Mamata Banerjee: బీజేపీ ఎల్ఐసీ, బ్యాంకుల డబ్బును వాడుకుంటోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee criticizes BJP: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ), బ్యాంకులలో ప్రజలు డిపాజిట్ చేసిన డబ్బును బీజేపీ తన పార్టీ నాయకులకు లబ్ధి చేకూర్చేందుకు ఉపయోగిస్తోందిని మంగళవారం దీదీ ఆరోపించారు. పుర్బా బర్ధమాన్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ షేర్ మార్కెట్ భారీ పతనానికి కారణం అయిందని విమర్శించారు.
Read Also: INDvsAUS Test: భారత్-ఆసీస్ చివరి టెస్టుకు మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని!
Also Read
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాతే షేర్ మార్కెట్ భారీ పతనానికి గురైందని.. అనేక వేల కోట్ల రూపాయలను పంపింగ్ చేయాలంటూ కొంతమందికి ఫోన్ కాల్స్ వెళ్లాయని ఆమె అన్నారు. 2024 జనరల్ ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ అన్ని అబద్ధాలతో నిండి ఉందని అభివర్ణించారు.
ఇదిలా ఉంటే బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఆపేందుకు రాహుల్ గాంధీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలు ప్రయత్నించారని.. ఇప్పుడు బుల్లెట్ రైలు పనులు వేగంగా జరుగుతున్నాయని బీజేపీ విమర్శించింది. గతంలో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఆగిపోవడానికి అన్ని ప్రయత్నాలు చేసిందని బీజేపీ ఆరోపించింది. దేశాన్ని పురోగమించకుండా చేసి సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే మిగిలిపోతారంటూ మండిపడింది.
తాజావార్తలు
-
Rahul Gandhi: హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదం.. ఎఫ్ఐఆర్కు రాహుల్ గాంధీ డిమాండ్
-
AI in Cinema: సినీ రంగంపై ఏఐ ఎఫెక్ట్.. సెట్లో 20% మనుషులు, 80% AI.. జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి?
-
Ashwin: “కోహ్లీ కంటే బుమ్రానే బెటర్”.. భారత క్రికెట్ గ్రేటెస్ట్పై అశ్విన్ సంచలన తీర్పు
-
Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!