో ఎన్డీయేదే అధికారం..
- Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!
- Tamilnadu Elections Exit Poll 2026: తమిళనాడులో స్టాలిన్ హవా.. చతికిలపడిన అన్నాడీఎంకే, టీవీకే..
ఈ పరిణామంపై బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్(ట్విట్టర్) వేదిక విమర్శలు చేశారు. ‘‘అమేథిలో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత, రాయ్ బరేలీ తర్వాతి స్థానంలో ఉంది. రాజ్యసభకు వెళ్లాలనే సోనియా గాంధీ నిర్ణయం పొంచి ఉన్న ఓటమిని అంగీకరించడమే’’అని ఆయన కామెంట్ చేశారు. గాంధీలు ఇప్పుడు తమ కంచుకోటల్ని విడిచిపెడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎస్పీ (సమాజ్వాదీ పార్టీ) 11 సీట్లు ఇచ్చినప్పటికీ యూపీలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందని బీజేపీ నేత చెప్పారు.
రాజస్థాన్లోని మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకదాన్ని కాంగ్రెస్ సునాయసంగా కైవసం చేసుకోనుంది. ఏప్రిల్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరేళ్ల పదవీ కాలం పూర్తి కావడంతో ఈ స్థానం ఖాళీ కానుంది. ఐదు సార్లు లోక్సభ ఎంపీగా పనిచేసిన తర్వాత తొలిసారిగా సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత 1999లో రాయ్ బరేలీ నుంచి తొలిసారిగా ఆమె ఎంపీగా ఎన్నికయ్యారు. గాంధీ కుటుంబం నుంచి దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత రాజ్యసభలోకి ప్రవేశిస్తున్న రెండో వ్యక్తిగా సోనియా గాంధీ గుర్తింపు తెచ్చుకున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ.. రాబోయే సార్వత్రి ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ లోని మొత్తం 80 స్థానాలు బీజేపీకి వస్తాయని గాంధీ కుటుంబానికి తెలుసు కాబట్టి ఉత్తర్ ప్రవేశ్ని వదిలిపెట్టారని అన్నారు.
తాజావార్తలు
-
Rohit Sharma గాయంపై కీలక అప్డేట్.. కెప్టెన్ Hardik Pandya ఏమన్నాడంటే.!
-
Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
-
Babar Azam: ఒక్క సెంచరీతో.. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ సరసన నిలిచిన బాబర్ ఆజమ్..
-
IFS Transfers : అటవీ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?