Madhy Pradesh: లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న తరుణంలో బీజేపీకి ఈ విజయం దక్కడంపై ఆ పార్టీ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 5 జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న 19 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. దీంతో 11 మున్సిపాలిటీల్లో బీజేపీ విజయం సాధించగా.. 8 పట్టణాల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధించింది. బీజేపీ అభ్యర్థులు 183 కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకోగా.. 143 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.
Read Also: HCU: హెచ్సీయూలో మోదీ డాక్యుమెంటరీ కలకలం.. అధికారులు విచారణ
Also Read
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ సొంతగడ్డ రఘోఘర్ మున్సిపాలిటీ కూడా ఉంది. 24 కౌన్సిలర్ స్థానలు ఉన్న ఈ పట్టణంలో కాంగ్రెస్ 16 వార్డులను, బీజేపీ 8 వార్డుల్లో విజయం సాధించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సెక్రటరీ రాజేష్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. 19 అర్బన్ బాడీలలోని 343 కౌన్సిలర్ స్థానాల్లో 183 స్థానాల్లో బీజేపీ, 143 స్థానాల్లో కాంగ్రెస్, మిగత చోట్ల ఇండిపెండెంట్లు గెలుపొందారు.
ఈ ఏడాది మధ్యప్రదేశ్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ గెలుపుపై బీజేపీ హర్షం వ్యక్తం చేస్తోంది. మరోసారి మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. జ్యోతిరాధిత్య సింథియా తిరుగుబాటుతో అధికారం కోల్పోయింది. సింథియా వర్గం ఎమ్మెల్యేలు రాజీనామా బీజేపీకి మద్దతు ప్రకటించడంతో తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చింది.
తాజావార్తలు
-
Dal Dhokli Recipe : ఉల్లి, వెల్లుల్లి లేని ట్రెడిషనల్ గుజరాతీ ట్రెడిషనల్ వంటకం .. దీక్షలో ఉన్నప్పుడు భలే రుచిగా.!
-
NTRNeel : ఎన్టీఆర్ బర్త్డే ‘డబుల్ ధమాకా’.. ‘డ్రాగన్’ గ్లింప్స్.. ఇంకా..!
-
KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
-
Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
-
Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..