Sonia Gandhi: కాంగ్రెస్ ఓటమిని ఒప్పుకుంది.. సోనియా గాంధీ రాజ్యసభ సీటుపై బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ యూపీ రాయ్ బరేలీ ఎంపీ బరిలో నిలవడం లేదు. తాజాగా ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభ స్థానానికి ఎన్నికవ్వాలని నిర్ణయించుకున్నారు. గాంధీ కుటుంబానికి రాయ్ బరేలీలో ప్రత్యేక అనుబంధం ఉంది. కాంగ్రెస్లో ఈ పరిణామంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని అంగీకరిస్తోందని బీజేపీ బుధవారం పేర్కొంది. సోనియా గాంధీ జైపూర్లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన తర్వాత బిజెపి ప్రతిస్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ హాజరయ్యారు.
Read Also: Jammu Kashmir: జమ్మూ సరిహద్దు వెంబడి భారత పోస్టులపై పాక్ కాల్పులు..
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
ఈ పరిణామంపై బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్(ట్విట్టర్) వేదిక విమర్శలు చేశారు. ‘‘అమేథిలో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత, రాయ్ బరేలీ తర్వాతి స్థానంలో ఉంది. రాజ్యసభకు వెళ్లాలనే సోనియా గాంధీ నిర్ణయం పొంచి ఉన్న ఓటమిని అంగీకరించడమే’’అని ఆయన కామెంట్ చేశారు. గాంధీలు ఇప్పుడు తమ కంచుకోటల్ని విడిచిపెడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎస్పీ (సమాజ్వాదీ పార్టీ) 11 సీట్లు ఇచ్చినప్పటికీ యూపీలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందని బీజేపీ నేత చెప్పారు.
రాజస్థాన్లోని మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకదాన్ని కాంగ్రెస్ సునాయసంగా కైవసం చేసుకోనుంది. ఏప్రిల్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరేళ్ల పదవీ కాలం పూర్తి కావడంతో ఈ స్థానం ఖాళీ కానుంది. ఐదు సార్లు లోక్సభ ఎంపీగా పనిచేసిన తర్వాత తొలిసారిగా సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత 1999లో రాయ్ బరేలీ నుంచి తొలిసారిగా ఆమె ఎంపీగా ఎన్నికయ్యారు. గాంధీ కుటుంబం నుంచి దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత రాజ్యసభలోకి ప్రవేశిస్తున్న రెండో వ్యక్తిగా సోనియా గాంధీ గుర్తింపు తెచ్చుకున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ.. రాబోయే సార్వత్రి ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ లోని మొత్తం 80 స్థానాలు బీజేపీకి వస్తాయని గాంధీ కుటుంబానికి తెలుసు కాబట్టి ఉత్తర్ ప్రవేశ్ని వదిలిపెట్టారని అన్నారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!