Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Bjp Vs Congress After Veteran Leader Baba Siddique Shot Dead In Mumbai

Baba Siddique Murder: కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. బాబా సిద్ధిక్ హత్యపై రాజకీయ దుమారం..

Published Date :October 13, 2024 , 2:44 pm
By Venu Goapl Reddy
  • మహారాష్ట్ర రాజకీయాల్లో సిద్ధిక్ హత్య ప్రకంపనలు..
  • రాజకీయం చేయొద్దని కోరిని బీజేపీ సర్కార్..
  • రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయన్న కాంగ్రెస్..
Baba Siddique Murder: కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. బాబా సిద్ధిక్ హత్యపై రాజకీయ దుమారం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Baba Siddique Murder: ప్రముఖ మహారాష్ట్ర నేత, ఎన్సీపీ నాయకుడు, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య ఆ రాష్ట్రంలో పొలిటికల్ దుమారానికి కారణమైంది. ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి కార్యాయలం సమీపంలో గత రాత్రి కాల్చి చంపారు. ఈ హత్యని రాజకీయం చేయవద్దని బీజేపీ నేతృత్వంలోని మహా ప్రభుత్వం అభ్యర్థించగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. రాష్ట్రంలో ‘‘లా అండ్ ఆర్డర్’’ పతనమైందని నిందించింది. 66 ఏళ్ల సిద్ధిక్ బాంద్రా వెస్ట్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. గత రాత్రి ముగ్గురు నిందితులు ముసుగులు ధరించి, సమీపం నుంచి కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన సిద్ధిక్‌ని లీలావతి ఆస్పత్రికి తరలించే లోపే మరణించాడు.

ఈ హత్య తర్వాత ముంబై పోలీసులు ఇద్దరు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్లను అరెస్ట్ చేశారు. మరోకరు పరారీలో ఉన్నారు. నలుడు సల్మాన్ ఖాన్‌ని సిద్ధిక్ అత్యంత సన్నిహితుడు. ఇటీవల కాలంలో బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్‌ని చంపేందుకు గతంలో పలుమార్లు ప్రయత్నించింది. సల్మాన్ ఖాన్‌కి సన్నిహితుడు కావడంతోనే బిష్ణోయ్ గ్యాంగ్ సిద్ధిక్‌ని టార్గెట్ చేశాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read

  • Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
  • Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
  • Delhi: లక్ష్మీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
  • Gujarat: సూరత్‌లో బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని శిక్షించాలంటూ భారీ ఆందోళన

Read Also: Rajendra Nagar: రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్..

ఇదిలా ఉంటే, ఈ హత్యపై రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘బాబా సిద్ధిఖ్ జీ యొక్క విషాద మరణం దిగ్భ్రాంతికరమైనది , బాధాకరమైనది. ఈ భయానక సంఘటన మహారాష్ట్రలో శాంతి భద్రతలు పూర్తిగా పతనమైందని బహిర్గతం చేసింది. ప్రభుత్వం బాధ్యత వహించాలి మరియు న్యాయం గెలవాలి.’’ అంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా సిద్ధిక్ మరణానికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం నేరస్తుల్ని త్వరగా శిక్షించాలని కోరారు. మహరాష్ట్రలో ఎన్డీయే హాయంలో ఏం జరుగుతోందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రశ్నించారు.

బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారీ మాట్లాడుతూ.. మహాయుతి(బీజేపీ-శివసేన(షిండే)-ఎన్సీపీ(అజిత్ పవార్)) ప్రభుత్వం దోషుల్ని అణిచివేసేందుకు సమయం వృధా చేయదు అని అన్నారు. “ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ యొక్క మహారాష్ట్ర ప్రభుత్వం 24 గంటల్లోనే ఇద్దరు నిందితులను పట్టుకున్నాయి. మూడవ నిందితుడి కోసం అన్వేషణ కొనసాగుతోంది మరియు అతను కూడా త్వరలో పట్టుకుంటాడు” అని భండారీ చెప్పారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ హత్యను రాజకీయం చేయవద్దని కోరారు. ఈ కేసు దర్యాప్తు కోసం 5 బృందాలను ఇతర రాష్ట్రాలకు పంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు షూటర్లలో ఇద్దరు హర్యానాకు చెందిన గుర్మైల్ బల్జీత్ సింగ్ (23), ధరమ్‌రాజ్ కశ్యప్ (19)ని పట్టుకున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Baba Siddique
  • Baba Siddique Murder
  • Maharashtra
  • NCP
  • rahul gandhi

తాజావార్తలు

  • BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..

  • Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ

  • Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!

  • Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ

  • Panama Canal: హార్మూజ్‌ జలసంది మూసివేత..! ఒక్కో ట్యాంకర్‌పై రూ.37 కోట్లు సంపాదిస్తున్న ఓ చిన్న దేశం..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions