BJP MP: యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తూ పట్టుబడింది. భారత సైనిక వివరాలతో పాటు పలు సున్నిత వివరాలను పాకిస్తాన్ అధికారులతో పంచుకుంది. దీనికి తోడు ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలోని ఓ అధికారితో అత్యంత సన్నిహిత సంబంధాలను ఉన్నట్లు తేలింది. ఈ అధికారిని భారత్ బహిష్కరించింది. పలు సందర్భాల్లో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లి వచ్చింది. పాకిస్తాన్ హై కమిషన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు హాజరైంది.