Rajendra Nagar: రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్..
- రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్..
- మార్నింగ్ వాకర్స్ పై కర్రలతో దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajendra Nagar: హైదరాబాద్లో గంజాయి విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా వీరి కార్యకలాపాలకు అడ్డుకట్ట పడడం లేదన్న విమర్శలున్నాయి. మరికొన్ని చోట్ల గంజాయి సేవించేవారు ముఠాగా ఏర్పడి బీభత్సం సృష్టిస్తున్నారు. గంజాయి మత్తులో రోడ్లపైనే భయాందోళన వాతావరణం సృష్టిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే వారిపై దాడికి పాల్పడ్డారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. గంజాయి మత్తులో మార్నింగ్ వాకింగ్ చేస్తున్న వారిపై తెల్లవారుజామున దాడి చేశారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ గూడ ఎర్రబోడలో ఐదుగురు సభ్యుల ముఠా గంజాయి మత్తులో ప్రవర్తించిన ఘటన చోటుచేసుకుంది.
Read also: HMDA Website: హైడ్రా బారిన పడకూడదంటే.. HMDA కొత్త వెబ్సైట్లో ఇలా చెక్ చేస్కోండి
Also Read
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
- Telangana: ప్రాణాలు విడిచిన వారిని వరించిన విజయం..
- Chevella Bus Tragedy: బస్సు ప్రమాదంలో తల్లితో పాటు 3 నెలల చిన్నారి మృతి.. గుండెల్ని పిండేస్తున్న ఫోటో
ఉదయం వాకింగ్కు వెళ్తున్న వారిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. అంతేకాదు దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులను కూడా కర్రలతో కొట్టారు. పార్క్ చేసిన వాహనాల అద్దాలను ధ్వంసం చేసి భయాందోళన వాతావరణాన్ని సృష్టించారు. వీరంతా గత కొద్ది రోజులుగా సమీపంలోని నిర్జన ప్రాంతంలో గంజాయి సేవిస్తూ వాకర్స్ పై వేధిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కుటుంబ సమేతంగా బయటకు వెళ్లాలంటేనే భయంగా ఉందని, పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వారినే లక్ష్యంగా చేసుకుని ఈ గంజాయి ముఠా బెదిరింపులకు పాల్పడుతోందని తెలిపారు. పోలీసులు చొరవ తీసుకుని గంజాయి ముఠా కార్యకలాపాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Sangareddy: బావి నీరు తాగడంతో గ్రామస్తులకు వాంతులు, విరేచనాలు
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవుట్..? తుది జట్టులో ఊహించని మార్పులు..
-
Good News : ఇక వాట్సాప్లోనే మార్కుల మెమో.. తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్.!
-
President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
-
Team India: టైటిల్ పోరు ఖరారు.. జూన్ 21న ‘మహా సంగ్రామం’..
-
RCB Player: ‘విరాట్ కోహ్లీ వల్లనే ఇదంతా.. రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్నాను’
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?