BJP Parliamentary Board: ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయనున్న బీజేపీ.. ఇవాళే కీలక భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ఉప రాష్ట్ర ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది.. ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా.. ఆగస్టు 6వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబందించి పోలింగ్ నిర్వహించనున్నారు. అదేరోజు ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.. ఇక, ఈ నెల 19 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 20న నామినేషన్లను పరిశీలించనున్నారు. 22న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఉంది.. అయితే, ఈ ఏడాది ఆగష్టు 10వ తేదీతో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియనుంది. ఇక, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు సాగుతోంది.. దీనికోసం ఇవాళ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది.. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ప్రధాని మోడీతో పాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరుకానున్నారు. సాయంత్రం 5:30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది.
Read Also: England: బ్రిటన్ లో భారీగా ఉష్ణోగ్రతలు.. రెడ్ అలర్ట్, ఎమర్జెన్సీ
Also Read
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
- Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
- NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
- Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా హాజరుకానున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు కొద్ది రోజులే మిగిలి ఉంది. బీజేపీ కార్యాలయంలో జరిగే పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పార్టీ జాతీయ సంస్థ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కూడా హాజరుకాబోతున్నారు.. ఈ సమావేశంలోనే బీజేపీ నేతలు ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాల నేతలతో ఫోన్లో చర్చించి, ఆ తర్వాత ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ప్రకటిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం లోక్సభలో బీజేపీకి 303 మంది సభ్యులు ఉండగా, రాజ్యసభలో 91 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో ఈ 91 మంది సభ్యులతో పాటు, 5 నామినేటెడ్ సభ్యులు కూడా బీజేపీకి ఓటు వేయవచ్చు.. దీంతో.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి ఎవరు? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
-
Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
-
Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!